logo

అల్లాపురం విద్యార్థి.. సికింద్రాబాద్‌ అభ్యర్థి

చౌటుప్పల్‌ మండలం అల్లాపురానికి చెందిన విద్యార్థి రాసాల వినోద్‌ యాదవ్‌ సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ధర్మసమాజ్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు

Updated : 07 May 2024 07:05 IST

 సికింద్రాబాద్‌ ధర్మ సమాజ్‌ పార్టీ అభ్యర్థి రాసాల వినోద్‌యాదవ్‌

 చౌటుప్పల్‌ మండలం అల్లాపురానికి చెందిన విద్యార్థి రాసాల వినోద్‌ యాదవ్‌ సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ధర్మసమాజ్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. బీటెక్‌, ఎంఏ సోషియాలజీ చదివిన ఇతను ఇటీవల గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించాడు. ఆ పరీక్ష రద్దవడంతో ఎల్‌ఎల్‌బీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ధర్మసమాజ్‌ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు పార్టీ అధిష్ఠానం అవకాశమివ్వడంతో నామినేషన్‌ దాఖలు చేసి కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. 2023లో నిర్వహించిన శాసనసభ ఎన్నికల్లో ఇదే పార్టీ అభ్యర్థిగా ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు ఆయుధంతో రాజ్యాధికారం చేజిక్కించుకుని మనల్ని మనమే పాలించుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీలను చైతన్యం చేసేందుకు ఎన్నికల బరిలో నిల్చినట్టు ఆయన ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.  

 న్యూస్‌టుడే, చౌటుప్పల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని