logo

పోలింగ్‌ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలి: కలెక్టర్‌

పోలింగ్ ప్రక్రియను నిశితంగా గమనించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే మైక్రో అబ్జర్వర్లకు సూచించారు.

Published : 08 May 2024 21:37 IST

భువనగిరి: పోలింగ్ ప్రక్రియను నిశితంగా గమనించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేటు సమావేశ మందిరంలో భువనగిరి పార్లమెంటు 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన మైక్రోఅబ్జర్వర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోలింగ్ సజావుగా జరిగేందుకు క్షేత్రస్థాయిలో పోలింగ్ ప్రక్రియను నిశితంగా గమనించాలని, జనరల్ అబ్జర్వరుకు సకాలంలో రిపోర్టులు సమర్పించాలని తెలియచేస్తూ పోలింగ్ కేంద్రాలలో అన్ని వసతులు ఉన్నాయా లేదా పరిశీలించాలని, పోలింగ్ ఏజెంట్ల వివరాలు, 17-ఎ రిజిష్టర్ల నిర్వహణ, పోలింగ్ పూర్తయ్యేంత వరకు జరిగే ప్రక్రియపై నివేదికలు ఇవ్వాలని సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని