logo

పోలింగ్ ఏర్పాట్లపై సమీక్ష

పోలింగ్ కేంద్రాలలో అన్ని వసతులు ఉండాలని, విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు కె.గంగాధర్ మండల అభివృద్ది అధికారులకు, పంచాయితీ సెక్రటరీలకు సూచించారు.

Published : 08 May 2024 21:52 IST

భువనగిరి: పోలింగ్ కేంద్రాలలో అన్ని వసతులు ఉండాలని, విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు కె.గంగాధర్ మండల అభివృద్ది అధికారులకు, పంచాయితీ సెక్రటరీలకు సూచించారు. బుధవారం ఆలేరు అసెంబ్లీ నియోజక వర్గానికి చెందిన ఎంపీడీవోలు, పంచాయితీ సెక్రటరీలతో మీటింగ్ హాలులో సమావేశమై పోలింగ్ కేంద్రాలలో చేపట్టే వసతులపై సమీక్షించారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి, జిల్లా పంచాయితీ అధికారి సునంద పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని