ఆరుబయట నిలిపితే.. అంతే
ఈ చిత్రంలో ముఖానికి కర్చీఫ్ కట్టుకొని ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మార్చి 28న కోదాడ పట్టణంలోని ఓ వైన్స్ దుకాణం ముందు రాత్రి సమయంలో నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనం మీద కాసేపు కూర్చొని, తర్వాత అతడి దగ్గర ఉన్న దొంగ కీ సాయంతో దాన్ని తీసుకుపోయాడు.
ఈ చిత్రంలో ముఖానికి కర్చీఫ్ కట్టుకొని ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మార్చి 28న కోదాడ పట్టణంలోని ఓ వైన్స్ దుకాణం ముందు రాత్రి సమయంలో నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనం మీద కాసేపు కూర్చొని, తర్వాత అతడి దగ్గర ఉన్న దొంగ కీ సాయంతో దాన్ని తీసుకుపోయాడు. ఇప్పటికీ అతడి ఆచూకీ దొరకలేదు.
గత నెల 12న కోదాడ పట్టణంలోని కట్టకొమ్ముగూడెం శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఇంటి ముందు ద్విచక్ర వాహనం నిలిపి ఉంచగా, రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి దొంగ కీ సాయంతో ఆ వాహనాన్ని చోరీ చేశాడు. నేటికీ ఆ దొంగ ఆచూకీ లభించలేదు.
కోదాడ, న్యూస్టుడే: ఆరుబయట నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలకు రక్షణ లేకుండా పోతోంది. ద్విచక్ర వాహనాలు వరుసగా చోరీలకు గురవుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. పట్టణాలనే లక్ష్యంగా చేసుకొని కాలనీల్లో ఆరుబయట నిలిపి ఉంచిన వాహనాలను గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోతున్నారు. ఈ వాహనాలను గుర్తించడంలో పోలీసులు అలసత్వం వహించడంతో దొంగలకు భయం లేకుండా పోయింది.
తాళం వేసినా..
తాళం వేసి ఉంచిన ద్విచక్ర వాహనాలూ చోరీకి గురవుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ప్రత్యేకంగా తాళంచెవులు చేయించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. పట్టణాల్లోనే ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో రెండు రోజులకు ఒక ద్విచక్రవాహనం చోరీకి గురవుతోంది. క్షేత్రస్థాయిలో పోలీసులు తమ దర్యాప్తులో దొంగలను కనిపెట్టలేకపోతున్నారు. దీంతో చోరీలకు గురైన వాహనాలు బాధితులకు అందట్లేదు. ఏడాది కాలంగా జిల్లాలో సుమారు 162కు పైగా వాహనాలు చోరీ కాగా వాటిలో 54 వాహనాలు మాత్రమే దొరికాయి. మిగతా 108 వాహనాల ఆచూకీ పోలీసులు కనిపెట్టలేకపోవడంతో బాధితులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో వాహనం విలువ సుమారు రూ.50 వేల ధర చొప్పున లెక్కించినా సుమారు రూ.60 లక్షలు విలువ చేసే వాహనాలను బాధితులు కోల్పోయారు.
దొంగలను గుర్తించి వాహనాలు రికవరీ చేస్తాం
కొందరు దుండగులు రాత్రి సమయంలో ఆరుబయట నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్నారు. దొంగలను గుర్తించి వాహనాలను రికవరీ చేస్తాం. స్థానికులు రాత్రి ఆరుబయట వాహనాలు నిలిపిఉంచొద్దు.
రాము, పట్టణ ఇన్స్పెక్టర్, కోదాడ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాదాద్రీశుడి జయంత్యుత్సవాలకు శ్రీకారం
[ 20-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో నారసింహుడు జయంత్యుత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా సోమవారం ఉదయం మొదలయ్యాయి. -
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి(ఎమ్మెల్సీ) నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక జరగనుంది. -
గృహజ్యోతిపై భానుడి ప్రతాపం
[ 20-05-2024]
భానుడు గత పది సంవత్సరాల ఉష్ణోగ్రత రికార్డును అధిగమించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. -
డిగ్రీ విద్యార్థులకు దోస్త్
[ 20-05-2024]
ఇంటర్లో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది చేరేది డిగ్రీ. తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) వెబ్సైట్’ను ప్రారంభించింది. -
మరోసారి గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్
[ 20-05-2024]
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కీలకమైందని, పట్టభద్రులు విజ్ఞతతో ఓటేసి నిజాయతీ గల భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసన మండలికి పంపాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. -
దర్జీగా.. ఇక దర్జాగా..!
[ 20-05-2024]
మహిళలు ఆర్థిక సాధికారత పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడులు మహిళలకు అప్పగించింది. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
రాష్ట్రానికి ఈ సారి ముందస్తుగా రుతు పవనాలు చేరుకుంటాయని, వర్షాలు కూడా గత ఏడాది కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
పట్టభద్రుల ఉప ఎన్నికకు రంగం సిద్ధం
[ 20-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. -
పదికి సంసిద్ధత
[ 20-05-2024]
తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను రాబోయే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదో తరగతికి సంసిద్ధులను చేస్తోంది జిల్లా విద్యాశాఖ. -
అరచేతిలో పుస్తక ప్రపంచం
[ 20-05-2024]
పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు లిటరసీ క్లౌడ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. -
మోదీ పాలనలో కుంభకోణాలు లేవు: ఈటల
[ 20-05-2024]
భాజపా పదేళ్ల పాలనలో దేశంలో ఎలాంటి కుంభకోణాలు లేకుండా మోదీ పరిపాలించారని మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి: మంత్రి ఉత్తమ్
[ 20-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
ఎర్లీబర్డ్తో ఖజానాకు కాసులు
[ 20-05-2024]
పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
[ 20-05-2024]
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్
-
రైసీ తర్వాత ఇప్పుడు అధికారం ఎవరు చేపడతారు..?
-
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
-
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
-
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్