ఎల్లయ్య హత్య కేసులో కొత్త మలుపు
తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట మండల కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య హత్య కేసు బుధవారం మరో కొత్త మలుపు తిరిగింది.
మృతుడు వడ్డె ఎల్లయ్య
జగ్గయ్యపేట, న్యూస్టుడే: తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట మండల కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య హత్య కేసు బుధవారం మరో కొత్త మలుపు తిరిగింది. గత నెల 18న ఏపీ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అతన్ని హత్య చేసినట్లు ప్రధాన నిందితుడు తాడూరి శ్రీకాంతాచారి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. జగ్గయ్యపేట పోలీసులు అదృశ్యం కేసును హత్యగా మార్చి గత నెల 31న నిందితుడిని అరెస్ట్ చేశారు. ఎల్లయ్య మృతదేహాన్ని విశాఖపట్నం సముద్రంలో పడేసినట్లు చారి ఆ సమయంలో చెప్పాడు. అందుకు భిన్నంగా జరిగినట్లు అదుపులోకి తీసుకున్న వారి నుంచి తెలుసుకున్న పోలీసులు జగ్గయ్యపేట మండలం వేదాద్రి - బండిపాలెం మధ్య అటవీ ప్రాంతంలో నిందితులు సగం కాల్చి అనంతరం పూడ్చి పెట్టిన ఎల్లయ్య మృతదేహాన్ని బుధవారం గుర్తించారు. పూర్తిగా దహనం చేయడానికి కుదరకపోవడంతో ఇంకుడు గుంత తీసి పక్కన వేసిన మట్టితో మృతదేహాన్ని ఖననం చేసినట్లు భావిస్తున్నారు. సూర్యాపేట నుంచి మృతుని కుటుంబ సభ్యులతో పాటు ఐదారు వాహనాల్లో వచ్చిన బంధు వర్గం మృతదేహం చూసి ఎల్లయ్యదే అని గుర్తించి ఒక్కసారిగా బోరున విలపించారు. వారి రోదనలు మిన్నంటాయి. తహసీల్దార్ శేషు, సీఐ జానకీరాం, ఎస్ఐ సూర్యభగవాన్ల సమక్షంలో వైద్యాధికారులు అక్కడే మృతదేహానికి మరణోత్తర పరీక్ష నిర్వహించారు. వ్యాపార వైషమ్యాల నేపథ్యంలో పాత నేరస్థుడైన శ్రీకాంతాచారి పథకం ప్రకారం మరికొందరి సాయంతో ఎల్లయ్యను హత మార్చినట్లు నిర్ధారణ అయింది. మృతుడి కారుని జాతీయ రహదారి పక్కనున్న కొణకంచి గ్రామంలోని ఒక ఇంటి ప్రహరీ పక్కనే ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. పంచనామా తరువాత మృతదేహాన్ని ఎల్లయ్య కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి(ఎమ్మెల్సీ) నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక జరగనుంది. -
గృహజ్యోతిపై భానుడి ప్రతాపం
[ 20-05-2024]
భానుడు గత పది సంవత్సరాల ఉష్ణోగ్రత రికార్డును అధిగమించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. -
డిగ్రీ విద్యార్థులకు దోస్త్
[ 20-05-2024]
ఇంటర్లో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది చేరేది డిగ్రీ. తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) వెబ్సైట్’ను ప్రారంభించింది. -
మరోసారి గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్
[ 20-05-2024]
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కీలకమైందని, పట్టభద్రులు విజ్ఞతతో ఓటేసి నిజాయతీ గల భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసన మండలికి పంపాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. -
దర్జీగా.. ఇక దర్జాగా..!
[ 20-05-2024]
మహిళలు ఆర్థిక సాధికారత పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడులు మహిళలకు అప్పగించింది. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
రాష్ట్రానికి ఈ సారి ముందస్తుగా రుతు పవనాలు చేరుకుంటాయని, వర్షాలు కూడా గత ఏడాది కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
పట్టభద్రుల ఉప ఎన్నికకు రంగం సిద్ధం
[ 20-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. -
పదికి సంసిద్ధత
[ 20-05-2024]
తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను రాబోయే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదో తరగతికి సంసిద్ధులను చేస్తోంది జిల్లా విద్యాశాఖ. -
అరచేతిలో పుస్తక ప్రపంచం
[ 20-05-2024]
పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు లిటరసీ క్లౌడ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. -
మోదీ పాలనలో కుంభకోణాలు లేవు: ఈటల
[ 20-05-2024]
భాజపా పదేళ్ల పాలనలో దేశంలో ఎలాంటి కుంభకోణాలు లేకుండా మోదీ పరిపాలించారని మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి: మంత్రి ఉత్తమ్
[ 20-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
ఎర్లీబర్డ్తో ఖజానాకు కాసులు
[ 20-05-2024]
పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
[ 20-05-2024]
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని.. తాతను కొట్టి చంపిన మనవళ్లు
-
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
-
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు