logo

భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు

కాంగ్రెస్‌ నాయకుడు, జనశక్తి మాజీ సభ్యుడు వడ్డె ఎల్లయ్య అంత్యక్రియలు పోలీసుల భారీ బందోబస్తు నడుమ సూర్యాపేట మండలం ఎల్కారం గ్రామంలో బుధవారం రాత్రి పూర్తిచేశారు.

Published : 09 May 2024 06:41 IST

ఎల్కారంలో వడ్డె ఎల్లయ్య భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి

సూర్యాపేట (తాళ్లగడ్డ), న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ నాయకుడు, జనశక్తి మాజీ సభ్యుడు వడ్డె ఎల్లయ్య అంత్యక్రియలు పోలీసుల భారీ బందోబస్తు నడుమ సూర్యాపేట మండలం ఎల్కారం గ్రామంలో బుధవారం రాత్రి పూర్తిచేశారు. జగ్గయ్యపేట మండలం నుంచి ప్రత్యేక వాహనంలో మృతదేహాన్ని గ్రామానికి తరలించిన కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఎల్లయ్యకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్దకుమార్తె ఆయన చితికి నిప్పంటించారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ పటేల్‌ రమేశ్‌రెడ్డి ఎల్లయ్య భౌతికకాయానికి నివాళులర్పించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సూర్యాపేట డీఎస్పీ రవి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని