logo

భాజపాని విమర్శిస్తే.. అవినీతిపరులా: జూలకంటి

భాజపా, మోదీని విమర్శించే వారు.. అవినీతి పరులంటూ ముద్రలు వేస్తున్నారని, కానీ ఆ పార్టీకి చెందిన వారే అత్యంత అవినీతి పరులని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు.

Published : 09 May 2024 06:55 IST

మాడ్గులపల్లిలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ

సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, చిత్రంలో నాయకులు

మాడ్గులపల్లి, న్యూస్‌టుడే: భాజపా, మోదీని విమర్శించే వారు.. అవినీతి పరులంటూ ముద్రలు వేస్తున్నారని, కానీ ఆ పార్టీకి చెందిన వారే అత్యంత అవినీతి పరులని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. మాడ్గులపల్లిలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపాను సమర్ధిస్తే మంచివాళ్లని.. లేదంటే అవినీతి పరులంటూ జైళ్లకు పంపిస్తారన్నారు. ఇద్దరు సీఎంలను జైలుకు పంపించి మోదీ నియంతృత్వ పాలనను అవలంబిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల బాండ్ల పేరుతో భాజపా రూ.లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. ప్రజా అవసరాలను తీర్చాల్సిన కేంద్ర ప్రభుత్వం మతం పేరుతో రాజకీయాలు చేస్తే ప్రజలు క్షమించబోరన్నారు. ఇండియా కూటమికి మద్దతుగా నల్గొండ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్ధి రఘవీర్‌రెడ్డి గెలుపు కోసం పూర్తి సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్‌, సహాయ కార్యదర్శి పుల్లెంల శ్రీకర్‌, పాదూరి గోవర్థని, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని