నిరంతరం నిఘా..!
ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని పారదర్శక ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ సేవలు
అంతర్జాలం లేకుంటే సీసీకెమెరాల ఏర్పాటు
భానుపురి, న్యూస్టుడే: ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని పారదర్శక ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సరళిని నిరంతరం పర్యవేక్షించేందుకు వెబ్కాస్టింగ్ నిర్వహిస్తోంది. అంతర్జాలం అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా సీసీ కెమెరాల్లో వీక్షించనున్నారు. వెబ్కాస్టింగ్కు గతంలో ఇంజినీరింగ్ విద్యార్థుల సేవలను వినియోగించుకోగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రస్థాయిలో ఒక ప్రైవేటు ఏజెన్సీ నిర్వహణ బాధ్యతలు తీసుకుంది.
దొంగ ఓట్లకు చెక్
పోలింగ్ కేంద్రాల్లో ఒకరికి బదులు మరొకరు వచ్చి దొంగ ఓటు వేస్తున్నారనే ఫిర్యాదులు తరచూ వస్తుంటాయి. అల్లర్లు, గొడవలకు తావులేకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం 2018లో తొలిసారిగా వెబ్కాస్టింగ్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఓటింగ్ ప్రక్రియ ముగిసే వరకు నిరంతరం ఆన్లైన్లో నిక్షిప్తమవుతోంది. వీటిని జిల్లా కేంద్రంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి అనుసంధానిస్తారు. ఎక్కడైనా అల్లర్లు, ఘర్షణలు జరిగితే వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దుతారు.
ఇలా పర్యవేక్షణ..
- సమస్యాత్మక ప్రాంతాలు, వెయ్యి ఓటర్ల కంటే ఎక్కువ ఉన్న పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహిస్తారు.
- ప్రైవేటు ఏజెన్సీ నిర్వాహకులు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న యువతను ఎంపిక చేస్తుంది.
- ఎంపికైన యువతకు వెబ్కాస్టింగ్ ఎలా చేయాలనే అంశంపై శిక్షణ ఇస్తారు.
- వెబ్కాస్టింగ్ ద్వారా జిల్లా స్థాయిలో అధికారులు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని పర్యవేక్షిస్తారు.
- ఏవైనా ఘటనలు జరిగితే వీడియో చిత్రాలను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటారు.
పల్లెల్లోనే సమస్య
పల్లెల్లో 4జీ, 5జీ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇదీ పోలింగ్ కేంద్రాల్లో జరిపే వెబ్కాస్టింగ్కు ప్రతికూలంగా మారింది. సిగ్నల్ సక్రమంగా లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఫలితం దక్కటం లేదు. కొన్నిచోట్ల ప్రత్యామ్నాయంగా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నకిలీ విత్తనాలు అరికట్టడంలో డీలర్లు సహకరించాలి
[ 20-05-2024]
నకిలీ విత్తనాలు అరికట్టడంలో డీలర్లు సహకరించాలని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని జిల్లా కలెక్టరు హనుమంతు కే.జెండగే తెలిపారు. -
ఎన్నికల నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలి
[ 20-05-2024]
ఎం.ఎల్.సి ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే సెక్టార్ ఆఫీసర్లకు, టీములకు సూచించారు. -
యాదాద్రీశుడి జయంత్యుత్సవాలకు శ్రీకారం
[ 20-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో నారసింహుడు జయంత్యుత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా సోమవారం ఉదయం మొదలయ్యాయి. -
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి(ఎమ్మెల్సీ) నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక జరగనుంది. -
గృహజ్యోతిపై భానుడి ప్రతాపం
[ 20-05-2024]
భానుడు గత పది సంవత్సరాల ఉష్ణోగ్రత రికార్డును అధిగమించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. -
డిగ్రీ విద్యార్థులకు దోస్త్
[ 20-05-2024]
ఇంటర్లో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది చేరేది డిగ్రీ. తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) వెబ్సైట్’ను ప్రారంభించింది. -
మరోసారి గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్
[ 20-05-2024]
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కీలకమైందని, పట్టభద్రులు విజ్ఞతతో ఓటేసి నిజాయతీ గల భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసన మండలికి పంపాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. -
దర్జీగా.. ఇక దర్జాగా..!
[ 20-05-2024]
మహిళలు ఆర్థిక సాధికారత పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడులు మహిళలకు అప్పగించింది. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
రాష్ట్రానికి ఈ సారి ముందస్తుగా రుతు పవనాలు చేరుకుంటాయని, వర్షాలు కూడా గత ఏడాది కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
పట్టభద్రుల ఉప ఎన్నికకు రంగం సిద్ధం
[ 20-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. -
పదికి సంసిద్ధత
[ 20-05-2024]
తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను రాబోయే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదో తరగతికి సంసిద్ధులను చేస్తోంది జిల్లా విద్యాశాఖ. -
అరచేతిలో పుస్తక ప్రపంచం
[ 20-05-2024]
పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు లిటరసీ క్లౌడ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. -
మోదీ పాలనలో కుంభకోణాలు లేవు: ఈటల
[ 20-05-2024]
భాజపా పదేళ్ల పాలనలో దేశంలో ఎలాంటి కుంభకోణాలు లేకుండా మోదీ పరిపాలించారని మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి: మంత్రి ఉత్తమ్
[ 20-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
ఎర్లీబర్డ్తో ఖజానాకు కాసులు
[ 20-05-2024]
పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
[ 20-05-2024]
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నా కాల్ డేటా చూసుకోండి.. విచారణకు సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయులు
-
చివరి రోజుల్లో నా తల్లికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స: మోదీ
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్.. కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్
-
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక
-
కిర్గిజ్స్థాన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆరా
-
విశాఖ ఘటనపై చర్యలు తీసుకోండి: ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ