29న కావలి, వింజమూరుల్లో చంద్రబాబు పర్యటన
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 29వ తేదీ కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో రోడ్షో, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
ముమ్మర ఏర్పాట్లలో తెదేపా నాయకులు
ఈనాడు, నెల్లూరు: వింజమూరు, కావలి, న్యూస్టుడే: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 29వ తేదీ కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో రోడ్షో, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత.. తొలిసారి చంద్రబాబునాయుడు జిల్లాకు వస్తుండటంతో నాయకులు, అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కావలిలో తెదేపా అసెంబ్లీ అభ్యర్థి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి, నాయకులు, అనుచరులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జడ్పీ మైదానం దగ్గర హెలిప్యాడ్, బహిరంగ సభ ప్రాంతాలను బీద రవిచంద్ర, మాలేపాటి సుబ్బానాయుడుతో కలిసి పరిశీలించారు. వింజమూరులో పంచాయతీ బస్టాండ్ సమీపంలో రోడ్షో అనంతరం కాన్వాయ్ పై నుంచి చంద్రబాబు మాట్లాడేలా కసరత్తు చేస్తున్నారు. వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కంకణబద్దుడై చంద్రబాబు వస్తున్నారని, తెదేపా అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కాకర్ల సురేష్, దగుమాటి కృష్ణారెడ్డిలను ప్రజలు ఆశీర్వదించాలని కోరుతూ శంఖారావం పూరిస్తారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కంభం విజయరామిరెడ్డి, వంటేరు వేణుగోపాల్రెడ్డి, జడ్పీ మాజీ ఛైర్మన్ చెంచలబాబు యాదవ్, మండల కన్వీనరు గొంగటి రఘునాథరెడ్డి, మాజీ ఎంపీపీ కుర్తి రవీంద్రబాబు, కాకర్ల వెంకట్, చల్లా వెంకటేశ్వర్లు, గుణపం సుదర్శన్రెడ్డి, చల్లా శ్రీనివాసులు, మాజీ మండల కన్వీనరు గూడా నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పర్యటన సాగుతోందిలా!.. చంద్రబాబునాయుడు శుక్రవారం మధ్యాహ్నం బనగానపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి.. 2.50 గంటలకు కావలి పట్టణం అరుంధతిపాలెంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో ఎ.ఎం.బేకరి దగ్గరకు చేరుకుంటారు. 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరిగే సభలో మాట్లాడతారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి హెలిప్యాడ్కు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు బయలుదేరుతారు. 5.15 గంటలకు రాఘవేంద్ర ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. 5.25కు బస్టాండ్ సమీపంలోని ప్రధాన రహదారికి చేరుకుని.. 5.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గంలో వింజమూరులోని ఎస్.వి.కన్వెన్షన్ సెంటర్కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం
[ 27-04-2024]
దగదర్తిలోని పెద్దపుత్తేడు గ్రామం అరుంధతి వాడలో మండల తెదేపా నాయకుడు మాలేపాటి రవీంద్ర నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
[ 27-04-2024]
వైద్యసేవలు ప్రతి ఇంటికి అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం.. హెల్త్ క్లినిక్ సెంటర్లను ఏర్పాటు చేసింది. వైద్యసేవలను అందించేందుకు ఎంఎల్హెచ్పీలు సిబ్బందిని నియమించారు. -
ఉన్నత విద్య.. జగన్ మిథ్య
[ 27-04-2024]
విశ్వవిద్యాలయాలు ప్రగతిపథంలో నడవాలన్నా.. విద్యార్థులు చేరేందుకు పోటీపడాలన్నా.. పేరున్న విదేశీ విశ్వవిద్యాలయాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు రావాలన్నా.. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
జిల్లాలో సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ముగిసింది. శుక్రవారం నెల్లూరు పార్లమెంటు, ఎనిమిది నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
నేడు తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన
[ 27-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.25కు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. -
ఓటుతో.. వైకాపాను తరిమికొడదాం
[ 27-04-2024]
‘ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా వైకాపా అరాచక పాలనకు చరమగీతం పాడాలి. ప్రజల సంక్షేమం.. అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిగా కాదు.. -
అధికారమే అండ.. ఆక్రమణలే అజెండా!
[ 27-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక సాగునీటి వనరులకు రక్షణ లేకుండా పోయింది. ఖాళీగా కనిపిస్తే చాలు.. అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సాగునీటి కాలువలనే ఆలోచన లేకుండా కబ్జా చేస్తున్నారు. -
నిమ్మధరలు ఆశాజనకం
[ 27-04-2024]
పొదలకూరు నిమ్మ మార్కెట్లో శుక్రవారం 80 కిలోల నిమ్మకాయల బస్తా రూ.9500 పలికింది. రెండు రోజుల నుంచి నిమ్మ ధరల్లో అనూహ్యమైన మార్పు వచ్చింది. -
ఎన్నికల్లో అక్రమాలపై కఠినంగా వ్యవహరించండి
[ 27-04-2024]
ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే పోలీసు అధికారులకు సూచించారు. -
జగనన్నా.. గొంతెండుతోందయ్యా!
[ 27-04-2024]
ఎండలు మండిపోతున్నాయి. నీటి వనరులు వట్టిపోతున్నాయి. దాహం తీర్చుకోవడానికి చుక్క నీరు దొరకడం లేదు. గొంతులు తడారిపోతున్నాయి. -
పట్టణాభివృద్ధిలో వైశ్యుల పాత్ర కీలకం: తెదేపా
[ 27-04-2024]
పట్టణ అభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకమైందని తెదేపా అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని 30వ వార్డులో తెదేపా ఎన్నికల కార్యాలయాన్ని ఆర్యవైశ్య నాయకులు గాదంశెట్టి వేణుగోపాల్ నేతృత్వంలో ప్రారంభించారు. -
బాలయ్యా.. మా గుండెల్లో నీవేనయ్యా!
[ 27-04-2024]
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం కావలి, గుడ్లూరులో పర్యటించారు. -
జగన్ సర్కార్ ఉత్తుత్తి సాయం
[ 27-04-2024]
మహిళలను ఆర్థికంగా లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం రుణాలు అందజేస్తామనీ, వృత్తి శిక్షణ కార్యక్రమాలు చేపడతామనే ఆశయం గాడి తప్పింది. -
వైకాపా పాలనలో కూలేందుకు సిద్ధం
[ 27-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ ప్రాంత ప్రజలకు అవస్థలు తప్పడం లేదు... పలు గ్రామాల్లో వంతెనలు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి...
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం