ఉలవపాడులో స్టిక్కర్ల దుమారం
మండల కేంద్రంలో సోమవారం వైకాపా గుర్తుతో స్టిక్కర్లు అంటించడంపై దుమారం రేగింది. వివిధ జిల్లాలకు చెందిన ఆరుగురు యువకులు ద్విచక్రవాహనాలపై వచ్చి పంచాయతీ కార్యాలయం సమీపంలోని ఇళ్లకు వైకాపా స్టిక్కర్లు అంటించారు.
వైకాపా స్టిక్కరు అంటించిన యువకులతో మాట్లాడుతున్న ఎంపీడీవో విజయలక్ష్మి
ఉలవపాడు, న్యూస్టుడే: మండల కేంద్రంలో సోమవారం వైకాపా గుర్తుతో స్టిక్కర్లు అంటించడంపై దుమారం రేగింది. వివిధ జిల్లాలకు చెందిన ఆరుగురు యువకులు ద్విచక్రవాహనాలపై వచ్చి పంచాయతీ కార్యాలయం సమీపంలోని ఇళ్లకు వైకాపా స్టిక్కర్లు అంటించారు. ఇది గమనించిన స్థానికులు ప్రశ్నించడంతో తాము అంటించలేదని చెప్పడంతో.. వారు వెంటనే మండలాధికారులు, పోలీస్స్టేషన్కు ఫోను ద్వారా తెలియజేశారు. దీంతో అక్కడకు వచ్చిన పంచాయతీ సిబ్బంది.. ఆ స్టిక్కర్లను తొలగించారు. కొద్దిసేపటి తర్వాత అక్కడకు చేరుకున్న పోలీస్కానిస్టేబుల్, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ కార్యదర్శులు వారిని ఎంపీడీవో కార్యాలయానికి తరలించారు. వీరిలో ఒకరిది చిత్తూరు, మరొకరిది బాపట్ల, ఇంకో ఇద్దరిది తూ.గోదావరి జిల్లా, విజయవాడకు చెందిన వాళ్లుగా గుర్తించారు. వైకాపా అభ్యర్థుల తరఫున అనుమతి ఉందని తమను పంపించారనీ, తాము ప్రచారానికి మాత్రమే వచ్చామని యువత చెబుతున్నారు.ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారి వద్ద స్టిక్కర్లు లేవని ఎంపీడీవో విజయమ్మ తెలిపారు.ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇతర జిల్లాల నుంచి వచ్చినవారిని వదిలివేసినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇసుక దోపిడీ.. నిగ్గు తేల్చేనా!
[ 21-05-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చీ.. రాగానే ఇసుక దోపిడీకి తెరదీశారు. నిబంధనలకు పాతరేసి నదీ గర్భాలను గుల్ల చేశారు. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయన్న ఆందోళననూ పెడచెవిన పెట్టి మరీ ఇసుకాసురులు ప్రకృతి సంపదను కొల్లగొట్టారు. -
రెండో విడత.. గదుల కొరత
[ 21-05-2024]
జూన్ ఒకటి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా చేరే విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. వీటిలో నాడు- నేడు కింద చేపట్టిన పనులు అసంపూర్తిగా ఉన్నాయి. -
మత్తు వలయం.. కలవరం
[ 21-05-2024]
మద్యం, గంజాయి, డ్రగ్స్ వినియోగంతో జీవితాలను నాశనం చేసుకునేవారితో పాటు.. వాటిని ప్రోత్సహిస్తున్న వారిలోనూ జిల్లా వాసుల పేర్లు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. -
వనితలు.. పసిడి కాంతులు
[ 21-05-2024]
వారు సంసార బంధాన్ని మోస్తున్నారు. కుటుంబ బాధ్యతలు చూస్తూనే చదువుకుంటున్నారు. కష్టమైనా అభిరుచి మేరకు ఇష్టపడి చదివారు. -
పోలీస్ నిఘా..
[ 21-05-2024]
ఎక్కడికక్కడ తనిఖీలు.. అనుమానిత వ్యక్తులు, పాత నేరస్థులను అదుపులోకి తీసుకోవడం.. పత్రాలు లేని వాహనాలు సీజ్ చేయడం ఇవీ.. జిల్లా పోలీసుశాఖ రెండు రోజుల నుంచి చేస్తున్న నిర్బంధ తనిఖీలు. -
ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలు
[ 21-05-2024]
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలను సోమవారం ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. -
పట్టణం.. అంధకారం
[ 21-05-2024]
పట్టణంలో 1.2 లక్షల మందికి పైగా ప్రజలు ఉన్నారు. 40 వార్డుల్లో నివాసాలు ఉన్నాయి. ఈప్రాంతాల్లోని వీధుల్లో ప్రజల సౌకర్యార్థం వీధి దీపాలు ఏర్పాటుచేశారు. -
శేష వాహనంపై పెంచలస్వామి
[ 21-05-2024]
బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రెండో రోజు సోమవారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. -
జగనన్న ఇంటి నిర్మాణాలపై విచారణ
[ 21-05-2024]
కంటేపల్లి జగనన్న కాలనీలో నిర్మించిన ఇంటి నిర్మాణాలపై గృహ నిర్మాణశాఖ అధికారులు సోమవారం విచారణ చేపట్టారు. -
నర్రవాడలో.. ఏదీ పర్యాటక హబ్
[ 21-05-2024]
వెంగమాంబ పేరంటాలు దేవస్థానాన్ని పర్యాటక హబ్గా తీర్చిదిద్దాలన్న ఆశయానికి అనుగుణంగా అడుగులు ముందుకు పడటం లేదు. -
గవర్నర్ పర్యటనకుపటిష్ఠ ఏర్పాట్లు
[ 21-05-2024]
రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జిల్లా పర్యటనకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టిపరిస్థితుల్లోనూ భారత భద్రతకు ముప్పును అనుమతించబోం: శ్రీలంక
-
పారితోషికం మరిచిపోయారా సారూ..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
లింక్ నొక్కారంటే.. డబ్బు మాయం
-
పల్నాడులో సాఫ్ట్వేర్ ఉద్యోగికి బేడీలు.. కుటుంబసభ్యులు, నాయకుల అభ్యంతరం
-
‘రక్తంతో తడిసిన రైసీ చేతులు’.. ఇరాన్ అధ్యక్షుడి మృతిపై అమెరికా