ప్రభుత్వ భూములు మింగేశారు
వింజమూరు మండలంలో వైకాపా నాయకులు, మద్దతుదారులు ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించి అనుభవిస్తున్నారు.
బత్తినవారిపల్లి సమీప ప్రభుత్వ భూముల్లో సాగు చేసిన జామాయిల్
వింజమూరు, న్యూస్టుడే: వింజమూరు మండలంలో వైకాపా నాయకులు, మద్దతుదారులు ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించి అనుభవిస్తున్నారు. అయినా యంత్రాంగం చేష్టలుడిగి వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- వింజమూరు పట్టణంలో అధికార పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మకై రూ. కోట్ల విలువైన భూములు కబ్జా చేశారు. చుట్టుపక్కల 5 కి.మీ. పరిధిలోని భూముల్లో లేఅవుట్లు వేసి సుమారు వంద కోట్లకు పైగా దోచుకున్నారు. కళ్లెదుటే ఆక్రమణలు కనిపిస్తున్నా రెవెన్యూ యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఆక్రమణల విషయమై ఆయా ప్రాంతాలను కావలి ఆర్డీవో శీనానాయక్ సిబ్బందితో కలసి గతంలో పరిశీలించారు. ఆక్రమణలు గుర్తించి నివేదిక తయారు చేయాలని సిబ్బందికి సూచించారు. ఆక్రమణలో ఉన్నట్లు తేలితే వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఆ విషయమై వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
- మండలంలోని పలు చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. బుక్కాపురంలో చెరువు లోతట్టు సుమారు 30 ఎకరాలు ఆక్రమించి పంటలు సాగు చేస్తున్నారు. అక్కడ రీసర్వే అనంతరం కూడా ఎలాంటి మార్పు లేదు. కాటేపల్లి పంచాయతీ పరిధిలోని బలిజపాలెం చెరువు లోతట్టు ఏకంగా 200 ఎకరాలు ఆక్రమించారు. ఈ భూమిపై కూడా 145 సెక్షన్ అమల్లో ఉంది. కొంత మందిపై కేసులున్నా పట్టించుకోవడం లేదు. మండలంలో అతిపెద్దదయినా చాకలకొండ చెరువు చివరన కూడా ఎక్కువ ఆక్రమణలున్నాయి.
చర్యలు తీసుకుంటాం
ఎంవీ కృష్ణారెడ్డి, తహసీల్దారు : ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయం నా దృష్టికి వచ్చింది. అసైన్డ్ భూముల్లో లేఅవుట్లు వేసిన వారికి నోటీసులు అందగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చట్టపరంగా ముందుకు వెళుతున్నాం. భూములు పరాధీనం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. కాటేపల్లి తదితర గ్రామాల్లో ఆక్రమణల విషయం నా దృష్టికి రాలేదు. వాటి వివరాలు తెలుసుకుని ప్రభుత్వ స్వాధీనానికి చర్యలు తీసుకుంటా.
- కాటేపల్లిలో సుమారు 1277 ఎకరాల భూమి బడా రైతుల చెరలో ఉంది. దీనిపై 145 సెక్షన్ ఉన్నా ఇంతవరకు చర్యలు లేవు. భూముల్లో బోర్లు వేసి విద్యుత్తు కనెక్షన్లు తీసుకుని పంటలు సాగు చేస్తున్నారు.
- బత్తినవారిపల్లెలో చెరువు లోతట్టు ప్రాంతంలో సుమారు 90 ఎకరాలు ఆక్రమించి జామాయిల్, మినుము సాగు చేస్తున్నారు. తక్కెళ్లపాడు రహదారిలోనూ ఆక్రమణలున్నాయి. పైమూడింటితోపాటు గుండెమడకల తదితర గ్రామాల్లో ఎక్కువగా ఆక్రమణలకు పాల్పడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛన్లు బ్యాంక్లో వేయవద్దు
[ 17-05-2024]
వృద్ధుల, దివ్యాంగుల పింఛన్లను బ్యాంక్లో వేయవద్దు అని ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి అర్జీరూపంలో దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్.మల్లి ఆధ్వర్యంలో పోస్టులో వినతిపత్రం పంపించారు. -
ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవం
[ 17-05-2024]
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన మహోత్సవ కార్యక్రమం కావలి పట్టణంలోని వెంగళరావునగర్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. -
భారీ మెజారిటీతో కావ్య గెలవబోతున్నారు
[ 17-05-2024]
ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి (కావ్య క్రిష్ణారెడ్డి) కావలి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలవబోతున్నారని కావలి ఆర్య వైశ్యులు తెలిపారు. -
అధికారులంతా వైకాపాకే కొమ్ముకాశారు: మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
[ 17-05-2024]
తాజా ఎన్నికల్లో అధికారులెవరూ తమకు సహకరించలేదని నెల్లూరు జిల్లా ఆత్మకూరు తెదేపా అభ్యర్థి, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. -
ఎడగారు పోయినట్లే!
[ 17-05-2024]
జిల్లాలో ఎడగారుకు సాగునీరు అందుబాటులో లేదు. రెండో పంటకూ దాదాపు ఇదే పరిస్థితి ఉంటుందని జల వనరులశాఖ అధికారులు చెబుతున్నారు. -
ఫలితాలపై పందేల జోరు!
[ 17-05-2024]
ఓ వైపు ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా జరుగుతుండగా- మరోవైపు ఎన్నికల ఫలితాలపై పందేల హోరు పెరిగింది. పోలింగ్ ప్రక్రియ పూర్తయి మూడు రోజులు కాలేదు. -
ఆగని దోపిడి
[ 17-05-2024]
సైదాపురం మండలం తలుపూరు, కలిచేడు, ఊటుకూరు, జోగిపల్లి, పెరుమాళ్లపాడు, చాగణం, రాజుపాళెం, తిప్పిరెడ్డిపల్లి, లింగసముద్రం, పాలూరు గ్రామాల్లో పల్స్పర్, క్వార్ట్జ్, మైకా, వర్మిక్యులేట్ తదితర ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. -
డెంగీ నిర్మూలన అందరి బాధ్యత
[ 17-05-2024]
డెంగీ నిర్మూలన అందరి బాధ్యత అని డీఎంహెచ్వో డాక్టర్ పెంచలయ్య తెలిపారు. గురువారం జాతీయ డెంగీ డే సందర్భంగా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి బీఈడీ కళాశాల వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
ఉప్పు రైతుకు నష్టం
[ 17-05-2024]
వ్యాపారుల మాయాజాలంతో ఉప్పు రైతులు కుదేలవుతున్నారు. వారి చర్యల కారణంగా ఎన్నడూ లేని రీతిలో కిలో రూ.1.50కు తగ్గిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. -
ప్రవేశాలకు వేళాయె.. వసతులు కరువాయె!
[ 17-05-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు సమస్యల చదువులు చదువుతున్నారు. జిల్లాలో ఏటా వేలాది మంది విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్లో చేరుతుంటారు. -
చైతన్యమూర్తులు.. ప్రాణదాతలు
[ 17-05-2024]
సాయం చేయడానికి కావాల్సింది డబ్బు కాదు.. మంచి మనసు: మదర్థెరెసా ఈ మాటలను పలువురు స్ఫూర్తిగా తీసుకున్నారు. సమాజ సేవకు కదిలారు. -
పరుగుల్లో తేజస్సు
[ 17-05-2024]
ఉమ్మడి నెల్లూరు జిల్లా కోటకు చెందిన వెంకటేశ్వర్లు, కోటేశ్వరమ్మ దంపతుల కుమారుడు హిమతేజ. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. -
స్ట్రాంగ్రూముల వద్ద నిరంతర నిఘా
[ 17-05-2024]
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూముల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ సూచించారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
[ 17-05-2024]
బుచ్చి నగర పంచాయతీలోని ముంబై జాతీయ రహదారిపై రాఘవరెడ్డి కాలనీ వద్ద గురువారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో అయిదుగరికి గాయాలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
రాణించిన కేఎల్ రాహుల్-పూరన్.. ముంబయి లక్ష్యం 215
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
ఏపీలో ఎన్నికల ముందు తర్వాత హింసపై సిట్ ..ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
విజయవాడ డివిజన్ పరిధిలో 14 రైళ్లు రద్దు