పార్లమెంటు అభ్యర్థులకు గుర్తులు
నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వారికి కలెక్టర్ హరినారాయణన్ ఎన్నికల గుర్తులు కేటాయించారు.
గుర్తులు కేటాయిస్తున్న కలెక్టర్ హరినారాయణన్
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్టుడే: నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వారికి కలెక్టర్ హరినారాయణన్ ఎన్నికల గుర్తులు కేటాయించారు. కె.రాజు(కాంగ్రెస్)కు హస్తం గుర్తు, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి(తెదేపా)కి సైకిల్ గుర్తు, వేణుంబాక విజయసాయిరెడ్డి(వైకాపా)కి ఫ్యాన్ గుర్తు కేటాయించారు. నాసిన భాస్కర్ బహుజన శ్రామిక పార్టీకి ఏనుగు గుర్తు, జాజుల సోమశేఖర్ జైభారత్ నేషనల్ పార్టీకి టార్చిలైట్, తలారి వెంకయ్య జైభీమ్రావు భారత్ పార్టీకి కోటు, నక్క దినేష్ భారత్ చైతన్య యోజన పార్టీకి చెరకు రైతు, పుంగూరు ప్రసన్న గణపతి రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియాకు కత్తెర, మల్లేపల్లి రఘు నవరంగ్ కాంగ్రెస్ పార్టీకి బకెట్, మన్నేపల్లి వివేక్ రివ్యులేషనరీ సోషలిస్ట్ పార్టీకి పారా పలుగు గుర్తులు కేటాయించారు. షేక్ మహబూబ్బాషా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు కుట్టు మిషన్, ముజ్బిర్ రెహమాన్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకు టెలివిజన్, షేక్ షఫి అహ్మద్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కు సింహం, కొప్పాల రఘు ఇండిపెండెంట్ అభ్యర్థికి గ్యాస్ సిలిండర్ గుర్తులు కేటాయిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
గాజుగ్లాసు కేటాయింపుపై ఆందోళన
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి తరఫున తెదేపా అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పలువురు స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై కూటమి అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కావలి నియోజకవర్గంలో పసుపులేటి సుధాకర్, సర్వేపల్లి నియోజకవర్గంలో మన్నెం పుట్టయ్య, ఆత్మకూరు నియోజకవర్గంలో ధనిరెడ్డి రామనారాయణరెడ్డికి గాజు గ్లాస్ గుర్తులు కేటాయించారు. ఎన్నికల్లో ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకే అధికారులు గాజు గ్లాసు కేటాయించారని కూటమి అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛన్లు బ్యాంక్లో వేయవద్దు
[ 17-05-2024]
వృద్ధుల, దివ్యాంగుల పింఛన్లను బ్యాంక్లో వేయవద్దు అని ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి అర్జీరూపంలో దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్.మల్లి ఆధ్వర్యంలో పోస్టులో వినతిపత్రం పంపించారు. -
ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవం
[ 17-05-2024]
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన మహోత్సవ కార్యక్రమం కావలి పట్టణంలోని వెంగళరావునగర్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. -
భారీ మెజారిటీతో కావ్య గెలవబోతున్నారు
[ 17-05-2024]
ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి (కావ్య క్రిష్ణారెడ్డి) కావలి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలవబోతున్నారని కావలి ఆర్య వైశ్యులు తెలిపారు. -
అధికారులంతా వైకాపాకే కొమ్ముకాశారు: మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
[ 17-05-2024]
తాజా ఎన్నికల్లో అధికారులెవరూ తమకు సహకరించలేదని నెల్లూరు జిల్లా ఆత్మకూరు తెదేపా అభ్యర్థి, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. -
ఎడగారు పోయినట్లే!
[ 17-05-2024]
జిల్లాలో ఎడగారుకు సాగునీరు అందుబాటులో లేదు. రెండో పంటకూ దాదాపు ఇదే పరిస్థితి ఉంటుందని జల వనరులశాఖ అధికారులు చెబుతున్నారు. -
ఫలితాలపై పందేల జోరు!
[ 17-05-2024]
ఓ వైపు ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా జరుగుతుండగా- మరోవైపు ఎన్నికల ఫలితాలపై పందేల హోరు పెరిగింది. పోలింగ్ ప్రక్రియ పూర్తయి మూడు రోజులు కాలేదు. -
ఆగని దోపిడి
[ 17-05-2024]
సైదాపురం మండలం తలుపూరు, కలిచేడు, ఊటుకూరు, జోగిపల్లి, పెరుమాళ్లపాడు, చాగణం, రాజుపాళెం, తిప్పిరెడ్డిపల్లి, లింగసముద్రం, పాలూరు గ్రామాల్లో పల్స్పర్, క్వార్ట్జ్, మైకా, వర్మిక్యులేట్ తదితర ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. -
డెంగీ నిర్మూలన అందరి బాధ్యత
[ 17-05-2024]
డెంగీ నిర్మూలన అందరి బాధ్యత అని డీఎంహెచ్వో డాక్టర్ పెంచలయ్య తెలిపారు. గురువారం జాతీయ డెంగీ డే సందర్భంగా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి బీఈడీ కళాశాల వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
ఉప్పు రైతుకు నష్టం
[ 17-05-2024]
వ్యాపారుల మాయాజాలంతో ఉప్పు రైతులు కుదేలవుతున్నారు. వారి చర్యల కారణంగా ఎన్నడూ లేని రీతిలో కిలో రూ.1.50కు తగ్గిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. -
ప్రవేశాలకు వేళాయె.. వసతులు కరువాయె!
[ 17-05-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు సమస్యల చదువులు చదువుతున్నారు. జిల్లాలో ఏటా వేలాది మంది విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్లో చేరుతుంటారు. -
చైతన్యమూర్తులు.. ప్రాణదాతలు
[ 17-05-2024]
సాయం చేయడానికి కావాల్సింది డబ్బు కాదు.. మంచి మనసు: మదర్థెరెసా ఈ మాటలను పలువురు స్ఫూర్తిగా తీసుకున్నారు. సమాజ సేవకు కదిలారు. -
పరుగుల్లో తేజస్సు
[ 17-05-2024]
ఉమ్మడి నెల్లూరు జిల్లా కోటకు చెందిన వెంకటేశ్వర్లు, కోటేశ్వరమ్మ దంపతుల కుమారుడు హిమతేజ. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. -
స్ట్రాంగ్రూముల వద్ద నిరంతర నిఘా
[ 17-05-2024]
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూముల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ సూచించారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
[ 17-05-2024]
బుచ్చి నగర పంచాయతీలోని ముంబై జాతీయ రహదారిపై రాఘవరెడ్డి కాలనీ వద్ద గురువారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో అయిదుగరికి గాయాలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
రాణించిన కేఎల్ రాహుల్-పూరన్.. ముంబయి లక్ష్యం 215
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
ఏపీలో ఎన్నికల ముందు తర్వాత హింసపై సిట్ ..ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
విజయవాడ డివిజన్ పరిధిలో 14 రైళ్లు రద్దు