కాలనీలు.. సమస్యలకు నిలయాలు
పట్టణంలోని పలు వార్డుల్లో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. జనావాసాల్లో ఉండే ఖాళీ ప్లాట్లు చెత్తాచెదారంతో నిండిపోయాయి.
కావలి, న్యూస్టుడే
కావలి 30వ వార్డులో తరచూ రోడ్డుపైకి మురుగునీరు ఇలా
పట్టణంలోని పలు వార్డుల్లో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. జనావాసాల్లో ఉండే ఖాళీ ప్లాట్లు చెత్తాచెదారంతో నిండిపోయాయి. ఈకారణంగా దోమలతో ప్రజలు వ్యాధులకు గురవుతున్నారు.
- 13వ వార్డు నుంచి పన్నుల రూపంలో ఆదాయం బాగా వస్తున్నా సౌకర్యాలు కల్పించడం లేదు. ఈ వార్డు పరిధిలో రామ్మూర్తిపేట, బృందావన కాలనీ ప్రాంతాలున్నాయి. పారిశుద్ధ్యం అధ్వానంగా తయారవడంతో దోమల సమస్య తీవ్రంగా ఉంది.
- 18వ వార్డులో జంగం, భైరాగుల కాలనీ, తుపాన్నగర్ ప్రాంతాలున్నాయి. ఇక్కడ నీటి కొరత తీవ్రంగా ఉంది. కొన్ని ప్రాంతాలకు మాత్రమే ట్యాంకర్లను పంపుతున్నారు. ఈ ప్రాంతవాసులు తెదేపాకు అనుకూలమని వైకాపా నాయకులు వివక్ష చూపుతున్నారు. పార్కును పురపాలక సంఘం పట్టించుకోకపోవడంతో అసాంఘిక శక్తులకు నిలయంగా మారింది.
- కావలి పురపాలక సంఘంలోని 23వ వార్డు అంటే వెంగళరావునగర్ ప్రాంతం. ఈ ప్రాంతంలో పందుల, దోమల బెడద జాస్తిగా ఉంది.
- పట్టణంలోని 25వ వార్డులో ప్రగతి నగర్ పరిధిలో విద్యుత్తు కార్యాలయం పక్కన ఉన్న రహదారి మురుగుమయంగా ఉంది.
- 30వ వార్డు రైల్వే రోడ్డు, రాజావీధి, మున్సిపల్, పశుసంవర్థక శాఖ కార్యాలయ, తదితర ప్రాంతాలున్నాయి. దోమలబెడదతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు.
అధికారులకు చెబుతున్నా స్పందించరే!
సమస్యలు పరిష్కరించాలని కావలి పురపాలక సంఘం అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. కనీసం దోమల నివారణకు ఫాగింగ్ యంత్రం పంపించాలి. దీంతో రాత్రిళ్లు నిద్రకు దూరమవుతున్నాం.
శానం హరి, తుపాన్నగర్, 18వ వార్డు
మా వార్డులోనే కార్యాలయం
మా 30వ వార్డు పరిధిలోనే పురపాలక సంఘం కార్యాలయం ఉంది. అయినా అధికార యంత్రాంగానికి సమస్యలు పరిష్కరించే దిశగా కార్యాచరణ ఉండడం లేదు. పశుసంవర్థ్ధక శాఖ కార్యాలయ ఆవరణలో ముళ్లపొదలున్నాయి. అటునుంచి విషపురుగులు వస్తున్నాయి.
ఈతముక్కల శ్రీరాజ్యలక్ష్మి, రాజావీధి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సోమశిల.. ఈ నిర్లక్ష్యమేల!
[ 20-05-2024]
ఇది ఫ్యూజో మీటరు.. సోమశిల జలాశయం మట్టికట్ట స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే ఈ వ్యవస్థ దశాబ్దానికి పైగా పనిచేయడం లేదు. నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో మట్టికట్టపై పర్యవేక్షణ మాటలకే పరిమితమవుతోంది. -
మామిడి.. మిగలని దమ్మిడి
[ 20-05-2024]
మామిడి రైతులను ఏటా ఏదో ఒక సమస్య వేధిస్తోంది. ఈ ఏడాది.. ఇప్పటికి ధరలు పర్వాలేదనుకున్నా.. శీతాకాలంలో గాలి వానలు, మంచు, తామర పురుగు ప్రభావంతో పూత రాలిపోయిన కారణంగా దిగుబడులు గణనీయంగా తగ్గాయి. -
ఎల్హెచ్ఎంఎస్ ఉంటే మీ ఇల్లు భద్రమే
[ 20-05-2024]
రెండు రోజుల క్రితం నెల్లూరు బాలాజీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోతాళం వేసిన ఇంటినే లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగుడు దొంగతనానికి పాల్పడ్డాడు. తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న బంగారం దోచుకున్నాడు. -
బోధిస్తూ.. చైతన్యం
[ 20-05-2024]
ఆమె వృక్ష శాస్త్ర అధ్యాపకురాలు. మొక్కల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. దీన్ని వ్యాపకంగా చేసుకున్నారు. మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ అని భావించారు. అందరితో మొక్కలు నాటించి పెద్దవయ్యేలా చేస్తున్నారు. -
మృత్యు దారులు
[ 20-05-2024]
కొద్దిరోజుల కిందట కావలి సమీపంలో ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సులో అయిదుగురు మృతి చెందగా.. పలువురు గాయాలపాలయ్యారు. -
ఓటేయకుండా.. ఓడారు!
[ 20-05-2024]
ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అద్వితీయ హక్కు... ఓటు. మనమే నిర్ణేతలమై.. అయిదేళ్లకు ఒకసారి మనల్ని పరిపాలించే వారిని ఎన్నుకునే వజ్రాయుధం ఓటు. అంతటి కీలకమైన ప్రజాస్వామ్య ఆయుధాన్ని కొందరు శ్రద్ధతో వినియోగించుకుంటే.. -
కోనలో బ్రహ్మోత్సవ వైభవం
[ 20-05-2024]
భక్తుల గోవింద నామస్మరణ.. మంగళ వాయిద్యాల నడుమ పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. -
జిల్లా వ్యాప్తంగా పోలీసుల సోదాలు
[ 20-05-2024]
పోలీసులు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కార్డన్ సర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల అణచివేత, దొంగతనాల నివారణ, అసాంఘిక శక్తుల ఏరివేతే కార్డన్ సర్చ్ ముఖ్య ఉద్దేశం. -
తప్పిపోయిన చిన్నారిని సంరక్షించిన మెరైన్ పోలీసులు
[ 20-05-2024]
మండల పరిధిలోని మైపాడు బీచ్లో తప్పిబోయిన చిన్నారిని మెరైన్ పోలీసులు వెతికిపట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన ఆదివారం జరిగింది. -
ఫ్రూట్ కవర్ మామిడి కిలో రూ.100
[ 20-05-2024]
జిల్లాలో ఫ్రూట్ కవర్ మామిడి పండ్లకు డిమాండ్ పలుకుతోంది. ఇవి కిలో రూ.100కు విక్రయిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
-
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
-
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!
-
మరి కాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!