జీపీఎస్ వాహనాల్లోనే ఈవీఎంల తరలింపు
జిల్లాలో ఈనెల 13న ఎన్నికల పోలింగ్కు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి పోలింగ్ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
లెక్కింపు, స్ట్రాంగ్ రూములు పరిశీలిస్తున్న కలెక్టర్ హరినారాయణన్
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్టుడే: జిల్లాలో ఈనెల 13న ఎన్నికల పోలింగ్కు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి పోలింగ్ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 12వ తేదీ ఉదయం ఆరు గంటలకు 255 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 13వ తేదీ తిరిగి రావడానికి బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎంపిక చేసిన రూట్మ్యాప్ ప్రకారమే బస్సులను నడపాలని, జీపీఎస్ ఉన్న వాహనాల్లోనే ఈవీఎంలను తరలించాలని ఆదేశించారు. పోలింగ్ రోజు 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల కోసం ఆటోలు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో లవన్న, శిక్షణ కలెక్టర్ సంజనా సింహ, నోడల్ అధికారులు బాపిరెడ్డి, సాల్మాన్రాజు, చందర్, పద్మావతి, కన్నమనాయుడు, రాజశేఖర్, సదారావు తదితరులు పాల్గొన్నారు.
భారీ భద్రత ఏర్పాటు చేయాలి..
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూములను బుధవారం పరిశీలించారు. కార్యక్రమంలో నగరపాలకసంస్థ కమిషనర్ వికాస్ మర్మత్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీవో మలోల, తహసీల్దార్లు వెంకటేశ్వర్లు, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
జిల్లాకు చేరుకున్న ఐపీఎస్లు
నెల్లూరు(నేర విభాగం) : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు పలువురు ఐపీఎస్లు చేరుకున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు.. రాష్ట్రంలో 163 మంది శిక్షణ ఐపీఎస్లను వివిధ జిల్లాలకు కేటాయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా జిల్లాకు మయాంక్ మిశ్రా, పీకే సిద్ధార్థ్ రామ్కుమార్, ప్రతీక్ సింగ్, కుష్ మిశ్రా, సూరజ్ డి, అభినవ్ ద్వివేది, జామాసోనార్, అషిమా వాశ్వాణి, అపర్ణను కేటాయించారు. వీరందరూ బుధవారం జిల్లాకు చేరుకున్నారు. ఎన్నికలు ముగిసే వరకు వీరు జిల్లాలోనే ఉంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సోమశిల.. ఈ నిర్లక్ష్యమేల!
[ 20-05-2024]
ఇది ఫ్యూజో మీటరు.. సోమశిల జలాశయం మట్టికట్ట స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే ఈ వ్యవస్థ దశాబ్దానికి పైగా పనిచేయడం లేదు. నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో మట్టికట్టపై పర్యవేక్షణ మాటలకే పరిమితమవుతోంది. -
మామిడి.. మిగలని దమ్మిడి
[ 20-05-2024]
మామిడి రైతులను ఏటా ఏదో ఒక సమస్య వేధిస్తోంది. ఈ ఏడాది.. ఇప్పటికి ధరలు పర్వాలేదనుకున్నా.. శీతాకాలంలో గాలి వానలు, మంచు, తామర పురుగు ప్రభావంతో పూత రాలిపోయిన కారణంగా దిగుబడులు గణనీయంగా తగ్గాయి. -
ఎల్హెచ్ఎంఎస్ ఉంటే మీ ఇల్లు భద్రమే
[ 20-05-2024]
రెండు రోజుల క్రితం నెల్లూరు బాలాజీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోతాళం వేసిన ఇంటినే లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగుడు దొంగతనానికి పాల్పడ్డాడు. తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న బంగారం దోచుకున్నాడు. -
బోధిస్తూ.. చైతన్యం
[ 20-05-2024]
ఆమె వృక్ష శాస్త్ర అధ్యాపకురాలు. మొక్కల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. దీన్ని వ్యాపకంగా చేసుకున్నారు. మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ అని భావించారు. అందరితో మొక్కలు నాటించి పెద్దవయ్యేలా చేస్తున్నారు. -
మృత్యు దారులు
[ 20-05-2024]
కొద్దిరోజుల కిందట కావలి సమీపంలో ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సులో అయిదుగురు మృతి చెందగా.. పలువురు గాయాలపాలయ్యారు. -
ఓటేయకుండా.. ఓడారు!
[ 20-05-2024]
ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అద్వితీయ హక్కు... ఓటు. మనమే నిర్ణేతలమై.. అయిదేళ్లకు ఒకసారి మనల్ని పరిపాలించే వారిని ఎన్నుకునే వజ్రాయుధం ఓటు. అంతటి కీలకమైన ప్రజాస్వామ్య ఆయుధాన్ని కొందరు శ్రద్ధతో వినియోగించుకుంటే.. -
కోనలో బ్రహ్మోత్సవ వైభవం
[ 20-05-2024]
భక్తుల గోవింద నామస్మరణ.. మంగళ వాయిద్యాల నడుమ పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. -
జిల్లా వ్యాప్తంగా పోలీసుల సోదాలు
[ 20-05-2024]
పోలీసులు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కార్డన్ సర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల అణచివేత, దొంగతనాల నివారణ, అసాంఘిక శక్తుల ఏరివేతే కార్డన్ సర్చ్ ముఖ్య ఉద్దేశం. -
తప్పిపోయిన చిన్నారిని సంరక్షించిన మెరైన్ పోలీసులు
[ 20-05-2024]
మండల పరిధిలోని మైపాడు బీచ్లో తప్పిబోయిన చిన్నారిని మెరైన్ పోలీసులు వెతికిపట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన ఆదివారం జరిగింది. -
ఫ్రూట్ కవర్ మామిడి కిలో రూ.100
[ 20-05-2024]
జిల్లాలో ఫ్రూట్ కవర్ మామిడి పండ్లకు డిమాండ్ పలుకుతోంది. ఇవి కిలో రూ.100కు విక్రయిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
-
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
-
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!
-
మరి కాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!