మస్తు చెప్పారు ఉపాధి ఆపేశారు
పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమంతోపాటు వారికి మెరుగైన జీవనోపాధి కల్పించాలన్న లక్ష్యంతో బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రాయితీతో అందించే రుణాలను వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది.
బీసీ, మైనార్టీలకు రాయితీ రుణాలేవీ
నష్టపోయిన యువత
న్యూస్టుడే, దుత్తలూరు
ప్రకటన: మీ అన్న వస్తున్నాడు... మన ప్రభుత్వం వచ్చాక బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా అర్హులైన వారిని గుర్తించి మెరుగైన ఉపాధి పథకాలు అమలు చేస్తాం... యూనిట్లు స్థాపించుకునేందుకు యువతకు విరివిగా రాయితీ రుణాలు అందజేస్తాం..
- ప్రతిపక్ష నాయకుడి హోదాలో సీఎం జగన్
వాస్తవం: వై.ఎస్. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక బీసీ, మైనార్టీ యువతకు అరచేతిలో వైకుంఠం చూపించారు. వెనుకబడిన బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమాన్ని అటకెక్కించారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో అర్హులైన పేదల జీవనోపాధి మెరుగుపర్చేందుకు ఇవ్వాల్సిన బీసీ, మైనార్టీ రాయితీ రుణాలను అయిదేళ్ల పాలనలో పూర్తిగా ఎగ్గొట్టేశారు.
పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమంతోపాటు వారికి మెరుగైన జీవనోపాధి కల్పించాలన్న లక్ష్యంతో బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రాయితీతో అందించే రుణాలను వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే రుణాలు సైతం యువతకు దక్కనీయకుండా చేసింది. గత ప్రభుత్వంలో బీసీ, మైనార్టీ తదితర వర్గాలకు సంబంధిత కార్పొరేషన్ల ద్వారా బ్యాంకు అనుసంధానంతో రాయితీ రుణాలు అందించారు. వీటి ద్వారా వేల మంది వివిధ యూనిట్ల ద్వారా స్వయం ఉపాధి పొందారు. పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఒక్కో యూనిట్కు రూ. 3- 50 లక్షల వరకు రుణం ఇచ్చేవారు. జిల్లాలో వివిధ కార్పొరేషన్ల ద్వారా మొత్తం 13,437 యూనిట్లు మంజూరు చేయటమే కాకుండా వారికి వివిధ బ్యాంకుల ద్వారా రూ. 476.32 కోట్ల రాయితీ రుణాలు ఇచ్చారు. రాయితీ రుణాలు ఇచ్చేందుకే సుముఖత చూపని సీఎం జగన్ ప్రతి బీసీ వర్గానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆది నుంచి నిధులు, విధులకు నోచుకోని ఆ కార్పొరేషన్లు అధికార పార్టీ నాయకులకు పదవులు కల్పించడానికే మినహా ఇప్పటి వరకూ రూపాయి కూడా రుణంగా ఇచ్చిన పరిస్థితి లేదు. నవరత్నాల సాకుతో ఎంతో ఉపయోగపడే రాయితీ రుణాలకు వైకాపా ప్రభుత్వం పూర్తిగా స్వస్తి పలికింది.
వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి ఏడాదిలో అప్పటికే ఉన్న కార్పొరేషన్ల ద్వారా జిల్లాలో రూ. 102 కోట్లతో పది వేలకు పైగా యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించారు. వీటికి దాదాపు 74 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక పేరుతో ఏడాది మొత్తం కాలక్షేపం చేసి చివరకు రుణ మంజూరు ప్రక్రియను మౌఖిక ఆదేశాలతో నిలిపివేశారు.
రుణంతో చిరు వ్యాపారం
-కృష్ణ, దుత్తలూరు
తెదేపా హయాంలో రాయితీ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా. కొన్ని రోజుల తరువాత అధికారులు ఇంటర్వ్యూకు పిలిచారు. రుణం మంజూరైతే ఏ వ్యాపారం చేస్తారని అడిగారు. అన్ని వివరాలు వారికి చెప్పడంతో రుణం మంజూరు చేశారు. సిఫార్సు లేకుండా రుణం మంజూరు అవటంతో చిరు వ్యాపారం పెట్టుకున్నా. ఈ డబ్బుతో ప్రారంభించిన వ్యాపారం నేటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుస్తోంది. తీసుకున్న రుణంలో యాభై శాతం ప్రభుత్వం చెల్లించగా మిగిలినవి విడతలవారీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెల్లించాను.
మంజూరు కాలేదు
-వెంకటరమణ, దుత్తలూరు
బీసీ కార్పొరేషన్ కింద 2020లో రాయితీ రుణాలు మంజూరు చేస్తున్నారని తెలిసి దరఖాస్తు చేశా. నెలల తరబడి ఎదురుచూసినా ఎలాంటి ఫలితంలేదు. రుణం మంజూరవుతుందని ఆశతో ఉన్నా. అధికారులను అడిగినా సమాధానం లేదు. స్నేహితులు కొంతమంది రుణాలు మంజూరు ఆపివేశారని చెప్పారు. దాంతో ఎంతో నిరాశ చెందా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాతోనే ప్రజాస్వామ్యం
[ 20-05-2024]
రాష్ట్రంలో తెదేపా అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం ఫరిడవిల్లిందని జనరల్ మర్చంట్ వ్యాపారుల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు జెట్టి వెంకట శేషారెడ్డి అన్నారు. -
హ్యాపీసేవా సంస్థ ఆధ్వర్యంలో గిరిజనులకు భోజనం ప్యాకెట్ల పంపిణీ
[ 20-05-2024]
కావలి రూరల్ మండలంలోని ఆముదాలదిన్నెలో హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద గిరిజనులకు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. -
సోమశిల.. ఈ నిర్లక్ష్యమేల!
[ 20-05-2024]
ఇది ఫ్యూజో మీటరు.. సోమశిల జలాశయం మట్టికట్ట స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే ఈ వ్యవస్థ దశాబ్దానికి పైగా పనిచేయడం లేదు. నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో మట్టికట్టపై పర్యవేక్షణ మాటలకే పరిమితమవుతోంది. -
మామిడి.. మిగలని దమ్మిడి
[ 20-05-2024]
మామిడి రైతులను ఏటా ఏదో ఒక సమస్య వేధిస్తోంది. ఈ ఏడాది.. ఇప్పటికి ధరలు పర్వాలేదనుకున్నా.. శీతాకాలంలో గాలి వానలు, మంచు, తామర పురుగు ప్రభావంతో పూత రాలిపోయిన కారణంగా దిగుబడులు గణనీయంగా తగ్గాయి. -
ఎల్హెచ్ఎంఎస్ ఉంటే మీ ఇల్లు భద్రమే
[ 20-05-2024]
రెండు రోజుల క్రితం నెల్లూరు బాలాజీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోతాళం వేసిన ఇంటినే లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగుడు దొంగతనానికి పాల్పడ్డాడు. తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న బంగారం దోచుకున్నాడు. -
బోధిస్తూ.. చైతన్యం
[ 20-05-2024]
ఆమె వృక్ష శాస్త్ర అధ్యాపకురాలు. మొక్కల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. దీన్ని వ్యాపకంగా చేసుకున్నారు. మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ అని భావించారు. అందరితో మొక్కలు నాటించి పెద్దవయ్యేలా చేస్తున్నారు. -
మృత్యు దారులు
[ 20-05-2024]
కొద్దిరోజుల కిందట కావలి సమీపంలో ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సులో అయిదుగురు మృతి చెందగా.. పలువురు గాయాలపాలయ్యారు. -
ఓటేయకుండా.. ఓడారు!
[ 20-05-2024]
ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అద్వితీయ హక్కు... ఓటు. మనమే నిర్ణేతలమై.. అయిదేళ్లకు ఒకసారి మనల్ని పరిపాలించే వారిని ఎన్నుకునే వజ్రాయుధం ఓటు. అంతటి కీలకమైన ప్రజాస్వామ్య ఆయుధాన్ని కొందరు శ్రద్ధతో వినియోగించుకుంటే.. -
కోనలో బ్రహ్మోత్సవ వైభవం
[ 20-05-2024]
భక్తుల గోవింద నామస్మరణ.. మంగళ వాయిద్యాల నడుమ పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. -
జిల్లా వ్యాప్తంగా పోలీసుల సోదాలు
[ 20-05-2024]
పోలీసులు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కార్డన్ సర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల అణచివేత, దొంగతనాల నివారణ, అసాంఘిక శక్తుల ఏరివేతే కార్డన్ సర్చ్ ముఖ్య ఉద్దేశం. -
తప్పిపోయిన చిన్నారిని సంరక్షించిన మెరైన్ పోలీసులు
[ 20-05-2024]
మండల పరిధిలోని మైపాడు బీచ్లో తప్పిబోయిన చిన్నారిని మెరైన్ పోలీసులు వెతికిపట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన ఆదివారం జరిగింది. -
ఫ్రూట్ కవర్ మామిడి కిలో రూ.100
[ 20-05-2024]
జిల్లాలో ఫ్రూట్ కవర్ మామిడి పండ్లకు డిమాండ్ పలుకుతోంది. ఇవి కిలో రూ.100కు విక్రయిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల