ఫాంపాండ్స్ నిర్మాణాలకు ప్రత్యేక చర్యలు
ఫాంపాండ్స్ నిర్మాణాలకు కామారెడ్డి జిల్లా పాలనాధికారి జితేశ్ వి పాటిల్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది భూగర్భజలాలు తగ్గుముఖం పట్టి యాసంగి సీజన్లో బోరుబావులు వట్టిపోయాయి. చాలా చోట్ల పంటలు ఎండిపోయాయి.
ఉపాధి కూలీల భూముల వివరాలు సేకరణ
న్యూస్టుడే, కామారెడ్డి కలెక్టరేట్
రైతుల పొలంలో నిర్మిస్తున్న ఫాంపాండ్
ఫాంపాండ్స్ నిర్మాణాలకు కామారెడ్డి జిల్లా పాలనాధికారి జితేశ్ వి పాటిల్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది భూగర్భజలాలు తగ్గుముఖం పట్టి యాసంగి సీజన్లో బోరుబావులు వట్టిపోయాయి. చాలా చోట్ల పంటలు ఎండిపోయాయి. భూగర్భజలాలను పెంచడానికి తగిన చర్యలు ఇప్పటి నుంచే తీసుకోవడానికి కలెక్టర్ ఫాంపాండ్ల నిర్మాణాలపై దృష్టి పెట్టారు. జిల్లావ్యాప్తంగా రైతులకు అవగాహన కల్పించి వారి పంటపొలాల్లో ఉపాధిహామీపథకం కింద వీటి నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎంపీడీవోలకు ఆదేశాలు వెళ్లాయి. వానాకాలం ప్రారంభమయ్యేలోపు వీలైనన్నీ నిర్మాణాలు చేపట్టడానికి అధికారులు కరసరత్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వివరాలను సేకరించే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది.
క్రియాశీలక కూలీల భూముల్లోనూ..
కామారెడ్డి జిల్లాలో మొత్తంగా 2.55 లక్షల జాబ్కార్డులు ఉన్నాయి. ఇందులో 1.75 లక్షల జాబ్కార్డుల కూలీలు క్రియాశీలకంగా ఉపాధి పనులకు హాజరవుతారు. ఉపాధి పనులకు రెగ్యులర్గా హాజరయ్యే కూలీలకు చెందిన భూముల్లో ముందుగా ఫాంపాండ్స్ నిర్మించాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. క్రియాశీలక కూలీల్లో ఎంతమందికి భూములు ఉన్నాయి. వాటి విస్తీర్ణం ఎంత అనే వివరాలను పంచాయతీ కార్యదర్శులు జిల్లా యంత్రాంగానికి నివేదిస్తారు. ఫాంపాండ్స్ నిర్మాణాలతో తమ భూమి కోల్పోతామనే భావన చాలా మందిలో ఉంటుంది. రెండేళ్ల కిందట జిల్లావ్యాప్తంగా సుమారు మూడు వేల ఫాంపాండ్స్ నిర్మించారు. వాటిని చాలా మంది రైతులు పూడ్చివేశారు. ఫాంపాండ్ నిర్మించే ప్రదేశంలో పంటను కోల్పోతున్నామనే బాధ రైతులకు ఉంటుంది. ఈ విషయంలోనూ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఫాంపాండ్లో చేపల పెంపకం చేపట్టడం వల్ల అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోనున్నారు.
రైతులకు అవగాహన పెంచేలా..
ప్రతి రైతు తనకున్న వ్యవసాయ భూమిలో కచ్చితంగా ఒక ఫాంపాండ్ నిర్మించుకోవాలని భూగర్భజలశాఖ అధికారులు సూచిస్తున్నారు. రైతులు మాత్రం ఆసక్తి చూపడం లేదు. దీంతో గ్రామాల్లో ఆసక్తి ఉన్న రైతుల వివరాలను ముందుగా సేకరించనున్నారు. వారికి ఫాంపాండ్ల వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులు వివరిస్తారు. ఆ తర్వాత ముందుకు వచ్చిన రైతుల భూముల్లో నిర్మాణాలు చేపడుతారు. వాస్తవానికి రైతు భూవిస్తీర్ణంలో పదిశాతం భాగంలో ఫాంపాండ్ లేదా కందకాలను నిర్మించుకోవడం ఉత్తమం. వర్షం నీటిని వీలైనంత ఎక్కువగా భూమిలోకి పంపించే విధంగా చేయడంతో భూగర్భజలాలు స్థిరంగా ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా మహేష్ గుప్తా
[ 16-06-2024]
కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా మహేష్ గుప్తా ఎన్నికయ్యారు. -
కనీస వేతనాలు అమలు చేయాలి
[ 16-06-2024]
పురపాలక కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ నాయకులు ఛైర్పర్సన్ ఇందు ప్రియకి వినతి పత్రం అందజేశారు. -
నాన్నకు వందనం
[ 16-06-2024]
: నాన్న.. త్యాగాలకు నిలువెత్తు రూపం. కష్టాల కడలిలో ఒడ్డుకు చేర్చే నావికుడు. భవితకు మార్గం చూపే మార్గదర్శకుడు. -
గిరిజన జీవితాలే.. నా పుస్తకాలు
[ 16-06-2024]
గిరిజన జీవితాలను, విభిన్న మనస్తత్వాలను సుఖదుఃఖాలను లోతుగా పరిశీలించారు. తను చూసిన బతుకునీ, తన వాళ్ల వెతల్నీ, కథల్నీ కవిత్వంలో చెప్పాలనుకున్నాడు. -
అటవీ అధికారులకు రక్షణ కల్పించాలి
[ 16-06-2024]
అడవుల సంరక్షణ, భూములు అన్యాక్రాంతం కాకుండా విధులు నిర్వహిస్తున్న తమకు ప్రభుత్వం రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఫారెస్టు రేంజ్ అధికారుల సంఘం(బాసర సర్కిల్) ఉపాధ్యక్షుడు రవిమోహన్ భట్, జూనియర్ అటవీ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ పేర్కొన్నారు. -
విక్రయించిన ప్రతి బస్తాకూ లెక్క
[ 16-06-2024]
విత్తనాలు, ఎరువుల విక్రయాల్లో నిబంధనలు పాటించాలని, విక్రయించిన ప్రతి బస్తాకు లెక్కలుండాలని అదనపు కలెక్టర్ కిరణ్ ఆదేశించారు. -
ఎమ్మెల్యే సార్లూ.. మీరంతా కదలండీ
[ 16-06-2024]
జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు డిమాండ్ ఏళ్లుగా ఉంది. ఎన్నికల సందర్భాల్లో అన్ని పార్టీలు హామీలిస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
[ 16-06-2024]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన మండల పరిధిలోని బేగంపూర్ చౌరస్తా వద్ద 161వ జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. -
ఇస్కాన్ కేంద్రానికి ప్రచార వాహనం అందజేత
[ 16-06-2024]
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రానికి మహేశ్వరి సేవా సమాజ్ సభ్యులు శనివారం ఉచితంగా ధర్మ ప్రచార వాహనం అందించారు. -
రైతులు ఓటీఎస్ను సద్వినియోగం చేసుకోవాలి
[ 16-06-2024]
సహకార బ్యాంకులో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న రైతులు ఓటీఎస్(వన్ టైం సెటిల్మెంట్)ను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లాల సహకార బ్యాంకు మేనేజర్ సూర్య ప్రకాష్ పేర్కొన్నారు. -
అప్పు తీసుకొని.. అంతమొందించాడు
[ 16-06-2024]
ఇటీవల హత్యకు గురైన ఉప్పరి సాయవ్వ (70) హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు శనివారం బాన్సువాడ సీఐ మున్నూరు కృష్ణ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఇద్దరి మృతి
-
తిరుమలలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి: జె.శ్యామలరావు
-
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో 11వ ఘటన
-
ఓటీటీ సబ్స్క్రిప్షన్లతో వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్
-
పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం: మంత్రి నారాయణ