శుభ్రతకు సుస్తి.. నిబంధనలకు స్వస్తి
నగరపాలక సంస్థ పరిధిలోని ఆహారశాలల్లో కొన్నేళ్లుగా అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. ఆహార భద్రతా ప్రమాణాల కార్యాలయం అధికారి మూడు జిల్లాలకు ఒక్కరే ఉండడంతో పరిస్థితి అధ్వానంగా మారింది.
తనిఖీలతో ఆహారశాలలపై అధికారుల కొరడా
న్యూస్టుడే, నిజామాబాద్ నగరం
జరిమానా వసూలు చేస్తున్న ఎంహెచ్వో సాజిత్అలీ
నగరపాలక సంస్థ పరిధిలోని ఆహారశాలల్లో కొన్నేళ్లుగా అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. ఆహార భద్రతా ప్రమాణాల కార్యాలయం అధికారి మూడు జిల్లాలకు ఒక్కరే ఉండడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. ఇటు నగరపాలక సంస్థ, ఆటు ఆహార భద్రతా అధికారుల నిర్లక్ష్యంతో హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మంగళవారం నగరపాలక సంస్థ కమిషనర్ మకరందు ఆదేశాలు ఇవ్వడంతో పలు హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లను తనిఖీ చేశారు. పరిశుభ్రత పాటించని వాటిని గుర్తించి మొదటి రోజు హెచ్చరించారు. పరిస్థితి మారకపోతే జరిమానాలు వసూలు చేశారు.
5 సర్కిళ్లలో తనిఖీలు
నగరపాలక సంస్థ పరిధిలోని 5 సర్కిళ్లలో ఉన్న పారిశుద్ధ్య పర్యవేక్షకులు, సిబ్బంది మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆహార విక్రయశాలల్లో తనిఖీలు చేశారు. వంటగది, సరకులు, ప్లేట్లు శుభ్రపరిచే ప్రాంతం, టేబుళ్లు ఇలా అన్నింటిని పరిశీలించారు. అపరిశుభ్రంగా కనిపించిన హోటళ్ల యజమానులను హెచ్చరించి వదిలేశారు. మరుసటి రోజు నుంచి ఇలా ఉంటే జరిమానాలు విధిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్లాస్టిక్ సంచులూ వినియోగించొద్దు
దుకాణాలు, హోటళ్లు, టీస్టాళ్లలో ప్లాసిక్ కవర్లు దొరికితే ఊరుకునేది లేదని ఎంహెచ్వో సాజిత్అలీ హెచ్చరించారు. నిత్యం ఆకస్మికంగా తనిఖీలు చేస్తామని పాలిథిన్ సంచులు దొరికితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
కనిపించని మార్పు..
మంగళవారం పలు హోటళ్ల యజమానులను హెచ్చరించినా మార్పు రాలేదు. అధికారులు ఎప్పుడు ఇలా వస్తారని నిర్లక్ష్యంగా వ్యహరించారు. బుధవారం నగరంలోని రైల్వే స్టేషన్, ఆర్పీ రోడ్డులోని ఉన్న 12 దుకాణాలను నగరపాలక సంస్థ ఎంహెచ్వో సాజిత్అలీ తనిఖీలు చేపట్టి రూ.18 వేల జరిమానాలు వసూలు చేశారు. 15 హోటళ్లు తనిఖీలు చేయగా.. మూడు మినహా 12 హోటళ్లకు స్థాయిని బట్టి రూ.1000 నుంచి రూ.2000 వరకు జరిమానాలు విధించారు. మరోసారి ఇదే పరిస్థితి కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
[ 16-06-2024]
మండలంలోని తాండూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005-06లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం బంజారాలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. -
విద్యుత్తు ప్రజావాణి నిర్వహణ
[ 16-06-2024]
విద్యుత్ వినియోగదారుల సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు ప్రతి సోమవారం విద్యుత్ ప్రజావాణి నిర్వహించాలని టీజీ ఎన్ పీడీసీఎల్ సీఎండీ, ఎస్ఈ కామారెడ్డి ఆదేశించారు. -
ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా మహేష్ గుప్తా
[ 16-06-2024]
కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా మహేష్ గుప్తా ఎన్నికయ్యారు. -
కనీస వేతనాలు అమలు చేయాలి
[ 16-06-2024]
పురపాలక కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ నాయకులు ఛైర్పర్సన్ ఇందు ప్రియకి వినతి పత్రం అందజేశారు. -
నాన్నకు వందనం
[ 16-06-2024]
: నాన్న.. త్యాగాలకు నిలువెత్తు రూపం. కష్టాల కడలిలో ఒడ్డుకు చేర్చే నావికుడు. భవితకు మార్గం చూపే మార్గదర్శకుడు. -
గిరిజన జీవితాలే.. నా పుస్తకాలు
[ 16-06-2024]
గిరిజన జీవితాలను, విభిన్న మనస్తత్వాలను సుఖదుఃఖాలను లోతుగా పరిశీలించారు. తను చూసిన బతుకునీ, తన వాళ్ల వెతల్నీ, కథల్నీ కవిత్వంలో చెప్పాలనుకున్నాడు. -
అటవీ అధికారులకు రక్షణ కల్పించాలి
[ 16-06-2024]
అడవుల సంరక్షణ, భూములు అన్యాక్రాంతం కాకుండా విధులు నిర్వహిస్తున్న తమకు ప్రభుత్వం రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఫారెస్టు రేంజ్ అధికారుల సంఘం(బాసర సర్కిల్) ఉపాధ్యక్షుడు రవిమోహన్ భట్, జూనియర్ అటవీ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ పేర్కొన్నారు. -
విక్రయించిన ప్రతి బస్తాకూ లెక్క
[ 16-06-2024]
విత్తనాలు, ఎరువుల విక్రయాల్లో నిబంధనలు పాటించాలని, విక్రయించిన ప్రతి బస్తాకు లెక్కలుండాలని అదనపు కలెక్టర్ కిరణ్ ఆదేశించారు. -
ఎమ్మెల్యే సార్లూ.. మీరంతా కదలండీ
[ 16-06-2024]
జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు డిమాండ్ ఏళ్లుగా ఉంది. ఎన్నికల సందర్భాల్లో అన్ని పార్టీలు హామీలిస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
[ 16-06-2024]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన మండల పరిధిలోని బేగంపూర్ చౌరస్తా వద్ద 161వ జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. -
ఇస్కాన్ కేంద్రానికి ప్రచార వాహనం అందజేత
[ 16-06-2024]
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రానికి మహేశ్వరి సేవా సమాజ్ సభ్యులు శనివారం ఉచితంగా ధర్మ ప్రచార వాహనం అందించారు. -
రైతులు ఓటీఎస్ను సద్వినియోగం చేసుకోవాలి
[ 16-06-2024]
సహకార బ్యాంకులో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న రైతులు ఓటీఎస్(వన్ టైం సెటిల్మెంట్)ను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లాల సహకార బ్యాంకు మేనేజర్ సూర్య ప్రకాష్ పేర్కొన్నారు. -
అప్పు తీసుకొని.. అంతమొందించాడు
[ 16-06-2024]
ఇటీవల హత్యకు గురైన ఉప్పరి సాయవ్వ (70) హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు శనివారం బాన్సువాడ సీఐ మున్నూరు కృష్ణ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
సైబర్ నేరగాళ్లు కాజేసిన రూ.31 కోట్లు.. బాధితులకు అందజేసిన అధికారులు
-
శ్రీలీల ‘డ్రిప్పిన్’ కల్చర్.. రోజీ చీరలో మంజిమా..
-
కౌంటింగ్ వేళ ఈవీఎం అన్లాక్ ఘటన..ఎంపీ బంధువు అరెస్ట్
-
ఐపీఎస్ అధికారి గరికపాటి బిందు మాధవ్పై సస్పెన్షన్ ఎత్తివేత
-
మార్పొస్తుందని ఆశిస్తున్నా: పవన్ కల్యాణ్పై ఉపేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు
-
రేణుకాస్వామి హత్య కేసు.. ఆ కారు సీజ్!