హామీ తీరక.. వేతనం చాలక
పే స్కేల్ కోసం గ్రామ రెవెన్యూ సహాయకులు నిరసన బాటపట్టారు. విధులు బహిష్కరించి దీక్షా శిబిరాల్లో కూర్చుంటున్నారు. ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసినప్పటి నుంచి తమపై ఒత్తిడి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూతోపాటు అన్నిశాఖల పనుల్లో
మాచారెడ్డి మండలం ఘన్పూర్కు చెందిన వీఆర్ఏ రమేశ్ నవంబరు 24న ఆత్మహత్య చేసుకున్నారు. పే స్కేల్ అమలు కాకపోవడంతో అప్పులపాలై బలవన్మరణానికి పాల్పడ్డారని సహచర ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడాపల్లికి చెందిన వీఆర్ఏ హర్షవర్ధన్ కూడా పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ ఈ నెల 2న మృతిచెందారు. పది రోజుల వ్యవధిలో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వీఆర్ఏలకు పేస్కేల్ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ 2020 సెప్టెంబరు 9న శాసనసభలో ప్రకటించారు. 15 నెలలు గడుస్తున్నా అతీగతీ లేదంటూ వీఆర్ఏలు నిరసన బాటపట్టారు. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా అన్ని తహసీల్దారు కార్యాలయాల ఎదుట గత నెల 29 నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు దీక్షలు చేస్తున్నారు.
పే స్కేల్ కోసం గ్రామ రెవెన్యూ సహాయకులు నిరసన బాటపట్టారు. విధులు బహిష్కరించి దీక్షా శిబిరాల్లో కూర్చుంటున్నారు. ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసినప్పటి నుంచి తమపై ఒత్తిడి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూతోపాటు అన్నిశాఖల పనుల్లో భాగస్వామ్యం చేస్తున్నారని మదనపడుతున్నారు. అయినా కనీస వేతనం అమలుకావడం లేదని వాపోతున్నారు. పోటీ పరీక్షల్లో వీఆర్ఏ ఉద్యోగం సాధించిన విద్యావంతులకు పదోన్నతులు కల్పించడం లేదంటున్నారు. నిత్యం 12 నుంచి 15 గంటలు పనిచేస్తున్నా పే స్కేల్ వర్తించడం లేదని ఆందోళన చెందుతున్నారు.
ప్రత్యక్ష పద్ధతిలో ఎంపికైనా..
2012కు ముందు వీఆర్ఏల ఎంపికలు పరోక్ష పద్ధతిలో జరిగేవి. ఆ తరువాత వారి నియామకాలను అప్పటి ఏపీపీఎస్సీకి అప్పగించారు. పరోక్ష పద్ధతిపై జిల్లావ్యాప్తంగా 1,460 మంది ఉండేవారు. 2012లో తొలిసారిగా నిర్వహించిన పోటీ పరీక్షల్లో 60 మంది కొత్తగా ఎంపికయ్యారు. జిల్లాలో ప్రస్తుతం 1520 మంది విధులు నిర్వహిస్తున్నారు. మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి పదోన్నతులు కల్పించాలనే నిబంధన ఉన్నప్పటికీ అమలు కావడం లేదు.
వీఆర్వో వ్యవస్థ రద్దుతో..
* ప్రభుత్వం వీఆర్వోల వ్యవస్థ రద్దు చేసిన తర్వాత వీఆర్ఏలు కీలకంగా మారారు.
* కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తుల పరిశీలన, ప్రభుత్వ భూముల సంరక్షణ, భూరికార్డులు భద్రపరచడం, కులం, ఆదాయ, నివాస ధ్రువపత్రాల దరఖాస్తులు విచారించి నివేదిక ఇవ్వడం, ధరణి దరఖాస్తులు, ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి పనులు వీరే చేస్తున్నారు.
* ఇవి కాకుండా కంప్యూటర్ ఆపరేటర్, సెక్షన్ అసిస్టెంట్, రికార్డు కీపర్, అటెండర్, వాచ్మెన్, డ్రైవర్ వంటి పనులు చూస్తున్నారు.
* ఇటీవల వరి కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితిని తెలుసుకొనే బాధ్యతలు అప్పగించారు.
* గ్రామాల్లో పోలీసులకు సహాయకులుగా, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, జలవనరులశాఖల్లోనూ భాగస్వామ్యమవుతున్నారు.
* ఆరు రోజులుగా నిరసన దీక్షల్లో ఉండడంతో ప్రజోపయోగ పనులు పెండింగ్లో ఉంటున్నాయి.
* మధ్యాహ్నం నుంచి హాజరవుతున్నా పూర్తి చేయడం కష్టమవుతోంది. ముఖ్యంగా ధరణి రిజిస్ట్రేషన్ల సమయంలో రికార్డులు పరిశీలనకు అందుబాటులో లేకపోవడంతో అధికారులే చేయాల్సి వస్తోంది.
అన్ని పనులకు వాడుకుంటున్నారు - మెట్టు రవీందర్, వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు
ప్రస్తుతం ఒక్కో వీఆర్ఏకు నెలకు రూ.10,500 వేతనం, డీఏ రూ.700, ఇంక్రిమెంట్ రూ.200 మాత్రమే ఇస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 30శాతం పీఆర్సీ అమలు కావడం లేదు. అన్ని పనులకు మమ్మల్నే వాడుకుంటున్నారు. అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ బాధతోనే ఇద్దరు వీఆర్ఏలు ఆత్యహత్య చేసుకున్నారు. పే స్కేల్ అమలు చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. -
పల్లె పిలుస్తోంది.. పదండి..
[ 27-04-2024]
పిల్లలూ.. మీరు పట్టణాల్లో ఉంటున్నా.. మీ మూలాలు పల్లెలకు చెంది ఉంటాయి. అక్కడి ప్రత్యేకతలేంటో మీకు తెలుసా మరీ.. పట్టణాలకు చెందిన వారే కాదు.. -
పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. -
బాజిరెడ్డికి 1.. అర్వింద్కు 2.. జీవన్రెడ్డికి 3...
[ 27-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. -
మద్యం మత్తు.. ప్రాణాలు తీస్తోంది
[ 27-04-2024]
గతేడాది అక్టోబరు 28న ధర్మారం(బీ)లో పెట్రోల్ బంక్ వద్ద డిచ్పల్లి వైపు వస్తున్న నిజామాబాద్కు చెందిన యువతీ యువకులను కారు ఢీ కొంది. -
పది మంది నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ సమక్షంలో పరిశీలించారు. -
సార్వత్రిక పరీక్షలు.. అయినవాళ్లకే విధులు
[ 27-04-2024]
ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన పది, ఇంటర్ పరీక్షలు గురువారం ప్రారôభమయ్యాయి. ఏటా వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. -
జిల్లాలో పెరిగిన ఓటర్లు
[ 27-04-2024]
జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
అనారోగ్యాన్ని జయించి... ఇంటర్లో ప్రతిభ చూపి
[ 27-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి రెండేళ్ల కిందట వరుసగా రెండు శస్త్రచికిత్సలు చేసినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. -
ఎండలతో ఆలస్యంగా సమావేశాలు
[ 27-04-2024]
ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల క్షేత్రంలో మాజీ పాలనాధికారులు
[ 27-04-2024]
నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా ఇది వరకు పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. -
2 నదులు 2 లోక్సభ నియోజకవర్గాలు
[ 27-04-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. -
గీత దాటితే.. జైలుకే
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేయనుంది. -
అతివేగంతోనే ప్రమాదం
[ 27-04-2024]
కమ్మర్పల్లి నుంచి బడాపహాడ్కు గురువారం రాత్రి సుమారు 36 మంది భక్తులతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
[ 27-04-2024]
కుమార్తెను మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య గొంతు నులిమి చంపిన ఘటన కులాస్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!