సృజనాత్మకతకు పదును
విద్యార్థుల్లో సైన్స్పై మక్కువ పెంచేలా ప్రేరణ, వైజ్ఞానిక ప్రదర్శనలు ఏటా నిర్వహిస్తుంటారు. వారికి సామాన్య ఉపాధ్యాయులు గైడ్ టీచర్లుగా వ్యవహరిస్తూ ప్రదర్శనకు రూపకల్పన చేస్తుంటారు. ప్రస్తుతం
బోధకులు, విద్యార్థుల నుంచి పరిశోధన పత్రాలు
అవకాశం కల్పించిన ఎస్సీఈఆర్టీ
న్యూస్టుడే, కామారెడ్డి పట్టణం
ప్రదర్శన ఇస్తున్న విద్యార్థులు
విద్యార్థుల్లో సైన్స్పై మక్కువ పెంచేలా ప్రేరణ, వైజ్ఞానిక ప్రదర్శనలు ఏటా నిర్వహిస్తుంటారు. వారికి సామాన్య ఉపాధ్యాయులు గైడ్ టీచర్లుగా వ్యవహరిస్తూ ప్రదర్శనకు రూపకల్పన చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమ సృజనాత్మకతను పదును పెట్టుకునే అవకాశాన్ని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి కల్పిస్తోంది. ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ ఆలోచనలకు సంబంధించిన పరిశోధన పత్రాలు ఆహ్వానిస్తోంది. విద్యార్థులకు ప్రయోగాత్మకంగా బోధించేలా ప్రణాళికలు రూపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం.
ఏ అంశాల్లో.. సామాన్య బోధనా దృక్కోణాలు పునర్వచించడంతో పాటు ఉప అంశాలు, ప్రయోగశాలలు, వాస్తవ ప్రపంచం, ప్రాజెక్టు ఆధారిత అభ్యసనం, స్థానిక సవాళ్లు, సమస్యల పరిష్కారాలను కనుక్కోవడం, 21వ శతాబ్దపు నైపుణ్యాలు- బోధనా అభ్యసన ప్రక్రియలో మార్పులపై పరిశోధన పత్రాలు అందించవచ్ఛు
ఫిబ్రవరి 2వ తేదీ తుది గడువు.. పరిశోధన పత్రాలు పంపించేందుకు ఫిబ్రవరి 2వ తేదీ వరకు గడువు ఉంది. ఎంపికైన వారికి ఫిబ్రవరి 28న రాష్ట్రస్థాయి సదస్సులో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. వీటిలో ఉత్తమమైనవి ఎంపిక చేసి క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటారు. రాష్ట్రస్థాయిలో ఎంపికైన పరిశోధన పత్రాలతో పుస్తకాన్ని ముద్రిస్తారు. ఆన్లైన్ లేదా ప్రత్యక్ష పద్ధతిలో ప్రదర్శన నిర్వహిస్తారు.
సెమినార్ లక్ష్యాలు●
* సైన్స్ను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించేలా ఉపాధ్యాయులను ప్రోత్సహించడం. ● సైన్స్ ద్వారా అభివృద్ధి చెందుతున్న భారతదేశ ఆకాంక్షలు, సవాళ్లను ఉపాధ్యాయులు వినూత్న ఆలోచనలతో ఎదుర్కొనేలా ప్రోత్సహించడం.
* ఉపాధ్యాయులు, అధ్యాపకులతోపాటు సైన్స్ పరిశోధకులు డీఈడీ, బీఈడీ చేసే అభ్యర్థులు, ఎన్జీవోలు తమ పరిశోధన పత్రాన్ని ఆంగ్లం లేదా తెలుగులో రూపొందించవచ్ఛు
* వెయ్యి పదాలకు మించకుండా నాలుగు పేజీల్లో రాసి tgscertmaths science @gmail.comకు పంపాలి.
అవకాశాన్ని వినియోగించుకోవాలి
- సిద్ధిరాంరెడ్డి, సైన్స్ జిల్లా అధికారి
ఉపాధ్యాయులు, అధ్యాపకులతో పాటు డీఈడీ, బీఈడీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్ఛు సెమినార్లో పాల్గొనేలా మండల విద్యాశాఖ అధికారులు, ఆయా పాఠశాలల యాజమాన్యాలు అవగాహన కల్పించాలి.
భవిష్యత్తుకు దోహదం : రాజు, డీఈవో
పరిశోధనా పత్రాలు చక్కగా రూపొందించి విద్యాశాఖ పరిశోధన మండలికి సమర్పించాలి. భవిష్యత్తులో ఆయా అంశాల్లో నైపుణ్యాలు వెలికితీసే క్రమంలో దీనిని పరిగణనలోకి తీసుకొంటారు. ప్రతి సైన్స్ ఉపాధ్యాయుడు ప్రదర్శన చేపట్టాలని సూచించాం. పిల్లలకు పాఠాలు నేర్పుతూనే మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇది దోహదం చేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. -
పల్లె పిలుస్తోంది.. పదండి..
[ 27-04-2024]
పిల్లలూ.. మీరు పట్టణాల్లో ఉంటున్నా.. మీ మూలాలు పల్లెలకు చెంది ఉంటాయి. అక్కడి ప్రత్యేకతలేంటో మీకు తెలుసా మరీ.. పట్టణాలకు చెందిన వారే కాదు.. -
పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. -
బాజిరెడ్డికి 1.. అర్వింద్కు 2.. జీవన్రెడ్డికి 3...
[ 27-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. -
మద్యం మత్తు.. ప్రాణాలు తీస్తోంది
[ 27-04-2024]
గతేడాది అక్టోబరు 28న ధర్మారం(బీ)లో పెట్రోల్ బంక్ వద్ద డిచ్పల్లి వైపు వస్తున్న నిజామాబాద్కు చెందిన యువతీ యువకులను కారు ఢీ కొంది. -
పది మంది నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ సమక్షంలో పరిశీలించారు. -
సార్వత్రిక పరీక్షలు.. అయినవాళ్లకే విధులు
[ 27-04-2024]
ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన పది, ఇంటర్ పరీక్షలు గురువారం ప్రారôభమయ్యాయి. ఏటా వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. -
జిల్లాలో పెరిగిన ఓటర్లు
[ 27-04-2024]
జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
అనారోగ్యాన్ని జయించి... ఇంటర్లో ప్రతిభ చూపి
[ 27-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి రెండేళ్ల కిందట వరుసగా రెండు శస్త్రచికిత్సలు చేసినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. -
ఎండలతో ఆలస్యంగా సమావేశాలు
[ 27-04-2024]
ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల క్షేత్రంలో మాజీ పాలనాధికారులు
[ 27-04-2024]
నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా ఇది వరకు పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. -
2 నదులు 2 లోక్సభ నియోజకవర్గాలు
[ 27-04-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. -
గీత దాటితే.. జైలుకే
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేయనుంది. -
అతివేగంతోనే ప్రమాదం
[ 27-04-2024]
కమ్మర్పల్లి నుంచి బడాపహాడ్కు గురువారం రాత్రి సుమారు 36 మంది భక్తులతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
[ 27-04-2024]
కుమార్తెను మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య గొంతు నులిమి చంపిన ఘటన కులాస్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.