మంత్రి ఇలాఖాలో ఇచ్చింది 112 ఇళ్లే
మంత్రి ప్రశాంత్రెడ్డి పాల్గొనొద్దని పిలుపునిచ్చినా రైతులు పెద్దసంఖ్యలో తరలొచ్చారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు పేర్కొన్నారు. వేల్పూర్లో భాజపా ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రైతుధర్నాకు ఎంపీ అర్వింద్ ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఎంపీ హామీ గురించి మాట్లాడుతున్న
రైతుధర్నాలో ప్రసంగిస్తున్న రఘునందన్రావు, వేదికపై ఎంపీ అర్వింద్, భాజపా జిల్లా అధ్యక్షుడు
బస్వాలక్ష్మీనర్సయ్య, పల్లె గంగారెడ్డి, వడ్డి మోహన్రెడ్డి, మేడపాటి ప్రకాశ్రెడ్డి, దినేష్ కులాచారి, కంచెట్టి గంగాధర్
ఈనాడు, నిజామాబాద్: మంత్రి ప్రశాంత్రెడ్డి పాల్గొనొద్దని పిలుపునిచ్చినా రైతులు పెద్దసంఖ్యలో తరలొచ్చారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు పేర్కొన్నారు. వేల్పూర్లో భాజపా ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రైతుధర్నాకు ఎంపీ అర్వింద్ ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఎంపీ హామీ గురించి మాట్లాడుతున్న మంత్రి తెరాస మేనిఫెస్టోపైనా చర్చించాలన్నారు. ఏకకాలంలో రూ.లక్ష రుణమాఫీ ఏమైందన్నారు. వంద రోజుల్లో చక్కెర పరిశ్రమ తెరుస్తామని చెప్పారని ఎద్దేవా చేశారు. ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఉపాధి అంటూ చెప్పిన మాటలు మీవి కావా అని ప్రశ్నించారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంపై సహచట్టం ద్వారా వివరాలు సేకరించానని, మంత్రి ఇలాఖాలో కేవలం 112 మందికే ఇచ్చారని పేర్కొన్నారు. తాళ్లరాంపూర్ సొసైటీలో అక్రమాలకు పాల్పడిన నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలన్నారు. తాను వస్తుంటే అడ్డుకొనే ప్రయత్నాలు చేశారని, ప్రశ్నించే గొంతులను నొక్కటమే తెరాస ప్రభుత్వం పనిగా పెట్టుకుందన్నారు.
ఐదు నెలల్లో కేంద్రాన్ని ఒప్పించా: ఎంపీ అయ్యాక ఐదు నెలల్లోపు పసుపు రైతుల సమస్య పరిష్కారానికి కేంద్రాన్ని ఒప్పించానని ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. దీని ఫలితంగానే సుగంధద్రవ్యాల బోర్డులో భాగమైన స్పైస్బోర్డు ఎక్స్టెన్షన్ సెంటర్ నిజామాబాద్లో ఏర్పాటైందన్నారు. గడిచిన మూడేళ్లలో ఈ కార్యాలయం ద్వారా రూ.30 కోట్లు తెచ్చానని, దిగుమతులు నిలిపి పంటకు డిమాండ్ పెరిగేలా కృషి చేసినట్లు చెప్పారు. ఎంపీగా పనిచేసిన కవిత కేవలం బోర్డు పేరుతో కాలయాపన చేశారని ఎద్దేవా చేశారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు అవకాశం ఉన్నా కేసీఆర్, కేటీఆర్కు చిత్తశుద్ధి లేదన్నారు. తాము రైతుధర్నా పెట్టుకుంటే ఎందుకు ఉలికిపడుతున్నారని ప్రశ్నించారు. మంత్రి సోదరుడిని ఉద్దేశించి విమర్శలు చేశారు. జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, నాయకులు ధన్పాల్ సూర్యనారాయణ, ఏలేటి మల్లికార్జున్రెడ్డి, వడ్డీ మోహన్రెడ్డి, మేడపాటి ప్రకాశ్రెడ్డి, దినేష్ కులాచారి, మాల్యాద్రిరెడ్డి, స్రవంతిరెడ్డి, కంచెట్టి గంగాధర్ పాల్గొన్నారు.
ఎంపీ, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫ్లెక్సీ
వేల్పూర్: వేల్పూర్ క్రాస్ రోడ్డులో భాజాపా ఆధ్వర్యంలో చేపట్టిన రైతుధర్నా స్థలం వద్ద ఎంపీ అర్వింద్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావుకు వ్యతిరేకంగా బాల్కొండ నియోజకవర్గ ప్రజల పేరిట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. -
పల్లె పిలుస్తోంది.. పదండి..
[ 27-04-2024]
పిల్లలూ.. మీరు పట్టణాల్లో ఉంటున్నా.. మీ మూలాలు పల్లెలకు చెంది ఉంటాయి. అక్కడి ప్రత్యేకతలేంటో మీకు తెలుసా మరీ.. పట్టణాలకు చెందిన వారే కాదు.. -
పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. -
బాజిరెడ్డికి 1.. అర్వింద్కు 2.. జీవన్రెడ్డికి 3...
[ 27-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. -
మద్యం మత్తు.. ప్రాణాలు తీస్తోంది
[ 27-04-2024]
గతేడాది అక్టోబరు 28న ధర్మారం(బీ)లో పెట్రోల్ బంక్ వద్ద డిచ్పల్లి వైపు వస్తున్న నిజామాబాద్కు చెందిన యువతీ యువకులను కారు ఢీ కొంది. -
పది మంది నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ సమక్షంలో పరిశీలించారు. -
సార్వత్రిక పరీక్షలు.. అయినవాళ్లకే విధులు
[ 27-04-2024]
ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన పది, ఇంటర్ పరీక్షలు గురువారం ప్రారôభమయ్యాయి. ఏటా వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. -
జిల్లాలో పెరిగిన ఓటర్లు
[ 27-04-2024]
జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
అనారోగ్యాన్ని జయించి... ఇంటర్లో ప్రతిభ చూపి
[ 27-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి రెండేళ్ల కిందట వరుసగా రెండు శస్త్రచికిత్సలు చేసినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. -
ఎండలతో ఆలస్యంగా సమావేశాలు
[ 27-04-2024]
ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల క్షేత్రంలో మాజీ పాలనాధికారులు
[ 27-04-2024]
నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా ఇది వరకు పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. -
2 నదులు 2 లోక్సభ నియోజకవర్గాలు
[ 27-04-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. -
గీత దాటితే.. జైలుకే
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేయనుంది. -
అతివేగంతోనే ప్రమాదం
[ 27-04-2024]
కమ్మర్పల్లి నుంచి బడాపహాడ్కు గురువారం రాత్రి సుమారు 36 మంది భక్తులతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
[ 27-04-2024]
కుమార్తెను మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య గొంతు నులిమి చంపిన ఘటన కులాస్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.