రోడ్డు ప్రమాదాలపై తక్షణ స్పందన
రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు పతి క్షణం ఎంతో విలువైంది. బాధితులకు వేగంగా సేవలు అందించి ప్రాణాలు కాపాడం చాలా ముఖ్యం. దీన్ని గుర్తించిన ఇందల్వాయి టోల్ప్లాజా యాజమాన్యం తమ పరిధిలోని రహదారిపై సేవలను విస్తరించింది.
ఇందల్వాయి టోల్ప్లాజా పరిధిలో మెరుగైన సేవలు
న్యూస్టుడే, ఇందల్వాయి
చంద్రాయన్పల్లి వద్ద 44వ నంబరు జాతీయ రహదారి
రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు పతి క్షణం ఎంతో విలువైంది. బాధితులకు వేగంగా సేవలు అందించి ప్రాణాలు కాపాడం చాలా ముఖ్యం. దీన్ని గుర్తించిన ఇందల్వాయి టోల్ప్లాజా యాజమాన్యం తమ పరిధిలోని రహదారిపై సేవలను విస్తరించింది. దీంతో రాష్ట్రంలోని అన్ని టోల్ప్లాజాల కంటే సత్వరమే స్పందిస్తున్నట్లు జాతీయ రహదారుల సంస్థ నుంచి ప్రశంసలు పొందింది. ఈ నేపథ్యంలో రోడ్డు నిర్వహణలో మారిన పరిస్థితులు, అందుతున్న అత్యవసర సేవలపై ప్రత్యేక కథనం...
అత్యవసర టెలిఫోన్: రహదారి వెంట ప్రతి 2 కి.మీ ఒకటి చొప్పున ఉన్నాయి. కేవలం ఒక బటన్ నొక్కడంతో టోల్ప్లాజాలోని కంట్రోల్ రూంకు కనెక్ట్ అవుతుంది. ప్రయాణికులు వారి పరిస్థితిని వివరిస్తే అవసరమైన సహాయం చేస్తారు. ప్రమాద సమయాల్లోనే కాకుండా వాహనం మొరాయించినప్పుడు, ఇంధనం లేక మధ్యలో నిలిచిపోయినా స్పందిస్తారు.
హైవే పెట్రోలింగ్ వాహనం: ఇవి 30 కి.మీ ఒకటి చొప్పున అందుబాటులో ఉంటాయి. నిరంతరం రహదారిపై తిరుగుతుంటాయి. వీరి వద్ద ఎప్పుడు 5 లీటర్ల డీజిల్, పెట్రోల్ నిల్వ ఉంచుతారు. ఇంధనం లేక ఏదైనా వాహనం నిలిచిపోతే వారికి అందజేసి, సురక్షిత ప్రాంతానికి తరలిస్తారు. ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తారు.
అంబులెన్సు: ఇవి కూడా 30 కి.మీ ఒకటి చొప్పున ఉన్నాయి. ప్రధాన కూడళ్ల వద్ద అందుబాటులో ఉంచుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే హెచ్టీఎంఎస్ కంట్రోల్ రూం సిబ్బంది సంబంధిత అంబులెన్సు డైవర్కు సమాచారం అందిస్తారు. సుశిక్షుతులైన సిబ్బందితో ప్రథమ చికిత్స అందిస్తూ నిమిషాల్లో దవాఖానాలకు చేరవేస్తున్నారు. మొత్తం 40 మంది సిబ్బందిని సేవల కోసం వినియోగిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.
హైడ్రా(క్రేన్): ప్లాజా పరిధిలో ఒకటి ఉంది. ఏదైనా ప్రమాదం జరిగి వాహనం రోడ్డుకు అడ్డుగా పడిపోయి రాకపోకలకు ఇబ్బందిగా మారితే దీని సాయంతో వాటిని తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరిస్తారు.
బాధ్యత పెరిగింది
- చలపతి, టోల్ప్లాజా మేనేజర్, ఇందల్వాయి
లోపాలను సవరించుకుంటూ వేగంగా సేవలు అందిస్తున్నాం. ప్రమాదం జరిగిన సమయంలో మొదటి గంట క్షతగాత్రులకు చాలా కీలకం. వారిని కాపాడేందుకు సిబ్బందికి నిరంతరం శిక్షణ ఇస్తున్నాం. రహదారి భద్రతపై వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏడు నిమిషాల్లోనే స్పందిస్తున్నామని స్వయంగా టోల్ఫ్రీ నివేదికలో వెల్లడైంది. దీంతో మాపై మరింత బాధ్యత పెరిగింది. వాహనదారుల సౌకర్యార్థం టోల్ప్లాజా పరిధిలో రెండుచోట్ల మరుగుదొడ్లు, స్నానాల గదులు నిర్మించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. -
పల్లె పిలుస్తోంది.. పదండి..
[ 27-04-2024]
పిల్లలూ.. మీరు పట్టణాల్లో ఉంటున్నా.. మీ మూలాలు పల్లెలకు చెంది ఉంటాయి. అక్కడి ప్రత్యేకతలేంటో మీకు తెలుసా మరీ.. పట్టణాలకు చెందిన వారే కాదు.. -
పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. -
బాజిరెడ్డికి 1.. అర్వింద్కు 2.. జీవన్రెడ్డికి 3...
[ 27-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. -
మద్యం మత్తు.. ప్రాణాలు తీస్తోంది
[ 27-04-2024]
గతేడాది అక్టోబరు 28న ధర్మారం(బీ)లో పెట్రోల్ బంక్ వద్ద డిచ్పల్లి వైపు వస్తున్న నిజామాబాద్కు చెందిన యువతీ యువకులను కారు ఢీ కొంది. -
పది మంది నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ సమక్షంలో పరిశీలించారు. -
సార్వత్రిక పరీక్షలు.. అయినవాళ్లకే విధులు
[ 27-04-2024]
ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన పది, ఇంటర్ పరీక్షలు గురువారం ప్రారôభమయ్యాయి. ఏటా వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. -
జిల్లాలో పెరిగిన ఓటర్లు
[ 27-04-2024]
జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
అనారోగ్యాన్ని జయించి... ఇంటర్లో ప్రతిభ చూపి
[ 27-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి రెండేళ్ల కిందట వరుసగా రెండు శస్త్రచికిత్సలు చేసినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. -
ఎండలతో ఆలస్యంగా సమావేశాలు
[ 27-04-2024]
ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల క్షేత్రంలో మాజీ పాలనాధికారులు
[ 27-04-2024]
నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా ఇది వరకు పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. -
2 నదులు 2 లోక్సభ నియోజకవర్గాలు
[ 27-04-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. -
గీత దాటితే.. జైలుకే
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేయనుంది. -
అతివేగంతోనే ప్రమాదం
[ 27-04-2024]
కమ్మర్పల్లి నుంచి బడాపహాడ్కు గురువారం రాత్రి సుమారు 36 మంది భక్తులతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
[ 27-04-2024]
కుమార్తెను మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య గొంతు నులిమి చంపిన ఘటన కులాస్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!