logo

పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ

రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామంలో నూతన పాఠశాల భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌.. పారిశ్రామిక వేత్త తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.

Updated : 08 Dec 2022 15:08 IST

రామారెడ్డి : రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామంలో నూతన పాఠశాల భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌.. పారిశ్రామిక వేత్త తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ మండలంలోనే ఆదర్శ పాఠశాలగా రెడ్డిపేట పాఠశాలను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ పాఠశాల భవనానికి రూ.1.9కోట్లు మంజూరయ్యాయని.. మిగతా ఖర్చును తాను భరిస్తానని తెలిపారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి పరిశ్రమలు స్థాపించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో పీవో సాయన్న,  ఎంపీపీ దశరథరెడ్డి, వైస్‌ ఎంపీపీ రవీందర్‌రావు, ఎంపీడీవో విజయ్‌కుమార్‌, సర్పంచి సునందన, ఎంపీటీసీ సభ్యుడు రాజాగౌడ్‌, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రామిరెడ్డి, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని