logo

మేమ్‌ ఫేమస్‌ చిత్ర బృందం సందడి

కొత్త నటీనటులతో తెరకెక్కిన మేమ్‌ ఫేమస్‌ చిత్ర బృందం ఇందూరులో సందడి చేసింది. యూత్‌ ఆఫ్‌ తెలంగాణ పేరుతో చేపట్టిన సినిమా యాత్రలో భాగంగా గురువారం జిల్లా కేంద్రానికి వారు చేరుకున్నారు.

Published : 02 Jun 2023 05:56 IST

మాట్లాడుతున్న హీరో సుమంత్‌ ప్రభాస్‌, నటీనటులు

నిజామాబాద్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: కొత్త నటీనటులతో తెరకెక్కిన మేమ్‌ ఫేమస్‌ చిత్ర బృందం ఇందూరులో సందడి చేసింది. యూత్‌ ఆఫ్‌ తెలంగాణ పేరుతో చేపట్టిన సినిమా యాత్రలో భాగంగా గురువారం జిల్లా కేంద్రానికి వారు చేరుకున్నారు. ఓ ప్రైవేటు సమావేశ మందిరంలో విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తర్వాత చిత్రం ప్రదర్శిస్తున్న ఉషాప్రసాద్‌ మల్టీఫ్లెక్స్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా తిలకించారు. తెలంగాణ గ్రామీణ యువతపై తీసిన తమ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరారు. దర్శక నటుడు సుమంత్‌ ప్రభాస్‌, నటులు లక్ష్మణ్‌, మణి, కిరణ్‌, సంగీత దర్శకుడు కల్యాణ్‌ నాయక్‌, అంజిమామ, శివ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని