logo

ప్రధాని మోదీ పాలనలోనే దేశం అభివృద్ధి: భాజపా

ప్రధాని మోదీ పాలనలో దేశం అభివృద్ధి దిశలో పయనిస్తోందని జహీరాబాద్ ఎంపీ, భాజపా జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు.

Updated : 29 Mar 2024 17:33 IST

ఎల్లారెడ్డి పట్టణం: ప్రధాని మోదీ పాలనలో దేశం అభివృద్ధి దిశలో పయనిస్తోందని జహీరాబాద్ ఎంపీ, భాజపా జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేసి కేంద్రంలో ప్రధాన మంత్రి మోదీని బలపరిచేలా భాజపా గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీగా తన హయాంలో లోక్‌సభ పరిధిలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త కూడా తానే అభ్యర్థిగా భావించి ఎన్నికల్లో పని చేసి గెలుపునకు కృషి చేయాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ భాజపా జెండా ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో  నాయకులు బాణాల లక్ష్మారెడ్డి, మర్రి రాంరెడ్డి, లింగరావు, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని