పట్టణ ఓటర్లారా..బాధ్యత మరవొద్దు
పట్టణాలు, నగరాలు అంటే ‘ఆధునికత’ అనే భావన ఉంటుంది. అలాంటి ప్రాంతాలే గ్రామీణ ఓటర్లకు మార్గదర్శకంగా ఉండాలి. కానీ అందుకు విరుద్ధంగా ప్రజాస్వామ్యంలో ఈ ప్రాంత ఓటర్లే ఓటింగ్కు దూరంగా ఉండటం సరికాదనే అభిప్రాయం పౌర సమాజం నుంచి వ్యక్తమవుతోంది.
పోలింగ్ శాతంలో వెనుకబాటు
న్యూస్టుడే, ఇందూరు ఫీచర్స్: పట్టణాలు, నగరాలు అంటే ‘ఆధునికత’ అనే భావన ఉంటుంది. అలాంటి ప్రాంతాలే గ్రామీణ ఓటర్లకు మార్గదర్శకంగా ఉండాలి. కానీ అందుకు విరుద్ధంగా ప్రజాస్వామ్యంలో ఈ ప్రాంత ఓటర్లే ఓటింగ్కు దూరంగా ఉండటం సరికాదనే అభిప్రాయం పౌర సమాజం నుంచి వ్యక్తమవుతోంది. అయితే ఎక్కడో జరిగిన పోలింగ్ సరళి మనకు ఎందుకు అనుకోవడానికి లేదు. జిల్లాలోనూ అందుకు సంబంధించిన ఆనవాళ్లు మనకు గత పోలింగ్ సరళిలో కనిపిస్తాయి. నిజామాబాద్ నగరం ఎప్పుడు పోలింగ్లో వెనుకబడే ఉంటుంది. 2019 లోక్సభ ఎన్నికల లెక్కల ప్రకారం చూస్తే నియోజకవర్గంలో పట్టణ ఓటర్లు 35.6 శాతం మంది ఉంటే గ్రామీణ పరిధిలో 64.4 శాతం మంది ఉన్నారని అంచనా వేశారు. ఈ ఎన్నికల్లోనూ పట్టణ ఓటర్ల శాతంలో వృద్ధి ఉండొచ్చు కానీ తగ్గడమైతే ఉండదనే వాదన ఉంది.
పోటెత్తుతున్న గ్రామీణులు..
ఏ ఎన్నికలు తీసుకున్నా ఉమ్మడి జిల్లాలో పట్టణ ఓటర్లకంటే గ్రామీణులే పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. పట్టణాల్లో ప్రతి ఎన్నికకు మధ్య స్వల్ప పెరుగుదల నమోదవుతోంది. ఎన్నికల సంఘం ఓటు విలువ తెలిపేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా లాభం ఉండటం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యంపై ఎందుకింత నిర్లిప్తత ఆవహించిందంటూ నాగ్పూర్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ తదుపరి విడతల్లో పోలింగ్ జరగనున్న నగరాలు, పట్టణ ఓటర్లకు వర్తిస్తుందనే విషయం గ్రహించాలి.
‘‘మీకు తెలుసా
10,15,937 మంది నాగ్పూర్ లోక్సభ నియోజకవర్గ ఓటర్లు ఓటింగ్లో పాల్గొనలేదు. సిగ్గు చేటు. జారీ చేసిన వారు అతిపెద్ద ప్రజాస్వామ్య వేడుకలో పాల్గొన్న పౌరులు’’ అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఒక ఫొటో ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనికి ఇటీవల బెంగళూరు నగరంలోని మూడు నియోజకవర్గాల్లో 55 శాతం దాటని పోలింగ్ సరళిని జోడిస్తున్నారు.
వ్యత్యాసం..
ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 2018 శాసనసభ ఎన్నికల కంటే 2019 లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదుకావడం గమనార్హం. గత ఏడాది శాసనసభ ఎన్నికల్లోనూ నిజామాబాద్ అర్బన్ ఓటర్లు పోలింగ్కు దూరంగా ఉన్నారు. కానీ 2018తో (62.65) పోలిస్తే 2023 పోలింగ్ శాతంలో (68.56) పెరుగుదల కనిపించింది. పట్టణ ఓటర్లు ఉండే కామారెడ్డి నియోజకవర్గంలో పోలింగ్ శాతం 2018 (78.83) కంటే 2019 (67.45), 2023 (74.86) ఎన్నికల్లో తక్కువగా నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యా సంవత్సరం వృథా కాకూడదు
[ 17-05-2024]
విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరం వృథా కాకుండా చూడాలని సంబంధిత అధికారులకు జిల్లా పాలనాధికారి జితేష్ వీ పాటిల్ సూచించారు. -
లారీల కొరత లేకుండా చూడాలి: కలెక్టర్
[ 17-05-2024]
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని, తూకం వేసిన బస్తాలను తరలించేందుకు లారీల కొరత లేకుండా చూడాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ అన్నారు. -
తెరపైకి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల
[ 17-05-2024]
జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో మూడు విధాల ప్రతిపాదనలు ఉన్నత స్థాయికి వెళ్లినా ఆచరణలో ముందడుగు పడని విషయం తెలిసిందే. -
కేంద్రాల్లోనే ధాన్యం బస్తాలు
[ 17-05-2024]
జిల్లాలో వరి కోతలు మొదలై నెలరోజులైనా కొనుగోళ్లు పూర్తికావడం లేదు. హమాలీలు, సంచుల కొరత లేనప్పటికీ లారీలు లేక రైతులు కల్లాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో సేకరణకు రైసుమిల్లర్లు ససేమిరా అంటున్నారు. -
ఎత్తుకు పై ఎత్తులు
[ 17-05-2024]
ఎల్లారెడ్డి పురపాలక సంఘం రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్, భారాసకు చెందిన నాయకులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. -
రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం
[ 17-05-2024]
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్గా చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రైతులకు చేస్తున్న మోసాన్ని వదిలేది లేదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హెచ్చరించారు. -
పారిశ్రామిక శిక్షణ.. ఉపాధికి నిచ్చెన
[ 17-05-2024]
తక్కువ చదువుతో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్న కోర్సులు ఐటీఐ. పారిశ్రామిక శిక్షణ పూర్తి చేసిన వారిలో 90 శాతం మంది ఉపాధి పొందుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
పెరిగిన వినియోగం.. తగ్గిన లబ్ధిదారులు
[ 17-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద తెల్ల రేషన్కార్డు కలిగిన లబ్ధిదారులకు నెలకు 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా సరఫరా చేసి శూన్య బిల్లులు అందజేస్తోంది. ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభమైంది. -
వేసవి శిక్షణ.. లక్ష్యసాధన
[ 17-05-2024]
వేసవి సెలవులను వృథా చేయకుండా ఈ చిన్నారులు తమలోని అంతర్గత ప్రతిభకు పదును పెడుతున్నారు. వేసవి శిక్షణ తరగతుల్లో పాల్గొంటూ.. తమకు ఇష్టమైన రంగంలో సృజనాత్మకతతో రాణిస్తున్నారు. -
విభిన్న కోర్సుల ప్రత్యేకం
[ 17-05-2024]
ఆరు దశాబ్దాలుగా కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రత్యేకత చాటుతోంది. ఇక్కడ చదివిన వారు ఉన్నత రంగాల్లో స్థిరపడ్డారు. 158 ఎకరాల విశాలమైన స్థలంలో కళాశాల ఏర్పాటైంది. -
మొబైల్ ‘దోస్త్’తో సులభం
[ 17-05-2024]
రాష్ట్రంలోని ఏ విశ్వవిద్యాలయంలోనైనా డిగ్రీలో ప్రవేశం పొందడానికి ఇదివరకే ఆన్లైన్ విధానం అందుబాటులో ఉంది. ఈ ఏడాది నుంచి కొత్తగా మొబైల్లో దోస్త్ ఆప్లికేషన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. -
సెర్చ్ కమిటీ ఏర్పాటు
[ 17-05-2024]
రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు నూతన ఉపకులపతి(వీసీ)ల నియామకానికి సెర్చ్(అన్వేషణ) కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ముగ్గురు సభ్యులుంటారు. -
అక్రమ రిజిస్ట్రేషన్లపై విజిలెన్స్
[ 17-05-2024]
అనుమతి లేని లేఅవుట్లకు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేయటాన్ని కట్టడి చేయటంపై రిజిస్ట్రేషన్ల శాఖ దృష్టి సారించింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వారీగా రూపొందిన దస్తావేజుల ఆధారంగా విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. -
చరవాణి కోసం.. రైలు నుంచి దూకి
[ 17-05-2024]
ప్రాణం కంటే చరవాణి విలువైనది అనుకున్నాడేమో ఆ యువకుడు రైలులో ప్రయాణిస్తుండగా ఫోన్ కిందపడిపోవడంతో ఒక్కసారిగా దూకి తీవ్రగాయాలపాలయ్యాడు.
తాజా వార్తలు (Latest News)
-
మాళవిక మోహనన్ కర్రసాము.. నభా నటేశ్ కోల్కతా జ్ఞాపకాలు
-
నిర్మాణంలో మేటి.. తాజ్ మహల్కు పోటీ..!
-
అభిజిత్ గంగోపాధ్యాయకు ఈసీ షోకాజ్ నోటీసులు
-
మద్యం కేసులో కేజ్రీవాల్పై ఈడీ ఛార్జ్షీట్.. నిందితుల జాబితాలో ఆప్ పేరు
-
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్