ఇంకుడు గుంతలపై మొక్కుబడి సర్వే
ఎండల తీవ్రత నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం జల సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
జిల్లా కేంద్రంలోని ఓ అపార్ట్మెంట్ వద్ద సర్వే చేస్తున్న నగరపాలక సంస్థ సిబ్బంది
న్యూస్టుడే, నిజామాబాద్ నగరం: ఎండల తీవ్రత నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం జల సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా పురపాలికల్లో ఇంకుడుగుంతలపై సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 300 చదరపు మీటర్లు కలిగిన ప్రతి నిర్మాణానికి ఇంకుడు గుంత ఉండేలా అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. లేనివాటికి రెండు వారాల్లో నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కానీ, నగరపాలక సంస్థ అధికారులు సర్వేపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి నెల గడిచినా ఇప్పటి వరకు సర్వే పూర్తి చేయలేదు.
కమిటీల ఏర్పాటు
పురపాలికల పరిధిలోని కమిషనర్ల అధ్యక్షతన ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, పారిశుద్ధ్య పర్యవేక్షకులు, ఇతర అధికారులను కమిటీ సభ్యులుగా నియమించారు. వీరు వార్డుల వారీగా క్షేత్రస్థాయిలోని భవనాలు, అపార్ట్ట్మెంట్లను పరిశీలించి వాస్తవ పరిస్థితులపై నివేదిక రూపొందించాల్సి ఉంటుంది.
వర్షాకాలంలోపు పూర్తి చేయాల్సి ఉన్నా..
జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ పరిధిలో సర్వే నత్తనడకన సాగుతోంది. ఇటీవల నాలుగు బృందాలతో (ఒక్క బృందంలో నలుగురు సభ్యులు) సర్వే చేయించారు. అపార్ట్మెంట్లు మాత్రమే గుర్తించారు. వీటిలో ఏయే నిర్మాణాలకు ఇంకుడు గుంతలున్నాయో వేటికి లేవో లెక్కతేల్చాల్సి ఉంది. వార్డు అధికారులకు ఎన్నికల విధులు కేటాయించారు. దీంతో సర్వే మధ్యలోనే నిలిచిపోయింది. వర్షాకాలం లోపు సర్వే పూర్తి చేసి ఇంకుడు గుంతలు నిర్మించాల్సి ఉంది.
నిర్వహణపై నిర్లక్ష్యం
2022లో ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ఇంకుడు గుంతలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీల్లో నిర్మాణాలు చేపట్టింది. ఆ తర్వాత నిర్వహణ మరిచారు. నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో 119 ఇంకుడు గుంతలు తవ్వారు. వీటిని పరిశీలిస్తే పిచ్చిమొక్కలు, పూడికతో నిండిపోయాయి.
ఎన్నికల విధులు అప్పగించారు
- కరుణాకర్, టౌన్ప్లానింగ్ అధికారి
అపార్టుమెంట్ల సర్వే పూర్తిచేశాం. 300 చ.మీ మీటర్లు ఉన్న నివాస గృహాలు 651 ఉన్నట్లు గుర్తించాం. వాటిలో వార్డు అధికారులు సర్వే చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో చాలా మంది విధుల్లో ఉన్నారు. ఉన్నవారితో సర్వే చేయిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యా సంవత్సరం వృథా కాకూడదు
[ 17-05-2024]
విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరం వృథా కాకుండా చూడాలని సంబంధిత అధికారులకు జిల్లా పాలనాధికారి జితేష్ వీ పాటిల్ సూచించారు. -
లారీల కొరత లేకుండా చూడాలి: కలెక్టర్
[ 17-05-2024]
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని, తూకం వేసిన బస్తాలను తరలించేందుకు లారీల కొరత లేకుండా చూడాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ అన్నారు. -
తెరపైకి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల
[ 17-05-2024]
జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో మూడు విధాల ప్రతిపాదనలు ఉన్నత స్థాయికి వెళ్లినా ఆచరణలో ముందడుగు పడని విషయం తెలిసిందే. -
కేంద్రాల్లోనే ధాన్యం బస్తాలు
[ 17-05-2024]
జిల్లాలో వరి కోతలు మొదలై నెలరోజులైనా కొనుగోళ్లు పూర్తికావడం లేదు. హమాలీలు, సంచుల కొరత లేనప్పటికీ లారీలు లేక రైతులు కల్లాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో సేకరణకు రైసుమిల్లర్లు ససేమిరా అంటున్నారు. -
ఎత్తుకు పై ఎత్తులు
[ 17-05-2024]
ఎల్లారెడ్డి పురపాలక సంఘం రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్, భారాసకు చెందిన నాయకులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. -
రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం
[ 17-05-2024]
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్గా చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రైతులకు చేస్తున్న మోసాన్ని వదిలేది లేదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హెచ్చరించారు. -
పారిశ్రామిక శిక్షణ.. ఉపాధికి నిచ్చెన
[ 17-05-2024]
తక్కువ చదువుతో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్న కోర్సులు ఐటీఐ. పారిశ్రామిక శిక్షణ పూర్తి చేసిన వారిలో 90 శాతం మంది ఉపాధి పొందుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
పెరిగిన వినియోగం.. తగ్గిన లబ్ధిదారులు
[ 17-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద తెల్ల రేషన్కార్డు కలిగిన లబ్ధిదారులకు నెలకు 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా సరఫరా చేసి శూన్య బిల్లులు అందజేస్తోంది. ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభమైంది. -
వేసవి శిక్షణ.. లక్ష్యసాధన
[ 17-05-2024]
వేసవి సెలవులను వృథా చేయకుండా ఈ చిన్నారులు తమలోని అంతర్గత ప్రతిభకు పదును పెడుతున్నారు. వేసవి శిక్షణ తరగతుల్లో పాల్గొంటూ.. తమకు ఇష్టమైన రంగంలో సృజనాత్మకతతో రాణిస్తున్నారు. -
విభిన్న కోర్సుల ప్రత్యేకం
[ 17-05-2024]
ఆరు దశాబ్దాలుగా కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రత్యేకత చాటుతోంది. ఇక్కడ చదివిన వారు ఉన్నత రంగాల్లో స్థిరపడ్డారు. 158 ఎకరాల విశాలమైన స్థలంలో కళాశాల ఏర్పాటైంది. -
మొబైల్ ‘దోస్త్’తో సులభం
[ 17-05-2024]
రాష్ట్రంలోని ఏ విశ్వవిద్యాలయంలోనైనా డిగ్రీలో ప్రవేశం పొందడానికి ఇదివరకే ఆన్లైన్ విధానం అందుబాటులో ఉంది. ఈ ఏడాది నుంచి కొత్తగా మొబైల్లో దోస్త్ ఆప్లికేషన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. -
సెర్చ్ కమిటీ ఏర్పాటు
[ 17-05-2024]
రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు నూతన ఉపకులపతి(వీసీ)ల నియామకానికి సెర్చ్(అన్వేషణ) కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ముగ్గురు సభ్యులుంటారు. -
అక్రమ రిజిస్ట్రేషన్లపై విజిలెన్స్
[ 17-05-2024]
అనుమతి లేని లేఅవుట్లకు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేయటాన్ని కట్టడి చేయటంపై రిజిస్ట్రేషన్ల శాఖ దృష్టి సారించింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వారీగా రూపొందిన దస్తావేజుల ఆధారంగా విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. -
చరవాణి కోసం.. రైలు నుంచి దూకి
[ 17-05-2024]
ప్రాణం కంటే చరవాణి విలువైనది అనుకున్నాడేమో ఆ యువకుడు రైలులో ప్రయాణిస్తుండగా ఫోన్ కిందపడిపోవడంతో ఒక్కసారిగా దూకి తీవ్రగాయాలపాలయ్యాడు.
తాజా వార్తలు (Latest News)
-
‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
-
నా కుమారున్ని మీకు అప్పగిస్తున్నాను: సోనియాగాంధీ
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
-
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
-
మళ్లీ భాజపా గెలిస్తే.. ఆ నేతలు కటకటాల్లోకే..: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
-
TS బదులుగా TG.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్