logo

చిగురింతలు పుస్తకావిష్కరణ

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రముఖ కవి, చిత్రకారుడు చింతల శ్రీనివాస గుప్తా రాసిన చిగురింతలు పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Updated : 04 May 2024 19:53 IST

నిజామాబాద్‌ సాంస్కృతికం: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రముఖ కవి, చిత్రకారుడు చింతల శ్రీనివాస గుప్తా రాసిన చిగురింతలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ బాల సాహితీవేత్త వీఆర్ శర్మ, జిల్లా కవులు తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న వీఆర్ శర్మ మాట్లాడుతూ.. జిల్లాలో బాల సాహితీవేత్తలు  రచనలతో రాష్ట్రాలలో పేరు సంపాదించారని, ఇది గొప్ప విషయం అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి అమృత లత, కాసాల నరేష్ రావు, శారద, గంట్యాల ప్రసాద్ ప్రవీణ్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని