logo

పట్టపగలే దొంగలు పడ్డారు

నాలుగో ఠాణా పరిధిలో పట్టపగలే చోరీ కలకలం రేపింది. అరగంట వ్యవధిలోనే ఇల్లు గుల్లచేశారు. వివరాల్లోకి వెళ్తే వినాయక్‌నగర్‌ తుల్జా భవానీ మందిరం సమీపంలో మధుసూదన్‌ తన కుటుంబ సభ్యులతో శనివారం మధ్యాహ్నం 12.10 గంటలకు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు.

Published : 05 May 2024 06:03 IST

10 తులాల బంగారం, 2 కిలోల వెండి అపహరణ

 బీరువాను ధ్వంసం చేసిన దుండగులు

నిజామాబాద్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే : నాలుగో ఠాణా పరిధిలో పట్టపగలే చోరీ కలకలం రేపింది. అరగంట వ్యవధిలోనే ఇల్లు గుల్లచేశారు. వివరాల్లోకి వెళ్తే వినాయక్‌నగర్‌ తుల్జా భవానీ మందిరం సమీపంలో మధుసూదన్‌ తన కుటుంబ సభ్యులతో శనివారం మధ్యాహ్నం 12.10 గంటలకు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. 12.50 నిమిషాలకు తిరిగి వచ్చే సరికి తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువా ధ్వంసం చేసి అందులో నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. బాధితులు నాలుగో ఠాణాలో ఫిర్యాదు చేశారు. పది తులాల బంగారం, 2 కిలోల వెండి పోయినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంజీవ్‌ తెలిపారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని