logo

పెండింగ్‌ బిల్లులు ఇప్పిస్తాం

ఇల్లు కట్టుకుని బిల్లులు రాని వారికి పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇప్పిస్తామని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి పేర్కొన్నారు.

Published : 05 May 2024 19:02 IST

నస్రుల్లాబాద్: ఇల్లు కట్టుకుని బిల్లులు రాని వారికి పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇప్పిస్తామని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి పేర్కొన్నారు. అంకోల్‌ క్యాంపు, నాచుపల్లి గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం చేశారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు మంజూరు చేయిస్తామని చెప్పారు. అంకోల్‌ క్యాంపులో పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే కండువా కప్పి ఆహ్వానించారు. నాచుపల్లిలో మృతి చెందిన, రోడ్డు ప్రమాదంలో గాయపడిన పలువురు కుటుంబాలను పరామర్శించి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హమీ ఇచ్చారు. మండలాధ్యక్షుడు నందు పటేల్, సొసైటీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ యాదవ్, కిషోర్‌ యాదవ్, ప్రతాప్‌సింగ్, సాయగౌడ్, తదితరులున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని