logo

మతోన్మాద పార్టీలకు గుణపాఠం చెప్పాలి

దేశంలో మతోన్మాత పార్టీలకు గుణపాఠం చెప్పాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు అజీజ్‌ భాషా అన్నారు. కామారెడ్డిలో మంగళవారం జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.

Published : 07 May 2024 19:33 IST

కామారెడ్డి పట్టణం: దేశంలో మతోన్మాత పార్టీలకు గుణపాఠం చెప్పాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు అజీజ్‌ భాషా అన్నారు. కామారెడ్డిలో మంగళవారం జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. కేంద్రంలో మతం పేరిట భాజపా రాజకీయం చేస్తోందన్నారు. కార్పోరేట్ శక్తులతో చేతులు కలిపి పేదలకు అన్యాయం చేస్తున్నారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ప్రజలు ఓడించాలన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న సురేశ్‌ శెత్కర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యురాలు పద్మ, జిల్లా కార్యదర్శి దశరథ్, సహాయకార్యదర్శి బాలరాజు, ప్రతినిధులు శంకర్, నర్సింలు, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు