‘కాంగ్రెస్కు చేనేత కార్మికుల కష్టాలు పట్టవు’
కాంగ్రెస్ ప్రభుత్వానికి చేనేత కార్మికుల కష్టాలు ఏ మాత్రం పట్టవని నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు.
మాట్లాడుతున్న భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి
నిజామాబాద్ అర్బన్, న్యూస్టుడే: కాంగ్రెస్ ప్రభుత్వానికి చేనేత కార్మికుల కష్టాలు ఏ మాత్రం పట్టవని నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి పద్మశాలి కులస్థుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. భారాస హయాంలో ఏటా బతుకమ్మ చీరల తయారు చేయించడం ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించామన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం వీటిని నిలిపివేయడంతో పాటు బీడీ, చేనేత కార్మికులకు పింఛన్ ఇవ్వడం లేదన్నారు. పేదింటి ఆడపిల్లకు పెళ్లి ఖర్చుల నిమిత్తం కల్యాణ లక్ష్మి ద్వారా తాము సాయం అందిస్తే.. దాన్ని ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పద్మశాలీలను ఆదుకున్నది కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా మాట్లాడుతూ.. అర్బన్ నియోజకవర్గంలో పద్మశాలి సంఘాలకు రూ.8 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేశామన్నారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగం కుప్పకూలే ప్రమాదం ఉందన్నారు. నగర మేయర్ నీతూ కిరణ్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, పద్మశాలి సంఘం నగర అధ్యక్షుడు వెంకటనర్సయ్య, ప్రధాన కార్యదర్శి మురళి, ప్రతినిధులు సత్యపాల్, హన్మాండ్లు, గుండయ్య, యాదగిరి, ధర్మపురి, మహేష్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈఏపీసెట్లో మెరిసిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు
[ 19-05-2024]
రాష్ట్రంలో శనివారం వెల్లడించిన ఈఏపీసెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. కష్టపడి చదివి ర్యాంకులు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. -
మొక్కల పెంపకానికి విత్తనాల సేకరణ
[ 19-05-2024]
అడవుల్లో పచ్చదనం పెంచేందుకు అటవీశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్థానికంగా నర్సరీల్లో మొక్కలు పెంచేందుకు ప్రణాళిక రూపొందించారు. -
ఉత్సాహంగా.. ఉల్లాసంగా..
[ 19-05-2024]
వేసవి సెలవుల్లో క్రీడా శిబిరాల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. జిల్లాలో నిర్వహించే అన్ని శిబిరాల్లో క్రీడాకారులు కిక్కిరిసిపోతున్నారు. -
ప్లాస్టిక్ నిషేధంపై తనిఖీలేవి
[ 19-05-2024]
పర్యావరణానికి పెను ప్రమాదంగా మారిన ప్లాస్టిక్ కవర్లు, వస్తువుల విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారి వాడి పడేసే(సింగిల్ యూజ్డ్) ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించింది. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
[ 19-05-2024]
విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన శనివారం పిట్లం మండలం గౌరారం తండాలో చోటుచేసుకుంది. -
‘రైతులను మోసగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం’
[ 19-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతినని చెప్పుకొంటూ వారిని మోసం చేస్తోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. -
పాఠ్యపుస్తకాలు వస్తున్నాయ్
[ 19-05-2024]
బడులు తెరిచే నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేందుకు రాష్ట్ర విద్యాశాఖ జిల్లా కేంద్రాలకు పంపిణీ ప్రక్రియ ప్రారంభించింది. కొన్ని నెలల కిత్రమే ముద్రణ ప్రారంభించగా ప్రస్తుతం జిల్లా కేంద్రాలకు చేరుస్తున్నారు. -
గ్రూప్-1 నిర్వహణకు 12 పరీక్ష కేంద్రాలు
[ 19-05-2024]
జిల్లాలో గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు 12 కేంద్రాలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. -
ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం.. సాగుకు సన్నద్ధం
[ 19-05-2024]
వానాకాలం సాగు ప్రణాళికలను వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. గడిచిన వానాకాలం చీడపీడలు, తెగుళ్లతో పంట దిగుబడులు రాక కర్షకులకు నష్టాలే మిగిలాయి. -
లక్ష్యం శతశాతం
[ 19-05-2024]
జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, అనుబంధ విద్యాలయాల్లో ఇంటర్ ప్రవేశాలు పెంచేందుకు యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది.
తాజా వార్తలు (Latest News)
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా