logo

భాజపా ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి

జహీరాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని భాజపా మండల అధ్యక్షుడు ఈశ్వర్ అన్నారు.

Published : 08 May 2024 13:30 IST

రామారెడ్డి: జహీరాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని భాజపా మండల అధ్యక్షుడు ఈశ్వర్ అన్నారు. రామారెడ్డిలో బుదవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భాజపా ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తే దేశాభివృద్ది సాధ్యమవుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో  చేసిన అభివృద్ధిని  గురించి ఉపాధి హామీ కూలీలకు వివరించారు.  ఈ కార్యక్రమంలో  మాజీ సర్పంచ్ సంజీవ్, భాజపా నాయకులు మోహన్ రెడ్డి, దేవీదాస్, రమేష్, కృష్ణ యాదవ్, సందీప్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని