logo

అవినీతి రహిత పాలన భాజపాతోనే సాధ్యం

దేశంలో అవినీతి రహిత పాలన భాజపాతోనే సాధ్యమని భాజపా రాష్ట్ర నాయకుడు పైడి ఎల్లారెడ్డి అన్నారు.

Published : 08 May 2024 15:46 IST

రామారెడ్డి: దేశంలో అవినీతి రహిత పాలన భాజపాతోనే సాధ్యమని భాజపా రాష్ట్ర నాయకుడు పైడి ఎల్లారెడ్డి అన్నారు. బుధవారం తాడ్వాయి మండలం సోమారం, దేవాయపల్లి గ్రామాలలో ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో అవినీతి రాజ్యమేలుతుందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే దేశం మొదటి స్థానంలో నిలవాలంటే భాజపా ఎంపీ అభ్యర్థులకు గెలిపించాలన్నారు. కార్యక్రమంలో భాజపా నాయకులు, మాజీ ఉపసర్పంచి వెంకటేష్, సతీష్, యాసిన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని