ఉపాధి కల్పించండి సారూ..
ఉపాధి హామీ పనులు కల్పించడం లేదంటూ జిల్లాలో ఇటీవల కూలీలు నిరసన తెలుపుతున్నారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఉపాధిహామీ కూలీలు దోమకొండ మండలం లింగుపల్లి గ్రామానికి చెందిన వారు. వారం రోజుల కిందట 200 మందికి పైగా కూలీలు పని ప్రదేశానికి వెళ్లారు. అక్కడ 150 మందికి మాత్రమే పని ఉందని మిగతావారు ఇంటికి వెళ్లాలని క్షేత్ర సహాయకుడు చెప్పారు. దీంతో కూలీలు అతణ్ని నిలదీశారు.
నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామ పంచాయతీ ఎదుట ఉపాధి కూలీలు తమకు మూడు నాలుగు రోజుల నుంచి పనులు కల్పించడం లేదని ధర్నా నిర్వహించారు. క్షేత్ర సహాయకుడి బంధువు చనిపోవడంతో అక్కడ పనులు చేయించలేదు. పంచాయతీ కార్యదర్శి లేదా సీనియర్ మేట్ సహకారంతో పనులు చేయించాల్సినా అధికారులు పట్టించుకోలేదు.
కామారెడ్డి సంక్షేమం, న్యూస్టుడే: ఉపాధి హామీ పనులు కల్పించడం లేదంటూ జిల్లాలో ఇటీవల కూలీలు నిరసన తెలుపుతున్నారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం జాబ్కార్డు కలిగిన కూలీ పని అడిగితే తప్పకుండా చూపించాలి. కానీ జిల్లాలో కూలీల డిమాండ్ మేరకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కూలీలు ఎక్కువగా హాజరయ్యేది మే నెలలోనే. ప్రతి పంచాయతీ పరిధిలో 200 మందికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం ఇది వరకే ఉత్తర్వులు జారీ చేసినా ఆ దిశగా చర్యలు లేవు. ఈ లెక్కన జిల్లాలో రోజుకూ 1.05 లక్షల మందికి పని కల్పించాల్సి ఉండగా ప్రస్తుతం 75 వేల మంది మాత్రమే వెళ్తున్నారు. పంచాయతీకి సరాసరిగా 140 మంది మాత్రమే హాజరవుతున్నారు.
ప్రణాళిక లేమి... : జిల్లాలో వ్యవసాయ సీజన్ ముగియడంతో చాలా మంది కూలీలు, రైతులు ఉపాధి పనులకు మొగ్గు చూపుతున్నారు. క్షేత్ర సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే పని అడిగిన కూలీలందరికీ ఉపాధి చూపించవచ్చు. జిల్లాలో 526 పంచాయతీలు ఉండగా కేవలం 298 మంది క్షేత్రసహాయకులు మాత్రమే ఉన్నారు. దీంతో మిగతా చోట్ల విధులు నిర్వహిస్తున్న వారిపై పని భారం పడుతోంది. ఎఫ్ఏలు విధుల్లో చేరాక పంచాయతీ కార్యదర్శులు ఉపాధి పనులపై దృష్టి సారించడం లేదు.
అధికారులకు ఆదేశాలిచ్చాం
చందర్నాయక్, డీఆర్డీవో, కామారెడ్డి
జిల్లాలో జాబ్కార్డులు కలిగిన వారందరికీ కచ్చితంగా పని కల్పిస్తాం. కొన్ని మండలాల్లో ఇటీవల కూలీలకు పనులు కల్పించడం లేదనే విషయం నా దృష్టికి వచ్చింది. ఈ విషయంపై ఆరా తీస్తాను. క్షేత్ర సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో కలిసి పని చేయాలి. అడిగిన వారందరికీ పని కల్పించాలని మండలాల అధికారులకు ఆదేశాలు ఇచ్చాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లిదండ్రులూ.. తస్మాత్ జాగ్రత్త
[ 20-05-2024]
ముద్దులొలికే పాపే ఆ తల్లిదండ్రులకు పంచప్రాణాలు..కొడుకున్నా.. కూతురిపైనే మక్కువ ఎక్కువ..చిట్టితల్లికి చిన్న గాయమైనా తట్టుకోలేని హృదయాలు వారివి. అప్పటి వరకు సరదాగా గడిపిన చిన్నారిని మృత్యువు మింగేసింది. -
సజ్జ రైతు సంబరం
[ 20-05-2024]
ఎర్రజొన్నల మాదిరిగానే ఒప్పందంపై సేద్యం చేస్తున్న సజ్జ పంట ఈసారి అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని అధిక దిగుబడి రావడం, ధర అమాంతం రూ.2 వేలు పెరగడంతో సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రూ.వేయి కోట్ల కొనుగోళ్లు
[ 20-05-2024]
దేశంలో పసుపు కొనుగోళ్లలో ప్రత్యేక స్థానం ఉన్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈసారి సుమారు రూ. వేయి కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినప్పటికీ కొనుగోళ్లలో వృద్ధి కనిపించింది. -
‘గెలుపు మనదే’
[ 20-05-2024]
జహీరాబాద్ పార్లమెంటు స్థానంలో గెలుపు మనదేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. సదాశివనగర్ మండల కాంగ్రెస్ నాయకులతో ఆదివారం ఆయన పోలింగ్ సరళి, గ్రామాల వారీగా కాంగ్రెస్కు పడిన ఓట్ల వివరాలపై ఆరా తీశారు. -
టీఎస్ కాస్తా టీజీగా..
[ 20-05-2024]
తెలంగాణ సంక్షిప్త రూపం ఇది వరకు టీఎస్గా ఉండేది. అది కాస్తా టీజీగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి నివేదికలు, ప్రభుత్వ ఉత్తర్వులు, లెటర్ హెడ్లపై టీఎస్కి బదులు టీజీగా పేర్కొనాలని వెల్లడించింది. -
పర్యాటకంగా మారిస్తే.. ప్రయోజనాలెన్నో!
[ 20-05-2024]
నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్ గ్రామ శివారులోని స్వయంగా వెలసిన అనంత పద్మనాభ స్వామి ఆలయానికి గుర్తింపు లభించడం లేదు. చెరువు గట్టున పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం ఇది. -
ఆదర్శ కళాశాలల్లో ప్రవేశాలకు వేళాయె
[ 20-05-2024]
తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. పదో తరగతి ఉత్తీర్ణులైనవారిలో అత్యధికులు ఇంటర్మీడియెట్ వైపు దృష్టి సారిస్తారు. అలాంటి వారికి ఆదర్శ జూనియర్ కళాశాలలు వరమనే చెప్పాలి. -
చూసి కొనాలి.. రసీదు పొందాలి
[ 20-05-2024]
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ముందస్తుగానే వానలు వచ్చే అవకాశం ఉండటంతో రైతులు నాణ్యమైన విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
పల్లె పోరుకు సన్నాహాలు
[ 20-05-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడుతోంది. సర్పంచుల పదవీకాలం జనవరి 31వ తేదీతో ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఒట్టేశారు.. ఓటేశారు!
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు
-
సార్వత్రిక సమరం.. ఐదో విడత పోలింగ్ ప్రారంభం.. ఆ 2 స్థానాలపై అందరి దృష్టి
-
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?.. మెట్రోకు భారమవుతున్న వడ్డీలు
-
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..