నిఘా నీడన ఎన్నికలు
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కావాల్సిన చర్యలు తీసుకుంటోంది.
1,808 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల బిగింపు
నిరంతర పర్యవేక్షణకు కంట్రోల్ రూం
న్యూస్టుడే, నిజామాబాద్ కలెక్టరేట్
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కావాల్సిన చర్యలు తీసుకుంటోంది. ఎక్కడా అల్లర్లు జరగకుండా గట్టి నిఘా పెట్టింది. ఇందులో భాగంగా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 1,808 పోలింగ్ కేంద్రాల్లో 2,507 సీసీ కెమెరాలు బిగించి గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు.
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 17,04,867 మంది ఓటర్లు ఉన్నారు. వీరికి కోసం 1,808 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం నిరంతర పర్యవేక్షణ కోసం కేంద్రాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. 171 సమస్మాత్మక ప్రదేశాల్లో 506 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఆయా చోట్ల లోపల, బయట రెండు చొప్పున కెమెరాలు బిగించనున్నారు.
అధికారుల పర్యవేక్షణ
పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను ఎప్పుటికప్పుడు చూసేందుకు వీలుగా నిజామాబాద్ కలెక్టరేట్తో పాటు సహాయ ఎన్నికల అధికారి కార్యాలయాలైన నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ గ్రామీణం, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాలలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేస్తారు. జిల్లాకు వచ్చిన సాధారణ, పోలీసు పరిశీలకులతో పాటు రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారులు పోలింగ్ తీరును వీక్షిస్తారు. ఘర్షణలు చోటు చేసుకుంటే పోలీసు బలగాలను పంపిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లిదండ్రులూ.. తస్మాత్ జాగ్రత్త
[ 20-05-2024]
ముద్దులొలికే పాపే ఆ తల్లిదండ్రులకు పంచప్రాణాలు..కొడుకున్నా.. కూతురిపైనే మక్కువ ఎక్కువ..చిట్టితల్లికి చిన్న గాయమైనా తట్టుకోలేని హృదయాలు వారివి. అప్పటి వరకు సరదాగా గడిపిన చిన్నారిని మృత్యువు మింగేసింది. -
సజ్జ రైతు సంబరం
[ 20-05-2024]
ఎర్రజొన్నల మాదిరిగానే ఒప్పందంపై సేద్యం చేస్తున్న సజ్జ పంట ఈసారి అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని అధిక దిగుబడి రావడం, ధర అమాంతం రూ.2 వేలు పెరగడంతో సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రూ.వేయి కోట్ల కొనుగోళ్లు
[ 20-05-2024]
దేశంలో పసుపు కొనుగోళ్లలో ప్రత్యేక స్థానం ఉన్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈసారి సుమారు రూ. వేయి కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినప్పటికీ కొనుగోళ్లలో వృద్ధి కనిపించింది. -
‘గెలుపు మనదే’
[ 20-05-2024]
జహీరాబాద్ పార్లమెంటు స్థానంలో గెలుపు మనదేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. సదాశివనగర్ మండల కాంగ్రెస్ నాయకులతో ఆదివారం ఆయన పోలింగ్ సరళి, గ్రామాల వారీగా కాంగ్రెస్కు పడిన ఓట్ల వివరాలపై ఆరా తీశారు. -
టీఎస్ కాస్తా టీజీగా..
[ 20-05-2024]
తెలంగాణ సంక్షిప్త రూపం ఇది వరకు టీఎస్గా ఉండేది. అది కాస్తా టీజీగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి నివేదికలు, ప్రభుత్వ ఉత్తర్వులు, లెటర్ హెడ్లపై టీఎస్కి బదులు టీజీగా పేర్కొనాలని వెల్లడించింది. -
పర్యాటకంగా మారిస్తే.. ప్రయోజనాలెన్నో!
[ 20-05-2024]
నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్ గ్రామ శివారులోని స్వయంగా వెలసిన అనంత పద్మనాభ స్వామి ఆలయానికి గుర్తింపు లభించడం లేదు. చెరువు గట్టున పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం ఇది. -
ఆదర్శ కళాశాలల్లో ప్రవేశాలకు వేళాయె
[ 20-05-2024]
తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. పదో తరగతి ఉత్తీర్ణులైనవారిలో అత్యధికులు ఇంటర్మీడియెట్ వైపు దృష్టి సారిస్తారు. అలాంటి వారికి ఆదర్శ జూనియర్ కళాశాలలు వరమనే చెప్పాలి. -
చూసి కొనాలి.. రసీదు పొందాలి
[ 20-05-2024]
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ముందస్తుగానే వానలు వచ్చే అవకాశం ఉండటంతో రైతులు నాణ్యమైన విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
పల్లె పోరుకు సన్నాహాలు
[ 20-05-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడుతోంది. సర్పంచుల పదవీకాలం జనవరి 31వ తేదీతో ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఒట్టేశారు.. ఓటేశారు!
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు
-
సార్వత్రిక సమరం.. ఐదో విడత పోలింగ్ ప్రారంభం.. ఆ 2 స్థానాలపై అందరి దృష్టి
-
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?.. మెట్రోకు భారమవుతున్న వడ్డీలు
-
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..