ఆ ఓటర్లే కీలకం
జహీరాబాద్ లోక్సభ స్థానంలో గెలుపోటములపై మహిళ, యువ ఓటర్లు కీలక భూమిక పోషించనున్నారు.
యువత, మహిళలదే నిర్ణయాత్మక పాత్ర
ఈనాడు, కామారెడ్డి: జహీరాబాద్ లోక్సభ స్థానంలో గెలుపోటములపై మహిళ, యువ ఓటర్లు కీలక భూమిక పోషించనున్నారు. ఈ వర్గాల ఓటర్లు అధికంగా ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు స్వశక్తి, యువజన సంఘాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ యువత, మహిళలు అభ్యర్థుల విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో ఆ వర్గాలకు చెందిన ఓట్లను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు.
మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు
2018 అసెంబ్లీ, 2019 లోక్సభ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంలో మహిళలే ముందున్నారు. దీనికి తోడు జహీరాబాద్ లోక్సభ పరిధిలో మహిళా ఓటర్లు 51.14 శాతం ఉన్నారు. ఈ నేపథ్యంలో భారాస, కాంగ్రెస్, భాజపా అభ్యర్థులు అతివల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల్లో వేలాది మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. మహిళా సంఘాలను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో బీడీకార్మికులున్నారు. వీరి మద్దతుకు కృషి చేస్తున్నారు. టేకేదార్ల ద్వారా గంప గుత్తగా ఓట్లకోసం మంతనాలు సాగిస్తున్నారు.
యువ మంత్రం
లోక్సభ పరిధిలో యువ ఓటర్లు 53.49 శాతం ఉన్నారు. ఈ సారి నూతనంగా ఓటు హక్కు సాధించిన 18 నుంచి 19 ఏళ్లలోపు యువ ఓటర్లకు గాలం వేసేలా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. వీరు మొదటిసారి ఓటు వేయనున్న నేపథ్యంలో ఆకట్టుకునేలా ప్రచారం చేయడమే కాకుండా యువతకు చేస్తున్న మేలును నేతలు ప్రస్తావిస్తున్నారు. యువ ఓటర్లను కలుసుకునేందుకు భాజపా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో యువశక్తి పేరిట సమ్మేళనాలు నిర్వహించింది. యువజన కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం మండల, గ్రామస్థాయిలో యువతతో సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వందరోజుల్లోనే 33 వేల ఉద్యోగాలకు నియామకపత్రాలు అందించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఎన్నికల్లో మద్దతు తెలపాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రసాధనలో కీలకంగా వ్యవహరించిన తమకే మద్దతు తెలపాలని కోరుతూ యువజన సంఘాల నేతలతో భారాస నాయకులు మంతనాలు సాగిస్తున్నారు.
ఆశలు.. హామీలు
మహిళలు, యువత ఓట్లను కొల్లగొట్టేందుకు మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు భవిష్యత్తుపై ఆశలు చూపెడుతూ హామీలు గుప్పిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని చెబుతున్నారు. అన్ని శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో విరివిగా విద్యాసంస్థలను ఏర్పాటు చేసి ఉన్నతవిద్య అభ్యసించేందుకు తోడ్పాటునందిస్తామని పేర్కొంటున్నారు.
నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు
మహిళలు : 8,39,133
యువ ఓటర్లు : 8,77,803
మొత్తం : 16,40,755
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దినాలకొచ్చి.. మృత్యు ఒడిలోకి
[ 20-05-2024]
దినాలకొచ్చి చెట్టుకు ఉరి పెట్టుకొని మృతి చెందిన ఘటన మండలంలోని కాటేపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. -
జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు
[ 20-05-2024]
బీర్కూర్లో సోమవారం సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. -
దరఖాస్తుల ఆహ్వానం
[ 20-05-2024]
బెస్ట్ అవైలబుల్ పథకంలో భాగంగా 2024-25 విద్యాసంవత్సరంలో 3, 5, 8వ తరగతి ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఓపెన్ జిమ్ పార్కును పరిశీలించిన బల్దియా ఛైర్ పర్సన్
[ 20-05-2024]
పట్టణంలోని గోదాం రోడ్ మున్సిపల్ ఓపెన్ జిమ్ పార్క్ ను బల్దియా ఛైర్ పర్సన్ గడ్డ ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. -
తల్లిదండ్రులూ.. తస్మాత్ జాగ్రత్త
[ 20-05-2024]
ముద్దులొలికే పాపే ఆ తల్లిదండ్రులకు పంచప్రాణాలు..కొడుకున్నా.. కూతురిపైనే మక్కువ ఎక్కువ..చిట్టితల్లికి చిన్న గాయమైనా తట్టుకోలేని హృదయాలు వారివి. అప్పటి వరకు సరదాగా గడిపిన చిన్నారిని మృత్యువు మింగేసింది. -
సజ్జ రైతు సంబరం
[ 20-05-2024]
ఎర్రజొన్నల మాదిరిగానే ఒప్పందంపై సేద్యం చేస్తున్న సజ్జ పంట ఈసారి అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని అధిక దిగుబడి రావడం, ధర అమాంతం రూ.2 వేలు పెరగడంతో సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రూ.వేయి కోట్ల కొనుగోళ్లు
[ 20-05-2024]
దేశంలో పసుపు కొనుగోళ్లలో ప్రత్యేక స్థానం ఉన్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈసారి సుమారు రూ. వేయి కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినప్పటికీ కొనుగోళ్లలో వృద్ధి కనిపించింది. -
‘గెలుపు మనదే’
[ 20-05-2024]
జహీరాబాద్ పార్లమెంటు స్థానంలో గెలుపు మనదేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. సదాశివనగర్ మండల కాంగ్రెస్ నాయకులతో ఆదివారం ఆయన పోలింగ్ సరళి, గ్రామాల వారీగా కాంగ్రెస్కు పడిన ఓట్ల వివరాలపై ఆరా తీశారు. -
టీఎస్ కాస్తా టీజీగా..
[ 20-05-2024]
తెలంగాణ సంక్షిప్త రూపం ఇది వరకు టీఎస్గా ఉండేది. అది కాస్తా టీజీగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి నివేదికలు, ప్రభుత్వ ఉత్తర్వులు, లెటర్ హెడ్లపై టీఎస్కి బదులు టీజీగా పేర్కొనాలని వెల్లడించింది. -
పర్యాటకంగా మారిస్తే.. ప్రయోజనాలెన్నో!
[ 20-05-2024]
నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్ గ్రామ శివారులోని స్వయంగా వెలసిన అనంత పద్మనాభ స్వామి ఆలయానికి గుర్తింపు లభించడం లేదు. చెరువు గట్టున పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం ఇది. -
ఆదర్శ కళాశాలల్లో ప్రవేశాలకు వేళాయె
[ 20-05-2024]
తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. పదో తరగతి ఉత్తీర్ణులైనవారిలో అత్యధికులు ఇంటర్మీడియెట్ వైపు దృష్టి సారిస్తారు. అలాంటి వారికి ఆదర్శ జూనియర్ కళాశాలలు వరమనే చెప్పాలి. -
చూసి కొనాలి.. రసీదు పొందాలి
[ 20-05-2024]
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ముందస్తుగానే వానలు వచ్చే అవకాశం ఉండటంతో రైతులు నాణ్యమైన విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
పల్లె పోరుకు సన్నాహాలు
[ 20-05-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడుతోంది. సర్పంచుల పదవీకాలం జనవరి 31వ తేదీతో ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!