ప్రియురాలిని 31 ముక్కలుగా నరికి.. భార్యతో కలిసి అడవిలో పాతిపెట్టి..
సాఫీగా సాగుతున్న యువతి జీవితంలోకి ఓ వివాహితుడు ప్రవేశించి, మాయ మాటలతో ప్రలోభపెట్టి ఆమెకు దగ్గరయ్యాడు.
తిలాబతి (పాత చిత్రం)
నవరంగపూర్, న్యూస్టుడే: సాఫీగా సాగుతున్న యువతి జీవితంలోకి ఓ వివాహితుడు ప్రవేశించి, మాయ మాటలతో ప్రలోభపెట్టి ఆమెకు దగ్గరయ్యాడు. శనివారం ఆమె తనని పెళ్లి చేసుకోవాలని అడగడానికి ప్రియుడు ఇంటికి వెళ్లగా, తన భార్యతో కలిసి దారుణంగా హత్య చేసి 31 భాగాలుగా నరికి అడవిలో పాతిపెట్టిన ఘటన నవరంగపూర్ జిల్లాలో చర్చనీయాంశమైంది. రాయ్ఘర్ ఎస్డీపీవో ఆదిత్యసేన్ తెలిపిన వివరాల ప్రకారం.. బాఘబెడ గ్రామానికి చెందిన లుథురామ్ కుమార్తె తిలాబతి గండ్(23) గురువారం సాయంత్రం తన స్నేహితురాలి ఇంటికి వెళ్లొస్తానని చెప్పి ఎంతసేపటికీ రాలేదు. చుట్టు పక్కల గాలించి మరుసటి రోజు రాయఘర్ ఠాణాలో ఆమె తండ్రి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అసలేం జరిగింది... తిలాబతి బారసుండి గ్రామానికి చెందిన చంద్ర రౌత్ను ప్రేమించింది. అతడి ఇంటికి వెళ్లి వివాహం చేసుకోవాలని లేదంటే ఇక్కడే ఉంటానని మొరాయించింది. చంద్ర భార్య సియాబతి దానికి అంగీకరించకపోవడంతో ముగ్గురు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తిలాబతి కోర్టుకు వెళ్తానని చెప్పగా, భార్యాభర్తలిద్దరూ పథకం పన్ని శనివారం ఆమెను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మురుమడిహి అడవిలోకి తీసుకెళ్లి 31 భాగాలుగా నరికి పాతిపెట్టి పరారయ్యారు. ఈ ఘటన ప్రత్యక్షంగా చూసిన గ్రామానికి చెందిన జుగుసాయి భయభ్రాంతులకు గురై, విషయాన్ని గ్రామస్థులకు తెలియజేశాడు. వారు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహ భాగాల్ని వెలికి తీసి శవపరీక్ష అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు ఘటనా స్థలంలో కత్తిని స్వాధీనం చేసుకుని, పరారీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
వెలికి తీసిన శరీర భాగాల వద్ద పోలీసులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రముఖుల బరి... ఎవరిదో విజయం మరి?
[ 02-05-2024]
పొరుగు రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 15 ఏళ్ల తర్వాత ప్రస్తుత ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. -
రాయగడలో ఎన్నికల వే‘ఢీ’
[ 02-05-2024]
రాష్ట్రంలో తొలిదశ కింద ఎన్నికలు జరగనున్న కొరాపుట్ లోక్సభ స్థానంతో పాటు రాయగడ జిల్లాలో మూడు శాసనసభ నియోజకవర్గాల్లో ఇప్పటికే నువ్వా నేనా అన్న పోటీ నెలకొంది. -
ఇంటింటా అభ్యర్థుల ప్రచారం
[ 02-05-2024]
బ్రహ్మపుర లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. -
పాండ్యన్ వ్యాఖ్యలపై ధర్మేంద్ర ఖండన
[ 02-05-2024]
భాజపా అధికారంలోకి వస్తే మిషన్శక్తి, బీఎస్కేవై కార్యక్రమాలు నిలిపివేయడం తథ్యమంటూ బిజద నేతలు చేస్తున్నది దుష్ప్రచారమని భాజపా నాయకులు స్పష్టం చేశారు. -
బిజద అంటే విరక్తి ఏర్పడింది: షానవాజ్
[ 02-05-2024]
సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించామని గొప్పలు చెప్పుకుంటున్న అధికారి పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని, బిజద అంటే ప్రజల్లో విరక్తి ఏర్పడిందని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి షానవాజ్ చౌదరి విమర్శించారు. -
ఈ ముద్ద మీకు.. మీ ఓట్లు మాకు
[ 02-05-2024]
అభ్యర్థులు ప్రచారానికి అందొచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఉత్సవం, పండగ, పెళ్లి.. ఇలా ఏదయినా హాజరై ఓట్లు అడిగేస్తున్నారు. -
మౌనం మాట్లాడింది
[ 02-05-2024]
వీరంతా అమాయక ఆదివాసీలు. కష్టం వచ్చినా.. బాధ కలిగినా తమలో తాము కుమిలిపోతారే తప్పా నోరు తెరిచి అడగరు. -
మౌలిక సౌకర్యాలు కల్పిస్తేనే ఓటేేస్తాం
[ 02-05-2024]
అపార ఖనిజ సంపదకు నిలయమైన కాశీపూర్ సమితిలో మారుమూల గ్రామాల ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు లేవు. -
ఇంటిపై పడిన చెట్టు: చిన్నారికి గాయాలు
[ 02-05-2024]
నందపూర్ సమితిలో చెట్టు విరిగి ఇంటిపై పడడంతో చిన్నారికి గాయాలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
-
అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..
-
‘400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం’ - రాహుల్ సంచలన ఆరోపణ