logo

గొంతు కోసి యువకుడి దారుణ హత్య

 గజపతి జిల్లాలోని గుసాని సమితి గురండి ఠాణా పరిధిలో  ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

Published : 29 Mar 2024 09:45 IST

పర్లాఖెముండి :  గజపతి జిల్లాలోని గుసాని సమితి గురండి ఠాణా పరిధిలో  ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుసాని సమితి గురండి ఠాణా పరిధిలో తోట గుమ్మడ  గ్రామ ప్రాంతంలోని ప్రయాణికుల విశ్రాంతి భవనం వెనుక భాగంలో యువకుడిని దుండగులు గొంతు కోసి హతమార్చారు. ఈ రోజు ఉదయం మృతదేహాన్ని గమనించిన  స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.  మృతుడు బట్టి సిరిపురం  గ్రామానికి చెందిన ఎం. లింగరాజు (28) గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని