logo

మూడేళ్ల శిశువుపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్‌

గజపతి జిల్లా మోహన ఠాణా పరిధిలో మూడేళ్ల శిశువుపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకోంది.

Published : 29 Mar 2024 17:19 IST

పర్లాఖెముండి: గజపతి జిల్లా మోహన ఠాణా పరిధిలో మూడేళ్ల శిశువుపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకోంది. ఠాణా అధికారి బసంత్ శెఠి తెలిపిన వివరాల మేరకు.. మోహన ఠానా పరిధిలోని ఓ ఇంటి వరండాలో ఆడుకుంటున్న తన కుమార్తె కనిపించకపోవడంతో తల్లి చుట్టుపక్కల వెతికింది. ఈక్రమంలో సమీపాన శిశువు ఏడుపు వినినించింది. అక్కడికి వెళ్లి చూడగా నిందితుడు బలరాం నాయక్‌ శిశువుతో ఉన్నాడు. వెంటనే గ్రామస్థులు నిందితుడిని పట్టుకొని ఠాణాలో అప్పగించారు. శిశువు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని