logo

జయపురం బరిలో 11 మంది అభ్యర్థులు

జయపురం నియోజకవర్గంలో సోమవారం నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. స్వతంత్ర అభ్యర్థి నీలమాధవ బిశోయి నామినేషన్‌ ఉపసంహరించుకోగా 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలో నిలిచారు.

Published : 01 May 2024 02:50 IST

జయపురం, న్యూస్‌టుడే: జయపురం నియోజకవర్గంలో సోమవారం నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. స్వతంత్ర అభ్యర్థి నీలమాధవ బిశోయి నామినేషన్‌ ఉపసంహరించుకోగా 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కాంగ్రెస్‌ తరఫున తారాప్రసాద్‌ బాహినిపతి, గౌతమ్‌ సామంత్రాయ్‌(భాజపా), డా.ఇందిరానందో(బిజద), ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు తలపడనున్నారు. మంళవారం స్వతంత్రులకు తమ పార్టీ గుర్తులను యంత్రాంగం ప్రకటించింది. మహేంద్రపాత్ర్‌ (డైమండ్‌), సిమాంచల్‌ బిశోయి (కెట్లీ), నమిత ఖరా (గ్యాస్‌ సిలిండర్‌), ప్రీతమ్‌ పట్నాయక్‌ (ఆటోరిక్షా), బంత్‌పాత్ర్‌ (బిస్కెట్‌), బీఎస్‌పీ తరఫున సరోజ్‌ నాయక్‌, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి హరిరావు, ఆమ్‌ ఆద్మీ నుంచి గౌరీ చరణ్‌ దేవ్‌శర్మ బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారి, సబ్‌కలెక్టర్‌ ప్రభాత్‌కుమార్‌ పరిడా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని