logo

నామినేషన్‌ దాఖలు చేసిన నవీన్‌

ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ గంజాం జిల్లా హింజిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు.

Published : 01 May 2024 03:13 IST

నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేస్తున్న నవీన్‌
బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ గంజాం జిల్లా హింజిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఛత్రపురం సబ్‌కలెక్టరు కార్యాలయంలో మధ్యాహ్నం ఆయన నామినేషన్‌ పత్రాలను అదనపు సబ్‌కలెక్టరు, రిటర్నింగ్‌ అధికారి పార్థసారథి హంసదాకు అందజేశారు. ఆయన వెంట బిజద నాయకులు వి.కార్తికేయ పాండ్యన్‌, బిక్రంకేశరి అరుఖ్‌ తదితరులున్నారు. అంతకుముందు ఆయన హెలీకాప్టరులో గంజాం జిల్లా నరసింహపూర్‌ చేరుకున్నారు. అక్కడి నుంచి కారులో గంజాం జిల్లా తరాతరిణి శక్తిపీఠం చేరుకుని పూజలు చేశారు. తర్వాత హెలీకాప్టరులో ఛత్రపురం చేరుకొని అక్కడి నుంచి కారులో సబ్‌కలెక్టరు కార్యాలయానికి వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని