పగటి కలలు కంటున్న భాజపా: సీఎం
విపక్షంలో ఉన్న భాజపా అధికారంలోకి రావాలని కలలు కంటోందని, ఇది నెరవేరదని, రాష్ట్ర ప్రజలు బిజదను మళ్లీ ఆదరిస్తారని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు.
జూన్ 9న నవీన్ ప్రమాణ స్వీకారమన్న పాండ్యన్
ప్రసంగిస్తున్న నవీన్. పక్కన పాండ్యన్
భువనేశ్వర్, న్యూస్టుడే: విపక్షంలో ఉన్న భాజపా అధికారంలోకి రావాలని కలలు కంటోందని, ఇది నెరవేరదని, రాష్ట్ర ప్రజలు బిజదను మళ్లీ ఆదరిస్తారని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. సోమవారం కలహండి జిల్లాలోని భవానీపాట్నా, నువాపడ జిల్లాలోని ఖరియార్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, పేదలకు ప్రోత్సాహకాలు, మహిళల వికాసానికి ‘మిషన్శక్తి’ ప్రవేశ పెట్టింది తమ ప్రభుత్వమన్నారు. ఎన్నికల సమయంలో మొసలి కన్నీరు కార్చే విపక్షాలను ప్రజలు విశ్వసించొద్దన్నారు. దేశానికి తలమానికంగా నిలుస్తున్న బీఎస్కేవై కార్యక్రమంపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు. గర్భిణులకు మమతా, అన్నదాతలకు కాలియా, బలరాం, అంత్యక్రియలకు హరిశ్చంద్ర అమలు చేస్తున్నామని, విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తున్నామన్నారు. శ్రీజగన్నాథ్ కారిడార్, రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు, మఠాల పునరుద్ధరణ పనులు చేయించామన్నారు. లక్ష్మీ బస్సులు గ్రామీణ ప్రజల రాకపోకలకు ప్రవేశపెట్టామని సీఎం చెప్పారు.
ఆరోసారి సీఎం అవుతారు: వి.కార్తికేయ పాండ్యన్ మాట్లాడుతూ... నవీన్ ఆరోసారి ముఖ్యమంత్రి అవుతారని, జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. జనం కోసం పనులు చేస్తున్నది బిజద అని, నాలుగున్నర కోట్ల మందికి ఆశాకిరణంగా నవీన్ ఉన్నారన్నారు. ఎన్నికల సమయంలో దిల్లీ నుంచి (కేంద్రం) పెద్దలు రాష్ట్రానికి దిగుతారని, తర్వాత వారు కనిపించరన్నారు. రాష్ట్ర ప్రజల సుఖదుఃఖాల్లో, విపత్తుల్లో ఆదుకుంటున్నది నవీన్ మాత్రమేనని, ఆయనను ఓటర్లు మరవకూడదన్నారు. ఈ నెల 13న కలహండి, నువాపడ ప్రాంతాల్లో పోలింగ్ జరగనుండగా, దీన్ని పండగలా భావించి అందరూ పోలింగ్ కేంద్రాలకు రావాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నేతలు సస్పెండ్
[ 19-05-2024]
జయపురంకు చెందిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు సీనియర్ నేతలను పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది. జిల్లా కాంగ్రెస్ మంజీ అధ్యక్షుడు దుర్గా శంకర్ సాహు, మాజీ మంత్రి దివంగత రఘునాథ్ పట్నాయక్ కుమారుడు బీరెన్ మోహన్ పట్నాయక్ను పార్టీ సస్పెండ్ చేసింది. -
ట్యాంకర్ను ఢీకొన్న కారు.. ఒకరు మృతి
[ 19-05-2024]
కరాపుట్ జిల్లా బొరిగుమ్మ ఠాణా పరిధిలో జాతీయ రహదారి 26 పైన జయంతి గిరి శివాలయం వద్ద శనివారం రాత్రి ఆగి ఉన్న ట్యాంకర్ను కారు ఢీ కొట్టింది. -
గ్యారేజ్లో అగ్ని ప్రమాదం.. వాహనాలు దగ్ధం
[ 19-05-2024]
జయకరం పట్టణం సాత్బౌణి ఆలయ సమీపంలో ఉన్న మోహన్ ఖరా గ్యారేజ్లో ఆదివారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం జరిగింది. -
నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 19-05-2024]
రాయగడ జిల్లా కాసిపూర్ సమితి పరిధిలో విద్యార్థుల మృతి ఘటనలకు సంబంధించి నలుగురు ఉపాధ్యాయులను విధుల నుంచి సస్పెండ్ చేశారు. -
పాతకక్షలతో దాడి.. చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 19-05-2024]
పాతకక్షల నేపథ్యంలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
కమలమా.. శంఖమా ?
[ 19-05-2024]
పశ్చిమ ఒడిశాలోని బరగఢ్ లోక్సభ స్థానంలో ఎన్నికల వేడి పెరిగింది. భాజపా, బిజద అభ్యర్థుల మధ్య ముఖాముఖి పోరు నువ్వా? నేనా? అన్న రీతిలో సాగుతోంది. -
రెండోవిడత ప్రచారానికి తెర
[ 19-05-2024]
అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్గఢ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లో 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో సోమవారం (20న) రెండోవిడత పోలింగ్ జరగనుంది -
చివరి రోజు ముమ్మరంగా ప్రచారం
[ 19-05-2024]
గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం, దాని పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారానికి శనివారం చివరి రోజు కావడంతో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు -
ఈసారి కాంగ్రెస్కు అనుకూల ఫలితాలు: సచిన్ పైలెట్
[ 19-05-2024]
ఈసారి దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తుందన్న ఆశాభావంతో ఉన్నామని ఆ పార్టీ నేత సచిన్ పైలెట్ చెప్పారు. -
ప్రజాహితం కోరే సీఎం అవసరం: భజన్లాల్
[ 19-05-2024]
ఒడిశా ప్రజల హితం కోరే సీఎం రాష్ట్రానికి అవసరమని, నవీన్ ఔట్సోర్సింగ్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్శర్మ చెప్పారు. -
డబుల్ ఇంజిన్ పాలనతో రాష్ట్ర ప్రగతి: అశ్వినీ
[ 19-05-2024]
డబుల్ ఇంజిన్ పాలనతో రాష్ట్ర ప్రగతి తథ్యమని, ప్రధాని మోదీ హయాంలో భారత్ అన్ని రంగాల్లో ముందంజ వేసినట్లు రైల్వే, కమ్యూనికేషన్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. -
పంటను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదే
[ 19-05-2024]
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేంతవరకు కాపాడుకోవాల్సిన బాధ్యత రైతన్నలదేనని సహకార సంఘం డిప్యూటీ డైరెక్టర్ మన్మధకుమార్ దాస్ అన్నారు. -
బిజద పక్షానే రాష్ట్ర ప్రజలు: సీఎం
[ 19-05-2024]
ఒడిశాలో ఎన్నికల ప్రచారం చేస్తున్న భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలపై ముఖ్యమంత్రి నవీన్ విమర్శలు గుప్పించారు. -
రాష్ట్రానికి మోదీ, రాజ్నాథ్, అమిత్షాల రాక
[ 19-05-2024]
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రాత్రి భువనేశ్వర్ చేరుకోనున్నారు. 9 గంటలకు భాజపా అగ్రనేతలతో ఎన్నికల ప్రచార వ్యూహం, ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM