logo

జవాన్‌ల కాల్పుల్లో యువకుడికి గాయాలు

జిల్లాలోని రాయ్‌ఘర్ సమితి హతిగావ్ పంచాయతీ లాపిచేడ గ్రామంలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు కాల్పులు జరిపారు.

Published : 07 May 2024 18:00 IST

నవరంగ్‌పూర్‌: జిల్లాలోని రాయ్‌ఘర్ సమితి హతిగావ్ పంచాయతీ లాపిచేడ గ్రామంలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక యువకుడు గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన శ్రావణ్ గండ్ (24), బిదుగండ్, రామ్ సాయి గండ్, బల్లు గండ్ భోజనం చేసి, చల్లటి గాలి కోసం అడుక వైపుగా వెళ్లారు. హఠాత్తుగా తుపాకీ పేల్చిన శబ్దం వినిపించటంతో ముగ్గురు పరుగులు తీశారు. శ్రావణ్‌కు బుల్లెట్‌ తగిలింది. బాధితుడిని మొదట నవరంగపుర్ ఆసుపత్రికి తరలించారని గ్రామస్థులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు