logo

అనుకూలించిన వాతావరణం.. అభ్యర్థుల్లో ఉత్సాహం

పోలింగు తేదీ దగ్గరపడింది. ప్రచారానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉంది. ఇటీవల తీవ్ర ఎండల కారణంగా ఉదయం, సాయంత్రం, రాత్రివేళల్లో అభ్యర్థులు ప్రచారం చేశారు.

Published : 08 May 2024 01:10 IST

భాజపా అభ్యర్థి కె.అనిల్‌కుమార్‌ ప్రచారం

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: పోలింగు తేదీ దగ్గరపడింది. ప్రచారానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉంది. ఇటీవల తీవ్ర ఎండల కారణంగా ఉదయం, సాయంత్రం, రాత్రివేళల్లో అభ్యర్థులు ప్రచారం చేశారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తూ వాతావరణం చల్లబడింది. దీంతో అభ్యర్థులు ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. బ్రహ్మపుర అసెంబ్లీ బిజద అభ్యర్థి డాక్టర్‌ రమేష్‌చంద్ర చ్యవుపట్నాయక్‌ మంగళవారం ఉదయం స్థానిక 29వ వార్డులో ప్రచారం నిర్వహించారు. హిల్‌పట్నాలోని సిద్ధి వినాయక మందిరం నుంచి ప్రారంభమైన ర్యాలీ వార్డులోని వివిధ వీధుల్లో సాగింది. బీఈఎంసీ మేయరు సంఘమిత్ర దొళాయి, వార్డు కార్పొరేటరు సంజిత్‌ పాణిగ్రహి తదితరులు ఆయన వెంట ప్రచారంలో పాల్గొన్నారు. భాజపా అభ్యర్థి కె.అనిల్‌కుమార్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి దీపక్‌ పట్నాయక్‌ కూడా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థి శిబ శంకర దాస్‌ (పింటు దాస్‌) ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి తనను గెలిపించాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు