రామరాజ్యం భాజపా ధ్యేయం
రామరాజ్యం సుభిక్షానికి మరో పేరని, 500 ఏళ్ల నిరీక్షణ ఫలించి అయోధ్యలో రామాలయం నిర్మాణమైందని, కోట్లాదిమంది భారతీయుల ఆకాంక్ష నెరవేర్చిన మోదీ పాలనా ఫలాలు ప్రతి వ్యక్తి ముంగిళ్లకు చేర్చాలని అహరహం శ్రమిస్తున్నారని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
‘వికసిత్ భారత్‘ ప్రధాని మోదీ ధ్యేయం
ఈసారి ఒడిశాలో కమలాలు వికసిస్తాయి
రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్
భవానీపాట్నాలో ప్రసంగిస్తున్న రాజ్నాథ్సింగ్
భువనేశ్వర్, న్యూస్టుడే: రామరాజ్యం సుభిక్షానికి మరో పేరని, 500 ఏళ్ల నిరీక్షణ ఫలించి అయోధ్యలో రామాలయం నిర్మాణమైందని, కోట్లాదిమంది భారతీయుల ఆకాంక్ష నెరవేర్చిన మోదీ పాలనా ఫలాలు ప్రతి వ్యక్తి ముంగిళ్లకు చేర్చాలని అహరహం శ్రమిస్తున్నారని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. బుధవారం మధ్యాహ్నం కలహండి జిల్లా భవానీపాట్నాలో భాజపా విజయసంకల్ప ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న రాజ్నాథ్ ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధన రానున్న అయిదేళ్లలో సాకారమవుతుందని, మోదీ పాలనలో ఇది సాధ్యమని చెప్పారు. గడిచిన పదేళ్లలో 25 కోట్ల మంది దారిద్య్రరేఖ దాటి వెలుగురేఖలు చూడగలిగారన్నారు. సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ, మన్మోహన్ సింగ్ ‘గరీబీ హఠావో’ నినాదంగా చేసుకున్నారని, వారి మొత్తం పాలనలో జరగని ప్రగతి గడిచిన పదేళ్లలో మోదీ చేసి చూపించారన్నారు. 80 కోట్ల మందికి బియ్యం, గోధుమలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారన్నారు. 370వ అధికరణ రద్దు చేసి జమ్ముకశ్మీరానికి స్వేచ్ఛ, తీన్ తలాక్ చట్టం నుంచి ముస్లిం సోదరినులకు విముక్తి కల్పించడం వంటి సాహసోపేత చర్యలు తీసుకున్న మోదీ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపారని, దీంతో సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నాయని, భారత జవానుల శక్తి, ధైర్య సాహసాలు ప్రపంచ దేశాలు చూశాయన్నారు.
పేదరికానికి బిజద, కాంగ్రెస్ కారణం
గతంలో ఒడిశాలోని కలహండి ఆకలిచావులు జిల్లాగా, దారిద్య్రానికి చిరునామాగా మారిన సమయంలో పాత్రికేయులు రాసిన కథనాలు తాము చదివినట్లు రాజ్నాథ్ గుర్తు చేశారు. 50 ఏళ్ల కాంగ్రెస్, 25 ఏళ్ల బిజద ఈ రాష్ట్రాన్ని పాలించాయని, ప్రాంతీయ అసమానతలు, పేదరికానికి ఈ రెండు పార్టీల పాలకులు జవాబుదారీ అన్నారు. కేంద్రం ఈ రాష్ట్రానికి భారీగా కేటాయింపులు చేస్తున్నా నిధులు సద్వినియోగానికి కావడం లేదని, అవినీతి పెరిగిందన్నారు.
వేదికపై కేంద్రమంత్రికి గజమాలతో సత్కారం
మేనిఫెస్టో సంఘానికి అధ్యక్షుడ్ని
భాజపా ఇతర పార్టీల్లా కాదని, చెప్పింది చేస్తుందన్నారు. ప్రజాహితానికి, సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించి భాజపా ప్రకటించిన మేనిఫెస్టోలో పేర్కొన్నవన్నీ అమలవుతాయన్నారు. తాను మేనిఫెస్టో సంఘానికి అధ్యక్షుడ్ని అని, అందులో చెప్పినవన్నీ చిత్తశుద్ధితో ప్రజల ముంగిళ్లకు చేరుస్తామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు రెండో విడత పోలింగ్
[ 20-05-2024]
రాష్ట్రంలో సోమవారం రెండోవిడత పోలింగ్ నిర్వహించనున్నారు. అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్గఢ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
33 వేల మంది పోలీసులతో బందోబస్తు
[ 20-05-2024]
రాష్ట్రంలో రెండోవిడత పోలింగ్ నేపథ్యంలో 33 వేల మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని, ఈ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ అరుణ్ షడంగి చెప్పారు. -
రాష్ట్రాభివృద్ధే మా అజెండా: నవీన్
[ 20-05-2024]
రాష్ట్రాభివృద్ధే అజెండాగా తాము ముందుకెళుతున్నామని, విపక్షాల మాదిరిగా ఆడి తప్పబోమని, చెప్పింది చేస్తున్నామని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వివరించారు. -
ప్రజాశీస్సులు భాజపాకే ఉన్నాయి: ధర్మేంద్ర
[ 20-05-2024]
ఎన్నికల ధర్మయుద్ధంలో విజయావకాశాలు భాజపాకే ఉన్నాయని, అన్ని చోట్లా ప్రజలు ఆశీర్వదిస్తున్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ రాక నేపథ్యంలో ముందుగా శనివారం రాత్రి భువనేశ్వర్లోని పార్టీ కార్యాలయంలో కార్యవర్గ ప్రతినిధుల సమావేశం జరిగింది. -
చారిత్రక నగరం.. ఎవరికి అందేనో విజయం?
[ 20-05-2024]
చారిత్రక నగరం కటక్ ఈసారి ఎవరి సొంతమవుతుంది? ఓటర్లు ఎవర్ని ఆదరిస్తారు?.. ఇద్దరు ఉద్ధండులు నువ్వా? నేనా? అన్న రీతిలో తల పడుతున్నారు. విజ్ఞతకు నిలువుటద్దమైన ప్రజల తీర్పు ఈసారి ఎలా ఉంటుందన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. -
మీ ముద్దు బిడ్డ దేశం గర్వించదగ్గ యువనేత
[ 20-05-2024]
ఈ రాష్ట్రానికి చెందిన మీ ముద్దుబిడ్డ దేశం గర్వించదగిన నేతగా ఎదిగారని, తన సామర్థ్యం నిరూపించుకున్నారని, ఆయన పనితీరు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ప్రశంసించారు. -
సమీర్ రాజీనామా...
[ 20-05-2024]
పూరీ జిల్లాకు చెందిన బిజద అగ్రనేత, విద్యాశాఖ మాజీ మంత్రి సమీర్ రంజన్ దాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం ఉదయం బిజద ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి నవీన్కు లేఖ పంపించారు. -
నేడు పూరీలో మోదీ రోడ్షో
[ 20-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం 7 గంటలకు భువనేశ్వర్ నుంచి పూరీకి వస్తారు. తాలబణియా తాత్కాలిక హెలిప్యాడ్లో దిగనున్న ఆయన నేరుగా శ్రీక్షేత్రానికి చేరుకుని జగన్నాథుని సన్నిధిలో పూజలు చేస్తారు. -
నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 20-05-2024]
నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బసంత కుమార్ నాయక్ ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని.. తాతను కొట్టి చంపిన మనవళ్లు
-
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
-
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు