logo

Telangana News: కాళ్లపారాణి ఆరకముందే బ్రెయిన్‌స్ట్రోక్‌తో మృత్యుఒడికి..

కాళ్లపారాణి ఆరకముందే ఓ నవ వధువుకు నూరేళ్లు నిండిపోయాయి. మెదక్‌ పట్టణంలోని ఎన్జీవో కాలనీకి చెందిన రాఘవేంద్రకు పార్వతీపురానికి చెందిన ఉష(23) రెండేళ్లుగా ప్రేమించుకుని ఈ నెల 11న హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నారు. కొంగొత్త ఆశలతో,

Updated : 30 May 2022 10:27 IST


ఉష(పాతచిత్రం)

మెదక్, న్యూస్‌టుడే: కాళ్లపారాణి ఆరకముందే ఓ నవ వధువుకు నూరేళ్లు నిండిపోయాయి. మెదక్‌ పట్టణంలోని ఎన్జీవో కాలనీకి చెందిన రాఘవేంద్ర.. పార్వతీపురానికి చెందిన ఉష(23) రెండేళ్లుగా ప్రేమించుకుని ఈ నెల 11న హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నారు. కొంగొత్త ఆశలతో, ప్రేమించిన వాడినే మనువాడానన్న సంతోషంతో నవ వధువు అత్తారింట్లో అడుగుపెట్టింది. అత్తవారి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉన్న సమయంలో శుక్రవారం ఆమెకు తలనొప్పి రావడంతో స్థానికంగా ఓ ప్రైవేటు వైద్యుడికి చూపించారు. అతడి సూచన మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శనివారం సాయంత్రం మూర్ఛ రాగా, ఒక్కసారి తీవ్రమైన గుండెపోటు వచ్చి బ్రెయిన్‌స్ట్రోక్‌కు మరణించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని