916 గ్రామాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు
వర్షాకాలం ప్రారంభంలోనే మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. జిల్లా ఆసుపత్రితో పాటు సాలూరు సీహెచ్సీ, మరికొన్ని పీహెచ్సీల్లో రోగులు కిటకిటలాడుతున్నారు. ఒక్కో మంచంపై ఇద్దరికి చొప్పున చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మున్ముందు
పార్వతీపురం పట్టణం, న్యూస్టుడే: వర్షాకాలం ప్రారంభంలోనే మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. జిల్లా ఆసుపత్రితో పాటు సాలూరు సీహెచ్సీ, మరికొన్ని పీహెచ్సీల్లో రోగులు కిటకిటలాడుతున్నారు. ఒక్కో మంచంపై ఇద్దరికి చొప్పున చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మున్ముందు రాకుండా గ్రామాల్లో చర్యలు చేపట్టినట్లు డీఎంహెచ్వో జగన్నాథరావు తెలిపారు. టైఫాయిడ్, మలేరియా, డెంగీ లాంటి జ్వరాలకు కారణమైన దోమల వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. ఆరోగ్య శాఖ పరిధిలో జిల్లాలో చేపట్టనున్న కార్యక్రమాల గురించి ‘న్యూస్టుడే’కు తెలియజేశారు.
158 గ్రామాలపై ప్రభావం..
జిల్లాలోని 158 గ్రామాల్లో మలేరియా ప్రభావం ఉన్నట్లు గుర్తించాం. 2021లో ఉమ్మడి జిల్లాల్లో 103 మలేరియా, 270 డెంగీ కేసులు నమోదయ్యాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ సారి జ్వరాల అదుపునకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది ఇప్పటివరకు 11 మలేరియా, 50 డెంగీ కేసులొచ్చాయి. వీటిని కట్టడి చేసేందుకు జిల్లాలోని 916 గ్రామాల్లోనూ డ్రైడే పాటించేలా అవగాహన కల్పించాం. పరిసరాల్లో నీరు నిల్వలు లేకుండా చూడటం, దోమ లార్వా నాశనం చేయడం, దోమ తెరలు వినియోగించేలా చూస్తాం.
కొవిడ్పై అప్రమత్తం
ఇటీవల పలు చోట్ల కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీనిలో భాగంగా జిల్లాలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. మాస్కులధారణ, శానిటైజేషన్, దూరం పాటించడం మొదలైన వాటిపై అవగాహన కల్పిస్తున్నాం. ఇంకా ఎవరైనా టీకాలు వేసుకోకపోతే సమీప పీహెచ్సీలోసంప్రదించాలి. ఇప్పటికే గ్రామాల్లో జ్వరాల సర్వే చేపట్టాం. కేసులు నమోదైతే కొవిడ్ పరీక్షలు చేస్తున్నాం.
పీహెచ్సీల్లో 24 గంటల సేవలు..
వర్షాకాలంలో గ్రామాల్లో తాగునీరు కలుషితం అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కాచిన నీటినే తాగాలి. ఇళ్ల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడపడితే అక్కడ నీరు తాగితే పచ్చకామెర్లు, అతిసారం బారిన పడే ప్రమాదం ఉంది. ఈ నెల 23 వరకు గ్రామాల్లో అవగాహన కల్పించాం. దీంతో పాటు రోగులకు అందుబాటులో ఉండేలా 37 పీహెచ్సీల్లో 24 గంటల పాటూ సేవలు అందిస్తున్నాం. వైద్యులు లేని మూడు చోట్ల డిప్యుటేషన్పై నియమించాం.
దోమ తెరలపై అవగాహన
మలేరియా, డెంగీ జ్వరాలు బయట పడిన వెంటనే బాధితులకు తక్షణ వైద్య సేవలు అందిస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో నమూనాలు సేకరించి చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల కొమరాడ మండలం సర్వపాడులో మలేరియా కేసులు బయట పడిన వెంటనే శిబిరాలు ఏర్పాటు చేయించాం. తాగునీరు, పారిశుద్ధ్యం మెరుగుపరిచాం. ఆశా వర్కర్లను అప్రమత్తం చేశాం. కొన్ని గ్రామాల్లో దోమ తెరలను వినియోగించకుండా మొక్కలకు రక్షణగా పెడుతున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం.
రక్తలేమి కేసులు..
జిల్లాలో రక్తహీనతతో మాతృశిశు మరణాలు సంభవిస్తున్నాయి. ప్రసవానికి వచ్చే 60 శాతం మంది మహిళల్లో ఈ సమస్య కనిపిస్తోంది. 14 గ్రాముల హెచ్బీ ఉండాల్సిన చోట 11 గ్రాముల లోపు ఉంటోంది. అంగన్వాడీల్లో అందించే పోషకాహారం సక్రమంగా తింటే రక్తలేమిని అధిగమించొచ్చు. నెలలో ఇచ్చే 30 గుడ్లు ఇంటిల్లిపాది కాకుండా గర్భిణి మాత్రమే తినాలి. దీంతోపాటు పీహెచ్సీల్లో ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కో పీహెచ్సీలో 10 వరకు జరగాలని లక్ష్యాలు నిర్దేశించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోతలరాయ.. ఎత్తిపోతల నీరేదయ్యా
[ 27-04-2024]
ముఖ్యమంత్రి జగన్కు రైతుల సమస్యలు ఏమాత్రం పట్టడం లేదు. బహిరంగ సభల్లో బాకా ఊదడం మినహా అన్నదాతల జీవితాల్లో ఎలాంటి వెలుగులు నింపడం లేదు. -
నామపత్రాల పరిశీలన పూర్తి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అరకు పార్లమెంటరీ, నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో గురువారం వరకు దాఖలైన నామపత్రాలను రిటర్నింగ్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
[ 27-04-2024]
రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర పోలీసు పరిశీలకుడు దీపక్మిశ్రా అన్నారు. -
వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పాలి
[ 27-04-2024]
వైకాపా అరాచక పాలనకు ప్రజలే ఓటుతో బుద్ధి చెప్పాలని కూటమి అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిని కొత్తపల్లి గీత, కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని తోయక జగదీశ్వరి పిలుపునిచ్చారు. -
వైనాట్ 175 కాదు.. వైకాపాకు 17
[ 27-04-2024]
జనసేన స్టార్ క్యాంపెయినర్ పృథ్వీరాజ్పాలకొండ, గ్రామీణం, న్యూస్టుడే: రాష్ట్రంలో కూటమి గెలుపు తథ్యమని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఖాయమని జనసేన స్టార్ క్యాంపెయినర్, సినీనటుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. -
వైకాపాతో యువతకు నష్టం: కిమిడి
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, యువతకు ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్లిపోయారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు -
ఇంజినీరింగ్ విద్య.. ఓ జగన్మాయ
[ 27-04-2024]
నా ఎస్సీలు.. నా ఎస్టీలంటూనే వారిపై కపట ప్రేమ చూపించి ఆయా వర్గాల వారికి తీవ్ర అన్యాయం చేశారు సీఎం జగన్మోహన్రెడ్డి. తన సొంత కుటుంబంగా భావించి గిరిజనులకు మంచి చేస్తానని, వారి జీవితాల్లో వెలుగులు నింపుతానంటూ ప్రేమ ఒలకబోసి దెబ్బ కొట్టారు. -
ప్రజల వద్దకే సేవలంటే ఇలాగేనేమో..
[ 27-04-2024]
గ్రామీణ ప్రజలకు సేవలు మరింత చేరువ చేస్తాం.. ప్రభుత్వ కార్యకలాపాలు అందుబాటులో ఉంచుతాం.. అందుకే గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం.. -
వీటిని చూస్తే.. పేకమేడలే సిగ్గు పడవా!!
[ 27-04-2024]
పేదలకు అన్ని వసతులతో కూడిన ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి.. రేపోమాపో కూలిపోయే పేకమేడలు నిర్మిస్తున్నారు. -
అభివృద్ధిపైనా అక్కసేనా?
[ 27-04-2024]
ప్రభుత్వాలు మారినా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.. ఇందుకు విరుద్ధంగా ఉంది వైకాపా ప్రభుత్వం తీరు.. ప్రజల అవసరాలతో పని లేదన్నట్లు గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులు నిలిపేసి అక్కసు ప్రదర్శించింది.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM