‘రాష్ట్రంలో మాఫియా పాలన’
ప్రజా సంక్షేమాన్ని మరిచిన రాష్ట్ర ప్రభుత్వం మాఫియాగా మారి పరిపాలన సాగిస్తోందని భాజపా జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ ఆరోపించారు. ప్రజాపోరు యాత్రను పార్వతీపురం పట్టణం, మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించారు. ఇసుక, భూములను వైకాపా నాయకులు ఆక్రమిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న సునీల్ దేవధర్, పక్కన నాయకులు
పార్వతీపురం పురపాలక, గ్రామీణం, న్యూస్టుడే: ప్రజా సంక్షేమాన్ని మరిచిన రాష్ట్ర ప్రభుత్వం మాఫియాగా మారి పరిపాలన సాగిస్తోందని భాజపా జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ ఆరోపించారు. ప్రజాపోరు యాత్రను పార్వతీపురం పట్టణం, మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించారు. ఇసుక, భూములను వైకాపా నాయకులు ఆక్రమిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేంద్ర నిధులు వినియోగించి ప్రధాని మోదీ చిత్రాన్ని రాష్ట్రం విస్మరించడం సముచితం కాదన్నారు. రావాలి జగన్.. కావాలి జగన్ అన్న ప్రజలు మూడున్నరేళ్లకే పోవాలి జగన్ అనేలా అధ్వాన పాలన సాగుతోందన్నారు. గ్రామాల్లో పాస్టర్లకు జీతాలు ఇస్తూ వారితో మతమార్పిడికి వైకాపా పాల్పడుతోందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో జనసేనతో కలసి పోటీ చేస్తామని ఆయన చెప్పారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాసరావు, నాయకులు ఎన్.జయరాజ్, కె.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాతో యువతకు నష్టం: కిమిడి
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, యువతకు ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్లిపోయారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు -
ఇంజినీరింగ్ విద్య.. ఓ జగన్మాయ
[ 27-04-2024]
నా ఎస్సీలు.. నా ఎస్టీలంటూనే వారిపై కపట ప్రేమ చూపించి ఆయా వర్గాల వారికి తీవ్ర అన్యాయం చేశారు సీఎం జగన్మోహన్రెడ్డి. తన సొంత కుటుంబంగా భావించి గిరిజనులకు మంచి చేస్తానని, వారి జీవితాల్లో వెలుగులు నింపుతానంటూ ప్రేమ ఒలకబోసి దెబ్బ కొట్టారు. -
ప్రజల వద్దకే సేవలంటే ఇలాగేనేమో..
[ 27-04-2024]
గ్రామీణ ప్రజలకు సేవలు మరింత చేరువ చేస్తాం.. ప్రభుత్వ కార్యకలాపాలు అందుబాటులో ఉంచుతాం.. అందుకే గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం.. -
వీటిని చూస్తే.. పేకమేడలే సిగ్గు పడవా!!
[ 27-04-2024]
పేదలకు అన్ని వసతులతో కూడిన ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి.. రేపోమాపో కూలిపోయే పేకమేడలు నిర్మిస్తున్నారు. -
అభివృద్ధిపైనా అక్కసేనా?
[ 27-04-2024]
ప్రభుత్వాలు మారినా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.. ఇందుకు విరుద్ధంగా ఉంది వైకాపా ప్రభుత్వం తీరు.. ప్రజల అవసరాలతో పని లేదన్నట్లు గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులు నిలిపేసి అక్కసు ప్రదర్శించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?