logo

రెవెన్యూ సమస్యలపై దృష్టి

జిల్లా ఆవిర్భవించక ముందే ఇక్కడ పనిచేసిన అనుభవం ఉందని సంయుక్త కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు అన్నారు. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.

Published : 02 Jun 2023 02:45 IST

పార్వతీపురం, న్యూస్‌టుడే: జిల్లా ఆవిర్భవించక ముందే ఇక్కడ పనిచేసిన అనుభవం ఉందని సంయుక్త కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు అన్నారు. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు మరోసారి సేవ చేసే అవకాశం కలిగిందన్నారు. వారికి రెవెన్యూ సేవలు, ప్రభుత్వ ప్రాధాన్య పథకాలను చేరువ చేస్తామన్నారు. జిల్లాలో రీసర్వే ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రగతి కోసం పనిచేస్తే లక్ష్యాలను చేరుకోగలమన్నారు. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంలో వచ్చే రెవెన్యూ సమస్యలకు పరిష్కారాలు చూపే దిశగా యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తామని జేసీ గోవిందరావు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని