logo

కమనీయం.. పుష్పాభిషేకం

భీమసింగి సహకార చక్కెర కర్మాగార  పరిధిలోని కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం అర్ధరాత్రితో ముగిశాయి.

Published : 06 Jun 2023 03:04 IST

ముగిసిన వెంకన్న బ్రహ్మోత్సవాలు

పూల అలంకరణతో ఆకట్టుకున్న కల్యాణ వేంకటేశ్వర స్వామి

జామి, న్యూస్‌టుడే: భీమసింగి సహకార చక్కెర కర్మాగార  పరిధిలోని కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం అర్ధరాత్రితో ముగిశాయి. సింహాచలం  వేదపండితుల ఆధ్వర్యంలో స్వామికి పుష్పాభిషేకం నిర్వహించారు. మూలవిరాట్టును ప్రత్యేకంగా పూలదండలతో అలంకరించారు. ఆలయ కమిటీ సభ్యులు జడ్పీటీసీ సభ్యురాలు గొర్లె సరయు, వైకాపా మండల అధ్యక్షుడు జి.రవికుమార్‌, డీసీసీబీ డైరెక్టర్‌ పాండ్రంగి సంజీవి, కుమరాం సర్పంచి పిన్నింటి ఆదిలక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు కంది పద్మావతి తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసిన భక్తులకు ఆలయ కమిటీ ధన్యవాదాలు తెలిపింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని